నవంబర్ నుంచి హెల్మెట్ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

నవంబర్ నుంచి హెల్మెట్ తప్పనిసరి

Published Wed, Oct 28 2015 7:02 PM

నవంబర్ నుంచి హెల్మెట్ తప్పనిసరి

సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసి పక్కాగా అమలుచేస్తామని రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం చెప్పారు. బుధవారం విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 1 నుంచి హెల్మెట్ ధరించని వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తారన్నారు. తొలుత రూ. 100 జరిమానా విధిస్తారని, మళ్ళీ అదే వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లు గుర్తిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో దీనిని పక్కాగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. వాహనదారులు స్వచ్ఛందంగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఈ విషయంలో రవాణా శాఖ పోలీసులతో కలిసి పనిచేస్తుందని, ప్రమాదాల నిరోధానికే దీనిని అమలుచేస్తున్నామని వివరించారు.

Advertisement
Advertisement