కామారెడ్డి, న్యూస్లైన్ : డ్రైవర్లకు ‘టిమ్స్’ విధానాన్ని తొలగించాలని ఇటీవల హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. అయినా యాజమాన్యం దీనిని పట్టించుకోవడం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడ వంటి బస్సులలో కండక్టర్లను తొలగించి డ్రైవర్లే టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికుడికి ఒక రూపాయి చొప్పు న డ్రైవర్లకు కమీషన్ ఇస్తామని యాజమాన్యం ఆశ చూపింది.
దీంతో సహజంగానే వారు డ్యూటీలు చేయడానికి ఆసక్తి చూపారు. కండక్టర్ల అవసరం తగ్గిపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలూ కోల్పోయారు. రాష్ర్టవ్యాప్తంగా టికెట్టు ఇష్యూ మిషన్స్ (టిమ్స్) వాడే బస్సులు 3,500 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. టిమ్స్ వాడకంతో 4,550 మందికి ఉపాధి లేకుండాపోయిందని సమాచారం. ఒక్క నిజామాబాద్ రీజియన్లోనే వందకు పైగా టిమ్స్ సర్వీసులున్నట్టు తెలిసింది. ఈ జిల్లాలో 130 మందికిపైగా నిరుద్యోగులు కండక్టర్ ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడింది.
హైకోర్టు తీర్పునూ పట్టించుకోని ఆర్టీసీ
డ్రైవర్లు బస్సులు నడుపుతూ ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే సందర్భంలో డ్రైవర్ దృష్టి స్టీరింగు నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు అభద్రతకు లోను కావాల్సి వస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ‘ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కండక్టరు విధులు డ్రైవర్కు ఇవ్వరాదు’ అని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు ఫుల్ బెంచ్కు అప్పీలు చేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు న్యాయమైనదేనని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు ఫుల్ బెంచ్ ఆర్టీసీ అప్పీల్ను తిరస్కరించింది. యాజమాన్యం మాత్రం కోర్టు తీర్పును బేఖాతర్ చేస్తూ డ్రైవర్లతో కండక్టర్ డ్యూటీలు చేయిస్తోంది. ఇప్పటికే కండిషన్ లేని బస్సులతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ‘టిమ్స్’ విధానమూ తోడుకావడంతో వారు మరింత పని ఒత్తిడికి గురవుతున్నారు. కండక్టర్లను తగ్గించుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుందని సంస్థ భావించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాలు టిమ్స్ ఇబ్బందుల విషయాన్ని పట్టించుకోకపోవడం కార్మికులను ఇబ్బంది పెడుతోంది.
Breadcrumb
Related news
-
డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చి రద్దీ పెరగడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ట్రామ్ తరహాలో రెండు కోచ్లుగా ఉండే వెస్టిబ్యూల్, డబుల్ డెక్కర్ బస్సు లు నగరం వెలుపల నడపడం, ప్రస్తుతం నడు స్తున్న బస్సులు కాకుండా 12 మీటర్ల పొడవుండే భారీ వెడల్పాటి బస్సులు కొనుగోలు చేయడం తదితర అంశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే దాదాపు 10 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగి మొత్తం ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు దాటింది. సోమ వారాల్లో అయితే ఇది 50 లక్షలను మించుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం నమోదవుతోంది. మరోవైపు పురుషులకు చోటుండటం లేదు. ఈ నేపథ్యంలో పెరిగిన రద్దీని సులభంగా తట్టుకుని ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ ప్రతినిధులు మరో రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అందులోని సిఫారసులకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది. నగరంలోనా? వెలుపలా? ప్రస్తుతం ఆర్టీసీలో 9,300 బస్సులున్నాయి. వీటిల్లో 3 వేలకు పైగా పాతబడి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 వేల వరకు బస్సులు కొనాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బస్సులకు బదులు పెద్ద బస్సులు కొంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 11 మీటర్ల పొడవు బస్సులకు బదులు 12 మీటర్ల బస్సులు కొంటే అదనంగా నాలుగు సీట్లు కలిసి వస్తాయి. వెడల్పు ఎక్కువగా ఉండటంతో నిలబడే స్థలం పెరుగుతుంది. ఇక ఒకదాని వెనక మరొకటిగా రెండు కోచ్లతో ఉండే వెస్టిబ్యూల్ బస్సులు కొంటే ఒకేసారి ఎక్కువమందిని తరలించే వీలుంటుంది. డబుల్ డెక్కర్లో కూడా ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటిని నగరం వెలుపల విశాలమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ నగరంలో అయితే ఏయే రూట్లు ఇందుకు యోగ్యంగా ఉంటాయో కూడా గుర్తిస్తున్నారు. 4 వేల బస్సులకు 10 వేల మంది సిబ్బంది కావాలి ఒక బస్సుకు సగటున 2.6 చొప్పున సిబ్బంది. అవసరమన్నది ఆర్టీసీ లెక్క. కొత్తగా 4 వేల బస్సులు కొంటే 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ప్రాతిపదికన బస్సులు తీసు కుంటే సిబ్బంది సంఖ్య అంత అవసరం ఉండదు. కాగా సిబ్బంది పెంపు ఎలా ఉండాలన్న అంశంపై ఓ కమిటీ నివేదిక సిద్ధం చేస్తోంది. అదే సమయంలో బస్సుల నిర్వహణపైనా సంస్థ దృష్టి సారించింది. షాక్ అబ్జార్బర్స్గా పనిచేసే కమాన్ పట్టీలు, టైర్లు, బ్రేక్ లైనర్స్ మన్నిక పెంచేందుకు ఏం చేయాలి? నిర్వహణ వ్యయం, అవసరమైన మెకానిక్లు తదితర అంశాలను మరో కమిటీ పరిశీలిస్తోంది. బస్స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్పై దృష్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అన్నింటిలో టికెట్ జారీ యంత్రాలు వాడుతు న్నారు. వీటి చార్జింగ్కు ఇబ్బంది పడకుండా టిమ్స్ను బస్సుల్లోనే చార్జ్ చేసే సాంకేతికత సమకూర్చుకోవచ్చా? స్మార్ట్ కార్డుల జారీ, విచారణ కేంద్రాలలో ట్యాబ్స్ వినియోగం లాంటి అంశాలపై ఇంకో కమిటీ దృష్టి పెట్టింది. అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా ప్లాట్ఫామ్స్ సంఖ్య పెంచటం, తదనుగుణంగా బస్టాండ్లు, బస్స్టేషన్లను విస్తరించటం, బస్టాండ్లలో వసతుల కల్పన, పెరిగిన దొంగల బెడదను అరికట్టేందుకు భద్రత పెంపు, మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు, మంచినీటి వసతిని మెరుగుపరచటం లాంటి వాటిపై ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. -
ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!
రాయచూర్ వెళ్లే నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సు ఇమ్లీబన్లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్మీట్లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు. ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్ ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు. -
వందేభారత్ X గరుడ ప్లస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైల్వే విస్తరణతో ఆర్టీసీకి పోటీ ఎదురైంది. ఇటీవలే ప్రారంభమైన కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఆదరణ లభించడం.. ప్రతి ట్రిప్పులో దాదాపు 500 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుండటంతో ఇది హైదరాబాద్–బెంగళూరు మధ్య పగటిపూట తిరిగే ఆర్టీసీ గరుడ బస్సులపై కొంత ప్రభావం చూపుతోంది. వందేభారత్ సైతం పగలే పరుగులు తీస్తున్నా కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుతుండటం ప్రజాదరణకు కారణమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ఈ రైలు వైపు మళ్లితే గరుడ ప్లస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులను ఆకర్షించే చర్యలు చేపట్టింది. పక్కాగా డైనమిక్ ఫేర్ సిస్టం... కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎనిమిదన్నర గంటల్లో గమ్యం చేరుకుంటుంటే హైదరాబాద్–బెంగళూరు గరుడ ప్లస్ బస్సు 11 గంటలు తీసుకుంటోంది. దీంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అటు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులపై ప్రభావం పెద్దగా లేకుండా ఉండేందుకు డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వందేభారత్ రైలు టికెట్ చార్జీ (భోజనం చార్జీ లేకుండా) రూ. 1,255గా ఉండగా ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు టికెట్ చార్జీ 1,200గా ఉంది. అందువల్ల డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా వారాంతాల్లో కాకుండా డిమాండ్ తక్కువగా ఉండే సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 880గా మారుతోంది. మంగళ, బుధ, గురువారాల్లో తక్కువ ధర, మిగతా రోజుల్లో కాస్త ఎక్కువ ధర ఉంటోంది. సాధారణ రోజులు, ప్రయాణ సమయం వంటి మొత్తం 44 అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ధరలను రకరకాల మొత్తాలకు తగ్గించి ఆర్టీసీ ఖరారు చేస్తోంది. ఇది ఆటోమేటిక్గా ఖరారయ్యేలా సాంకేతికను వినియోగిస్తోంది. టికెట్ చార్జీ భారీగా తగ్గడంతో బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు రైలు సర్వీసులతో.. ఇక ప్రస్తుతం సిద్దిపేటకు ఆర్టీసీ నిత్యం 15 నిమిషాలకో బస్సు నడుపుతోంది. ఇవి ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. కానీ మరో మూడు రోజుల్లో సిద్దిపేట నుంచి కాచిగూడకు రైలు సర్వీసు ప్రారంభం అవుతోంది. ఒక ట్రిప్పులో వెయ్యి మందిని తరలించే అవకాశం ఉండటంతో ఇది కూడా ప్రభావం చూపుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఇక మహబూబ్నగర్ సమీపంలోని జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా లాంటి ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. అయితే దేవరకద్ర–కృష్ణా మధ్య ఆదివారం నుంచి రైలు సర్విసు ప్రారంభం కానుంది. దీంతో కృష్ణా–కాచిగూడ, సిద్దిపేట–కాచిగూడ రైళ్లు ప్రారంభమయ్యాక వాటిల్లో ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు ఉంటోంది? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎక్కి దిగుతున్నారు లాంటి అంశాలను పరిశీలించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిని నియమించారు. వారు ఈ వివరాలు పరిశీలించి సమాచారం ఇచ్చాక తదనుగుణంగా బస్సుల విషయంలో మార్పుచేర్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
సూపర్ లగ్జరీ ప్రయాణికులపై ‘వాటర్ చార్జ్’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.10 చొప్పున పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం (ఆగస్టు 12) తొలి సరీ్వసు నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతిని ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి అరలీటరు మంచినీటి సీసాను అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి టికెట్ ధరపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. దూరంతో ప్రమేయం లేకుండా ఈ అదనపు మొత్తం చార్జి చేస్తారు. టికెట్ ధరలోనే దాన్ని కలిపేస్తారు. దీంతో ప్రయాణికుడికి మంచినీటి సీసా అవసరం ఉన్నా లేకున్నా ఈ అదనపు చార్జీతో కూడిన టికెట్ తీసుకోవాల్సిందే. నిత్యం లక్ష మంది ప్రయాణికులపై ఈ తాజా నిర్ణయం ప్రభావం చూపనుంది. టికెట్తో పాటే జీవా బాటిల్.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు సాధారణంగా వాటర్ బాటిళ్లు దగ్గర పెట్టుకుంటారు. చాలామంది బస్టాండ్లలో కొంటారు. బయటి నీటిని తాగేందుకు ఇష్టపడని వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గరుడ ప్లస్, గరుడ, లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అరలీటరు పరిమాణంలో ఉన్న నీటి సీసాలను అందించడం ప్రారంభించారు. గతంలో బిస్లరీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ బ్రాండు మంచినీళ్లు అందించేవారు. ఇటీవల జీవా పేరుతో ఆర్టీసీ సొంతంగా ప్యాకేజ్డ్ మంచినీటిని మార్కెట్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్టాండ్లలో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఏసీ బస్సుల్లో కూడా గతంలో ఇచ్చిన బిస్లరీ బాటిళ్లకు బదులు జీవా నీటినే ఇస్తున్నారు. ఇప్పుడు అదే నీటిని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీకి ఏం లాభం? జీవా నీటికి ఇంకా ఆదరణ పెరగలేదు. దీన్ని మార్కెట్లోకి తెచ్చిన సమయంలో సీసా, అందులోని నీటి నాణ్యత విషయంలో ఫిర్యాదులొచ్చాయి. స్వయంగా సొంత సిబ్బందే నాణ్యతపై ప్రశ్నించటంతో, ఒప్పందం చేసుకున్న సంస్థను నాణ్యత విషయంలో సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో కొంతకాలం నిలిపేసి దిద్దుబాటు తర్వాత ఇటీవలే మళ్లీ విడుదల చేశారు. అయితే ఇప్పటికీ అది ప్రయాణికులకు పూర్తిస్థాయిలో పరిచయం కాలేదు. ఈ నేపథ్యంలోనే జీవా బ్రాండ్కు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీని ద్వారా కొంత అదనపు ఆదాయం కూడా లభిస్తుందనేది ఆర్టీసీ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతి అరలీటరు సీసాపై రూ.5.50 చొప్పున, దాన్ని తయారు చేస్తున్న ప్రైవేటు సంస్థకు చెల్లిస్తారు. డ్రైవర్కు ఇన్సెంటివ్గా 50 పైసలు చెల్లిస్తుంది. మిగతా రూ.4ను తన ఆదాయంగా ఆర్టీసీ లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. వీటిల్లో నిత్యం దాదాపు లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన వారిపై రోజుకు రూ.10 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
టికెట్తోపాటు చిరుతిళ్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన ఈ–గరుడ బస్సుల్లో టికెట్తోపాటు చిరుతిళ్లతో కూడిన ఓ డబ్బా (స్నాక్ బాక్స్) ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్–విజయవాడ మధ్య కొత్తగా ప్రారంభమైన 9 ఈ–గరుడ బస్సుల్లో శనివారం నుంచి సరఫరా చేస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తే దూరప్రాంతాలకు తిరిగే ఇతర సర్విసుల్లోనూ దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. టికెట్ ధరపై రూ.30 అదనం.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్తోపాటు అరలీటర్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ను ఉచితంగా అందిస్తోంది. కానీ ఈ చిరు తిండి డబ్బాకు మాత్రం రూ.30 వసూలు చేయబోతోంది. దీన్ని తీసుకునే విషయంలో ప్రయాణికులకు చాయిస్ ఉండదు. చార్జీతోపాటు రూ.30 చేర్చి టికెట్ జారీ అవుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా ఈ బాక్సును తీసుకోవాల్సిందే. డబ్బాలో ఏముంటాయి? ఈ చిరుతిండి డబ్బాలో చిరుధాన్యాలతో చేసిన దాదాపు 25 గ్రాముల ఖాక్రా, 20 గ్రాముల చిక్కీ, 10 గ్రాముల మౌత్ఫ్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటుందని సమాచారం. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నదే. స్పందన బాగుంటే.. చిరుతిళ్ల రకాల్లో, పరిమాణంలోనూ మార్పులుంటాయని సమాచారం. ‘ప్రతి డబ్బాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రయాణికులు చిరుతిండి గురించి ఫీడ్బ్యాక్ను ఈ క్యూఆర్కోడ్ను ఫోన్ ద్వారా స్కాన్ చేసి పంపవచ్చు. ఆ సూచనలను పరిగణలోకి తీసుకుని మార్పుచేర్పులు ఉంటాయి. ఈ డబ్బాను కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయమూ తీసుకుంటాం’అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్లు తెలిపారు.
Related News by category
-
ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజ గ్లాస్ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈసీకి వ్యతిరేకంగా జనసేన కోర్టుకు వెళ్లించింది. దీంతో, ఈ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది.ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది. -
ఒక్క హామీ నెరవేర్చలేదు..!
కదిరి: టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కదిరి ప్రాంతానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంతానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదిరి ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. కొన్నింటికి శిలాఫలకాలు కూడా వేశారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఆ శిలాఫలాకలు ఇప్పటికీ చంద్రన్నను వెక్కిరిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కదిరికి చేసిన మోసాలు, ద్రోహాలు కదిరి ప్రజలు గుర్తు చేస్తున్న వాటిలో మచ్చుకు కొన్ని.. 👉 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కదిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..‘కదిరి నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యరి్థని ఓడించారు. అయినా సరే కదిరి పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కదిరికి రింగ్రోడ్ మంజూరు చేస్తున్నా’ అని చెప్పారు. కానీ అమలు చేయలేదు.👉కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రింగ్రోడ్ తరహాలో కదిరికి రూ.234 కోట్లతో బైపాస్రోడ్డు మంజూరు చేసింది. ఈ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత ఆ మిగిలిన పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.👉తలుపుల మండల పరిధిలోని దాంపల్లి వద్ద చేపట్టిన హంద్రీనీవా మెయిన్ కెనాల్ సొరంగ మార్గం పనులు నా చేత కాదంటూ చంద్రబాబు చేతులెత్తేశారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనులను తిరిగి ప్రారంభించి దిగి్వజయంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఆ కాలువ ద్వారా నీరు పరవళ్లు తొక్కుతున్నాయి.👉 రాయలసీమను కరువు రక్కసి నుంచి కాపాడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఆనాడు వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్టును తెచ్చారు. ఇందులో భాగంగా కదిరి మండలంలోని చెర్లోపల్లి వద్ద రిజర్వాయర్ను ఏర్పాటు చేయించారు. వైఎస్ హయాంలోనే ఈ రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఆ మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి మరో పదేళ్లు పట్టింది. అయితే చంద్రబాబు తన స్వార్థం కోసం 2019 ఎన్నికలకు మునుపు సీఎం హోదాలోనే చెర్లోపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తి కదిరి ప్రాంత రైతులకు అన్యాయం చేసి కృష్ణాజలాలను తన సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించుకెళ్లారు.కదిరి ప్రాంత గిరిజనుల కోసం ‘బంజారా కమ్యూనిటీ భవనం’ నిర్మిస్తున్నామని 2014 జూలై 24న చంద్రబాబు సీఎం హోదాలో శిలాఫలకం వేశారు. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బంజారాల కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం అధికారికంగా అర ఎకరం స్థలం కేటాయించి నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరు చేసింది.కదిరి ప్రాంత పాత్రికేయుల కోసం రూ.5లక్షలతో ప్రెస్క్లబ్ భవనాన్ని నిర్మిస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. 2014 జూలై 25వ తేదీన శిలాఫలకాన్ని కూడా వేశారు. చివరకు ఆ హామీని కూడా నెరవేర్చలేక పోయారు. అప్పట్లో చంద్రబాబు వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ బాబును వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం బాబు హామీలు గుప్పిస్తుంటే జనం ‘నిన్ను నమ్మం బాబు’ అని అంటున్నారు. -
కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా.. కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరుందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2024 -
పెత్తందార్లకు గుత్తేదార్లు..
పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ డీబీటీ రూపంలో 50 నెలల్లో పేదల ఖాతాల్లో రూ.2,31,123.28 కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.2,33,915.92 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు రూ.4,65,039.20 కోట్ల లబ్ధి కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఈ రీతిన ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న పేదలను చూసి ఓర్చుకోలేక.. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దబాయించిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన తానా అంటే తందానా అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారంటూ తప్పుడు రాతలతో పుంఖానుపుంఖాలుగా కథనాలు అచ్చేసిన మీరు పెత్తందార్ల పక్షం కాదా రామోజీ?రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670.05 కోట్ల విలువైన ఇంటి స్థలాలను సీఎం వైఎస్ జగన్ పంపిణీ చేశారు. సెంటు భూమి శవాన్ని పూడ్చటానికి మాత్రమే సరిపోతుందంటూ పేదల సొంతింటి స్వప్నంపై అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా తాను పెత్తందారుడినని చంద్రబాబు చాటుకున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయనకు వంతపాడుతున్న మీది పెత్తందారీ పోకడ కాదా రామోజీ?నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెడితే.. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం కాదా? ఇందుకు మద్దతిస్తూ అక్షరోద్యమం నడిపిన మీరూ ఆ బాపతే కదా రామోజీ? అమరావతి రాజధాని ప్రాంతంలో 50 వేల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. దాన్ని నిరసిస్తూ హైకోర్టులో కేసులు వేయించి.. వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని వాదించేలా చక్రం తిప్పిన చంద్రబాబు పెత్తందారు కాదా? ఆయన్ను సమరి్థస్తూ వరుస కథనాలు వండివార్చిన మిమ్మల్ని పెత్తందారు అనక ఇంకేమనాలి రామోజీ? సీఎం వైఎస్ జగన్.. ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయ పడుతూ, వారి అభ్యున్నతి కోసం నాలుగేళ్లుగా పరితపిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆరి్థకంగా వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. అన్ని పదవుల్లోనూ సింహ భాగం కేటాయిస్తున్నారు. ఇది పెత్తందారీతనమా? లేక ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని చంద్రబాబు వారిని అవమానించడంపెత్తందారీతనమా? తేల్చి చెప్పే ధైర్యముందా రామోజీ? ‘ఈ రోజు రాష్ట్రంలో జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్.. పేదలు ఒక వైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్లు మరో వైపు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు’ అంటూ రాష్ట్రంలో చంద్రబాబు, ఎల్లో మీడియా పోకడలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం.. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాలను కట్టబెట్టడం.. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జాతీయ సంస్థల సర్వేలు నొక్కివక్కాణిస్తుండటం.. వీటన్నింటితో ఇక చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయమని మీరు తీవ్రంగా ఆందోళన చెందుతుండటం నిజం కాదా రామోజీ? విషం చిమ్ముతున్నది అందుకే కదా? మద్యం వ్యసనానికి దూరమవుతున్న పేదలు మద్యం ధరలు షాక్ కొట్టేలా చేస్తాం.. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేస్తాం.. అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు విస్పష్టంగా ప్రకటించారు. అదే విధానాన్ని సమర్థంగా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీరావుకు కంటగింపుగా మారింది. రాష్ట్రంలో 2014–19 మధ్య మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల ప్రైవేటు సిండికేట్ గుప్పిట్లో ఉండేవి. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ పేదలను కొల్లగొట్టేవారు. నిర్ణీత వేళలను పాటించకుండా విక్రయాలు సాగించేవి. ఇప్పుడు ఆ దందాకు చెక్ పెట్టారు. 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. గత సర్కార్ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యనుఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కొత్త బార్లకు లైసెన్స్లు ఇవ్వలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. తద్వారా పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోవడమే అందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్ కేసులు విక్రయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు, 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులు విక్రయించారు. అయినా సరే చంద్రబాబు కోసం ఈనాడు దు్రష్పచారం చేస్తోంది.సామాన్యునికి అందుబాటులో సినీ వినోదంటీడీపీ ప్రభుత్వ హయాంలో సినీ సిండికెట్ సినిమా టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. టికెట్ల గణాంకాలు ఎక్కడా ఉండేవి కావు. ఈ పరిస్థితిలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయాల విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలను అందుబాటులోకి తీసుకువస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. అలా చేస్తే తమ దందాకు చెక్ పడుతుందని భావించిన టీడీపీ అనుకూల సిండికేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా మరోవైపు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల కేటగిరీల్లో సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ 2021 ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది.దీనిపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో హోమ్, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సినీ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ విధానాన్ని రూపొందించింది. ఆ మేరకు సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ 2022 మార్చి 7న జీవో 13 జారీ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలను తొలి వారం రోజులపాటు పెంచుకునేందుకు నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించింది. హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషకాలు కాకుండా సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటితే.. సినిమాలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తే... టికెట్ల ధరలను తొలి పది రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల యావత్ సినీ పరిశ్రమతోపాటు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై కూడా దిగజారుడు రాతలేనా రామోజీ? కార్పొరేట్కు కొమ్ము కాసింది బాబే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ వైద్య కళాశాలలకే పట్టంకట్టారు. టీడీపీ నాయకులు, సానుభూతిపరులకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చి.. వారి జేబులు నింపారు. ఇదంతా అప్పుడు రామోజీ కళ్లకు పచ్చగా కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడం కోసం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే.. దేశంలో ఎక్కడా లేనట్టుగా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి 2017 నుంచి రాజస్తాన్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.రాష్ట్రంలో పాత 12 వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు కొత్త విధానాన్ని అమలు చేయకుండా కేవలం కొత్తగా ఏర్పాటైన కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోగా.. మిగిలిన సీట్లలో 50 శాతం సీట్లను కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. మరో 50 శాతం సీట్లలో 35 శాతం ‘బీ’, 15 శాతం సీట్లను ‘సీ’ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. ఈ సీట్లకు ఫీజుల రూపంలో వచ్చే నిధులను ఆయా కళాశాలల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి కాబట్టే నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా ఏకంగా 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన సీట్లలో 50 శాతం రిజిర్వేషన్ వర్గాలకు కేటాయిస్తున్నారు. అంటే 300కు పైగా సీట్లు కన్వీనర్ కోటాలో ఈ ఏడాది నుంచి పెరిగాయి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మేలు చేయడం కాదా? నేతన్నకు తోడుగా.. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వరుసగా ఐదేళ్లు నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ వారి జీవితాలను మెరుగుపర్చుకున్నారు. నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచి్చంది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఈ మూడు పథకాలకు రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. చేనేత వ్రస్తాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.చేనేతకు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తూ ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ట్రైనింగ్ వంటి గట్టి ప్రయత్నాలతో చేనేత కుటుంబాలకు నైపుణ్యాన్ని మెరుగుపరిచే కృషి చేస్తోంది. శిక్షణతో వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్లు తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వస్త్రాలకు దీటుగా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్ కలి్పంచడం, ఆప్కో షోరూమ్లను విస్తరించి సొసైటీల వద్ద వ్రస్తాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఏపీ చేనేత వ్రస్తాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి(ఓడీఓపీ) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఏకంగా 36 చేనేత వ్రస్తాల ఉత్పత్తిని గుర్తించి వాటికి జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ సాధించేలా కృషి చేస్తోంది. ‘పచ్చ’పొరలు కమ్మిన మీకు ఇవేవి కని్పంచట్లేదా రామోజీ?నాడు చీకట్లు.. నేడు వెలుగులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలతో పాటు, ట్రూ అప్, ఎఫ్ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి వుండగా, 0–100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల విద్యుత్ సరీ్వసులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవారు. ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 0–200కు పెంచింది. దీంతో సర్వీసులు పెరిగాయి. సబ్సిడీ పెరిగింది. 2017–18లో సబ్సిడీ రూ.52.04 కోట్లు ఉండగా, 2022–23కి రూ.189.17 కోట్లకు పెరిగింది.ఇదంతా పేదలకు మేలు చేయడం కాదా రామోజీ? టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి దివాలా తీయించిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఏపీఈఆర్సీకి సమర్పించలేదు. దానికి తోడు డిస్కంలపై ఒత్తిడి తెచి్చ, 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేయించారు. పవన విద్యుత్ యూనిట్ రూ.2.44 ఉన్నప్పుడు రూ.5.94తో ఒప్పందం చేసుకున్నారు. సౌర విద్యుత్ యూనిట్ రూ 2.44కు లభిస్తుంటే (బ్యాక్డౌన్ చార్జీలతో కలిపి అయితే రూ. 3.54) రూ.8.09తో ఒప్పందాలపై సంతకాలు చేశారు. చంద్రబాబు హయాంలో స్లాబుల పేరుతో విద్యుత్ చార్జీల దోపిడీ జరిగేది. ఇవన్నీ మరచిపోయి ఎవరి కోసం విషం కక్కుతున్నారు రామోజీ?ఉన్నతంగా విదేశీ విద్య జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు.. నోబెల్ గ్రహీతలైన టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ వంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద గత ఏడాది 290, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబి్ధపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీ 64, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు 20, ఈబీసీలు 175 మందిఉన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్ సీజన్ కింద ఎంపికైన వారు 67 మంది ఉండగా, వీరిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒక్కరు, బీసీ 13, క్రిస్టియన్ నలుగురు, ముస్లింలు ఎనిమిది మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్కు చెందిన 290 మంది విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. ఆ తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకునే వారు కాదు. గత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునేందుకు 2014–19 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్ల వరకు వెచి్చస్తోంది.పైగా చంద్రబాబు 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను పెట్టారు. ఇప్పుడు నిధుల దురి్వనియోగానికి తావు లేకుండా విద్యార్థి సెమిస్టర్/టర్మ్ పత్రాలు సమరి్పంచగానే ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్ 50లో ఉన్న విద్యా సంస్థలను నిర్ణయించింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్న పరిమితిని తొలగించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పడం రామోజీకే చెల్లింది.ఇంటిపై హక్కులు కలి్పస్తే తప్పా? గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిరి్మంచుకున్న పేదలకు మేలు చేకూర్చేలా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది/రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు యాజమాన్య హక్కులు కలి్పంచింది. దీంతో 22–ఏ జాబితాలో ఉండే స్థలాలపై పేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించాయి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఇళ్లలో నివసించే హక్కు స్థానంలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. స్వచ్ఛందంగా ముందుకు వచి్చన వారికి యాజమాన్య హక్కులను కల్పించారు.వన్టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను అమలు చేసి రుణాల నుంచి విముక్తి కలి్పంచాలని.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల నుంచి విజ్ఞప్తులు వచ్చినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వం పేదల మొర ఆలకించడం లేదంటూ రామోజీరావు ఒక్క రాత కూడా రాసిన పాపానపోలేదు. ఇప్పుడు పేదలపై మితిమీరిన భారం లేకుండా రూ.10వేలు, ఒక వేళ అంతకంటే తక్కువ రుణం ఉంటే అదే మొత్తం చెల్లించిన వారికి, రుణాలు తీసుకోని వారికైతే రూ.10 వంటి నామ మాత్రపు ఫీజులతో ఇళ్లపై యాజమాన్య హక్కులు కలి్పంచారు. రిజి్రస్టేషన్ ఫీజులను మినహాయించారు. ఇది పేదలకు మేలు చేయడం కాదా?ఓట్ల కోసం చంద్రబాబు డ్రామా బాబు హయాంలో 2014 జూన్ నుంచి 2016 అక్టోబర్ వరకు కందిపప్పు పంపిణీయే లేదు. 2016 నవంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికలు దగ్గరపడడంతో 2018 మార్చి నుంచి కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేశారు. మార్కెట్ ఒడిదుడు కులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 నుంచి రూ.160కు చేరింది.ప్రభుత్వం రూ.120కి పైగా కంది పప్పు ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే ఇచి్చంది. నెలకు రూ.56 కోట్లు సబ్సిడీ ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ధరలు పెరగడంతో నాఫెడ్ నుంచి కందులు కొనుగోలు చేసి వాటిని మర ఆడించి సబ్సిడీపై పంపిణీ చేసేలా కసరత్తు చేస్తోంది. సీఆర్ఎస్ కింద హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి తక్కువ ధరకు కందిపప్పు, బియ్యాన్ని విక్రయించే స్టాల్స్ ఏర్పాటు చేసింది. నాణ్యమైన పంచదారను సైతం అందిస్తోంది. అదే చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో సొంత కాంట్రాక్టుదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించి దోచుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. మున్సిపాల్టీల్లో ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని ఇస్తోంది. -
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement