రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం
ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు
పెరుగుతున్న టీటీడీ బడ్జెట్..హుండీ కానుకలు
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ఆదాయం చరిత్రలో తొలిసారిగా రూ.వెయ్యి కోట్లు దాటింది. 2015-2016 వార్షిక బడ్జెట్లో రూ.905 కోట్లు మాత్రమే రావచ్చని అంచనా వేయగా ఇప్పటికే రూ.1,010 కోట్లు వచ్చాయి. 2003-2004 వార్షిక బడ్జెట్ రూ.590 కోట్లు ఉండగా పదమూడేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర రెట్లతో 2016-2017కు రూ. 2,678 కోట్లకు పెరిగింది. అలాగే హుండీ ఆదా యం అప్పట్లో రూ.227 కోట్లు ఉండగా ప్రస్తు తం సుమారు ఐదు రెట్లు రూ. 1,010 కోట్లకు పెరి గింది. అలాగే అప్పట్లో 2003-2004లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ సుమారు రూ.50 కోట్లు ఉండగా (డిపాజిట్లు సుమారు రూ.12వేల కోట్లు), 2016-2017 ఆర్థిక సంవత్సరానికి పదిహేను రెట్లు పెరిగి రూ.778.93 కోట్లు రావచ్చని అంచనా వేశారు.
రూ.1.34 లక్షలతో మొదలై...
1951 నవంబర్ నెల మొత్తంగా స్వామివారికి ఆలయ హుండీ ద్వారా లభించిన కానుకలు 1,34,256 రూపాయల 9 అణాల 11పైసలు మాత్రమే. ప్రస్తుతం రోజుకు రూ. 2 నుంచి 3 కోట్లు దాటుతుండటం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో హుండీ ద్వారా నెలకు రూ.80 కోట్లు లభిస్తుం డగా, మిగిలిన నెలల్లో సరాసరిగా రూ. 55 నుంచి రూ.60 కోట్లు లభిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు లభిస్తుండ టం పెరిగింది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఈ నెలల్లో ఆదా య పన్ను పద్దులు చూపిం చే సమయం కావటం వల్ల సంపన్నులు ఆ మొత్తాలను హుండీలో సమర్పిస్తున్నట్టు ప్రచారముంది.
రూ.12వేల కోట్లపైనే డిపాజిట్లు
2016-2017సంవత్సరానికిగాను రూ. 2678 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. ఇందులో డిపాజిట్లపై వడ్డీ సుమారు రూ.778.93 కోట్ల రావచ్చని టీటీడీ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అంటే.. పెట్టుబడులపై తొమ్మిది శాతం వడ్డీ లెక్కిస్తే శ్రీవారి నికర డిపాజిట్లు సుమారుగా రూ.12వేల కోట్ల పైమాటే. పెట్టుబడులపై వచ్చే వడ్డీని టీటీడీ విని యోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలోనే తిరి గి డిపాజిట్ల కింద జమ చేసేస్తుండటంతో నిధులు బాగా పెరుగుతున్నాయి.
శ్రీపతికి సిరుల పంట
Published Sat, Feb 13 2016 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement