భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్ | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్

Published Thu, Sep 18 2014 3:19 PM

భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్ - Sakshi

గుంటూరు: భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది.

నల్లపాడు-పేరేచర్ల మధ్య రైల్వేట్రాక్‌ కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తాటికొండలో కొండవీటివాగు ఉగ్రరూపం దాల్చింది. కొండవీటివాగులో ఓ యువతి గల్లతైంది. ప్రత్తిపాడులో చెరువు పొంగి పక్కనేవున్న ఎస్సీకాలనీలోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement