ఆమె సాగర సాహసి... అలలు ఆమె నేస్తాలు.. ఎక్కడి ఆస్ట్రేలియా! ఎక్కడి భారతదేశం! ఇంకెక్కడి జర్మనీ! నేలపైనే కలవరపెట్టే ఈ దూరాన్ని ఆమె కడలిలో అధిగమించింది. ఓ మామూలు తెడ్డు పడవలో ఒంటరి ప్రయాణం చేస్తూ దూరతీరాన ఉన్న ఆస్ట్రేలియా నుంచి ఆంధ్ర తీరానికి చేరుకుంది. సడలని సంకల్పంతో జర్మనీ దిశగా పురోగమిస్తోంది. మూడేళ్లుగా సాహస యాత్ర సాగిస్తున్న 41 ఏళ్ల శాండీ రాబ్సన్ ఉత్సాహం అబ్బుర పరుస్తోంది.
పాయకరావుపేట: శాండీ రాబ్సన్.. ఆస్ట్రేలియాకు చెందిన సామాన్య మహిళ.. 46 ఏళ్ల శాండీకి ప్రకృతి అంటే ప్రాణం.. అందునా కయాకింగ్ (తెడ్డు పడవపై ప్రయాణం) అంటే ఆమెకు అవధుల్లేనంత ఇష్టం. అందుకే ఆస్ట్రేలియా నుంచి జర్మనీ వరకు కయాక్తో చేరుకోవాలని ఆమె సంకల్పించారు. 2011 మే14న ఆస్ట్రేలియా తీరం నుండి యాత్రను ప్రారంభించిన ఆమె మూడేళ్లుగా ఎన్నో కష్టనష్టాలు తట్టుకుంటూ నిర్విరామంగా సాహస యాత్ర సాగిస్తున్నారు.
ఆంధ్ర తీరం వెంబడి పయనిసున్న శాండీ పెంటకోట లైట్హౌస్ ప్రాంతానికి మంగళవారం సాయంత్రం చేరుకున్నారు. వారం క్రితమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనట్టు చెప్పారు. పెంటకోట తీర ప్రాంతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడమే కాకుండా, కాస్త నలతగా ఉండడంతో విశ్రాంతి కోసం శాండీ తీరానికి చేరుకున్నారు. తాను ప్రత్యేకంగా తెచ్చుకున్న నెట్ ఏర్పాటు చేసుకుని లైట్హౌస్ వద్ద విశ్రమించారు. పెంటకోట మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు.
ఈసందర్భంగా శాండీ రాబ్సన్ విలేకరులతో మాట్లాడుతూ తన యాత్రలో సాగరతీరంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నాయి. ఒక్కో ప్రాంతాన్ని దాటుతూ వస్తున్న తనను భారతీయులు ఎంతో ఆత్మీయంగా చూసుకుంటున్నారని చెప్పారు.
మచిలీపట్నం ప్రాంతంలో మాత్రం మత్స్యకారుల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయని, కొందరు తన బోటుకు నష్టం కలిగించారని చెప్పారు. పగటి వేళ సాగరయాత్ర చేసి చీకటి పడే సమయానికి తీరంలో గ్రామాలకు చేరుకుని బస చేస్తున్నట్టు చెప్పారు. సముద్రంలో సాహస యాత్ర చేస్తున్న శాండీ రాబ్సన్ను చూసేందుకు పెంటకోట ప్రాంతీయులు తరలి వచ్చారు.
కడలి ఆమెకు నెచ్చెలి
Published Thu, Jun 19 2014 12:15 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement