హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనంగా మారింది. అయినా దీని ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలో సోమవారం, మంగళవారం అక్కడక్కడా చెదురుముదురు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలియజేసింది.