వడదెబ్బతో వృద్ధురాలు మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధురాలు మృతి

Published Mon, Jun 1 2015 10:41 AM

Heat Wave Kills Older Women in guntur

గుంటూరు: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం చంగిజ్‌ఖాన్‌పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడా ఝాన్సీ(59) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూలికి వెళ్లడానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది.
 

Advertisement
Advertisement