Sakshi News home page

శ్రీవారి సేవలో నితిన్

Published Thu, Aug 18 2016 1:55 PM

శ్రీవారి సేవలో నితిన్ - Sakshi

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని టాలీవుడ్ హీరో నితిన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న నితిన్‌కు అధికారులు స్వామివారి దర్శన ఏర్పట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపం వద్ద స్వామి తీర్థ ప్రసాదాలు అందిచారు. ఈ సందర్భంగా నితిన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు ఉత్సాహం కనబరిచారు. కాగా ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement