నిజామాబాద్ అర్బన్ , న్యూస్లైన్: జిల్లాలో సోమవారం కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పలు మండలాలలో పంటలు ధ్వంసమయ్యాయి. మహా వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోయాయి. జనజీవనానికి విఘాతం కలిగింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మొక్కజొన్న, వరి, సజ్జ, జొన్న, టమాట, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాలలో ఆరబోసిన పసుపుకొమ్ములు తడిసి ముద్దయ్యాయి. భీమ్గల్ మండలం బాచన్పల్లిలో వడగండ్లతో, పొలాలలో పేడ ఎరువు కోసం నిలిపిన 11 ఆవు లు చనిపోయాయి. దీంతో, రైతు నారాయణ విషాదం లో మునిగిపోయాడు.
ముచ్కూర్లో బస్టాండ్ సమీపంలో వందల ఏళ్ల నాటి మర్రి మహా వృక్షం పక్కనే ఉన్న రెండు కోకాలపై విరుచుకు పడింది. ఈ సమయంలో కోకాలలో ఉన్న నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలుకాగా ప్రమాదాన్ని పసిగట్టిన గ్రామస్తులు వారిని హుటాహుటిన బయటకు లాగారు. త్రుటిలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కమ్మర్పల్లి మండలంలో 84 హెక్టార్లలో మొక్క జొన్న, 186 హెక్టార్లలో జొన్న, 117 హెక్టార్లలో నువ్వు, 422 హెక్టార్లలో సజ్జ, 125 హెక్టార్లలో వరి పంటలకు నష్ట వాటిల్లినట్లు వ్యవసాయాధికారు లు తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో సుమారు 13వందల ఎకరాలకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.
అంతా జలమయం
జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, బాన్సువాడ మండలాలలో దాదాపు గంటసేపు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మాక్లూర్ మండలం లో రాళ్ల వర్షం కురిసింది. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, వేల్పూరు ప్రాంతంలో వాన కలకలం సృష్టించింది. మోర్తాడ్లో గంటసేపు నిలకడగా వర్షం కురిసింది.
బోధన్లో ట్రాన్స్కో అధికారులు గంటలతరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎల్లారెడ్డిలో గం టన్నర సేపు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలో రాత్రి ఏడు గంటలకు వర్షం ప్రారంభమై రెండు గంటల పాటు వర్షం కురిసింది. శివాజీనగర్లో చెట్లు నేలకొరిగాయి. రోడ్లన్నీ జలమయ్యామయి. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలువడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అకాల వర్షం.. అపార నష్టం
Published Tue, Mar 4 2014 2:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement