శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్

Published Fri, Jul 31 2015 7:39 PM

High Court Judge SV Bhat visits Tirumala

తిరుమల : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు.

అలాగే హుండీలో కానుకలు సమర్పించారు. జస్టిస్ ఎస్వీ భట్‌కు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. రంగనాయక మండపంలో వేదపండితులు జస్టిస్‌కు ఆశీర్వచనం చేశారు.

Advertisement
Advertisement