- ఇదీ వెలుగు పాఠశాల
- విద్యార్థినుల పరి(దు)స్థితి
- అపరిశుభ్రంగా వంటశాల, మరుగుదొడ్లు
- రెండు రోజులుగా విద్యార్థినులు అస్వస్థత
- గోప్యంగా ఉంచుతున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
లక్కిరెడ్డిపల్లె: స్థానిక వెలుగు పాఠశాలలో విద్యార్థినులు సమస్యలతో సతమతమవుతున్నారు. రెండు రోజుల నుంచి కొందరు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ‘సాక్షి’కి తెలియడంతో పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లగా.. అక్కడ అపరిశుభ్ర వాతావర ణం కనిపించింది. తరగతి గదులు, భోజనశా ల, వంటశాల, పాఠశాల ఆవరణం చెత్తా చెదారంతో పేరుకుపోయాయి. విద్యార్థినులు నివసిస్తున్న డార్మెటరీ నుంచి సిక్రూం, మరుగుదొడ్లు వరకు భరించలేని కంపు కొడుతున్నాయి.
ప్రిన్సిపాల్తో కలిసి పాఠశాలను
పరిశీలించిన ‘సాక్షి’: ప్రిన్సిపాల్ పరమేశ్వరీతో కలిసి పరిశీలించి అపరిశుభ్రతపై ఆమెను అడగ్గా.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా అందుబాటులో వుండక పోవడంతో ఐదు, ఆరు రోజులకొక్కసారి శుభ్రం చేస్తుంటారని చెప్పుకొచ్చారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను కలుద్దామని ‘సాక్షి’.. ప్రిన్సిపాల్ను అడగ్గా మా పాఠశాలలో అలాంటిది ఏమీ లేదని, మీకు ఎవ్వరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె పేర్కొంది. అయినా ‘సాక్షి’ సిక్ రూం, హౌస్రూంలకు వెళ్లి చూడగా అప్పటికే అక్కడి నుంచి విద్యార్థులను ఉపాధ్యాయులతో కలిసి బయటకు పంపివేశారు. అయితే ఆరుగురు వాంతులు, విరేచనాలతో, ఇద్దరు కామెర్లతో, మరో ముగ్గురు జ్వరంతో బాధ పడుతున్నట్లు కొందరు విద్యార్థుల ద్వారా తెలిసింది. వీరికి స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
భోజనశాలలో ఈగల మోత:
ఇదిలా ఉండగా.. మధ్యాహ్న భోజనం సమయం కావడంతో ఆమెతోపాటు భోజనశాలకు వెళ్లి చూడగా.. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా దాపురించింది. ఎక్కడైనా మనుషులతో కలిసి భోజనం చేస్తారు. కానీ అక్కడ మాత్రం విద్యార్థులు కాకులతో కలిసి భోజనం చేయాల్సి రావడం బాధకరం. విపరీతమైన ఈగలు, దోమలు, కాకులు, కొందరు విద్యార్థులు చేసుకున్న వాంతులతో భరించలేని దుర్వాసనలో భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఒక్కొక్క ప్లేట్లో ఇద్దరేసి అది కూడా సగం పగిలిపోయిన ప్లేట్లలో విద్యార్థులు భోజనం చేస్తుండగా.. వారిని ప్లేట్లు ఇవ్వలేదా అని అడగ్గా గతంలో వున్న వారికి మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు వచ్చిన వారికి ఇంకా ఇవ్వలేదని తెలిపారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం:
రెండు సిన్టెక్స్ ట్యాంకర్లను బయట ఎండలో వుంచారు. అవి మరుగు దొడ్లకు సమీపంలో నేలపై ఉంచడంతో కుళాయిలు మురుగు నీటిలో కలిసిపోయి దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు ఆ మురుగు నీటిలోని కుళాయి ద్వారానే తాగునీటిని పట్టుకుని తాగుతున్నారు. పాఠశాల ఆవరణమంతా చెత్తా చెదారంతో నిండిపోయి కనిపిస్తున్నా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వీరు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే మరింత మంది విద్యార్థినులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
కాకులతో సహపంక్తి భోజనం..సమస్యలతో సహవాసం
Published Fri, Sep 4 2015 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement