సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్స్ట్రాయ్ జాయింట్ వెంచర్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమా తదితర కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ బుధవారం తీర్పు వెలువరించారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రజాధనం వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. మొదట అనర్హత జాబితాలో చేర్చిన కంపెనీలను తిరిగి అర్హత జాబితాలో చేర్చుతూ రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంటపై సోమా జాయింట్ వెంచర్ హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్స్ట్రాయ్ జాయింట్ వెంచర్కు మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ మధుకాన్ జాయింట్ వెంచర్ మరో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే టెండర్ నిబంధనలను సడలించడాన్ని సవాలు చేస్తూ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మి ఇన్ఫ్రా వేర్వేరుగా 2 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అలీ వాటిని కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించారు.
‘‘పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా ప్రజల చిరకాల వాంఛ. సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని మళ్లించి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో, కోట్ల మందికి ఆనందంతో పాటు సుసంపన్నత కలిగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం తొలుతలోనే ప్రారంభించి ఉంటే ప్రస్తుత అంచనా వ్యయంలో 4వ వంతు ఖర్చుతోనే సాకారమయ్యేది. ప్రస్తుతం కాంట్రాక్టు కేటాయింపులను ఆమోదించడం వల్ల ఇప్పటికైనా రూ. 600 కోట్ల మేర ప్రజాధనం ఆదా అవుతుంది. ఇదేమీ తక్కువ కాదు. ప్రజల తప్పేమీ లేకపోయినా పోలవరం ప్రాజెక్టు సుదీర్ఘ కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి అంతకాలం వేచిచూడాల్సిన అవసరం లేదు.’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
‘పోలవరం’పై పిటిషన్ల కొట్టివేత
Published Thu, Sep 12 2013 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement