సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) లో పాగా వేయాలని యత్నించి టీడీపీ నేతలు భంగపడ్డారు. డీసీసీబీ అధ్యక్షురాలు శ్రీదేవిని తప్పించేందుకు వారు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే ప్రక్రియకు హైకోర్టులో చుక్కెదురైంది. మంగళవారం ఓటింగ్ నిర్వహించాల్సి ఉన్న తరుణంలో హైకోర్టు స్టే ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక.. ఆ పార్టీ నాయకులు పదవుల కోసం అక్రమమార్గం పట్టారు.
పైరవీలు చేసి.. బెదిరింపులకు పాల్పడి పదవులు చేజిక్కించుకోవడంలో దిట్టలుగా మారారు. ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా కైవసం చేసుకున్నారు. అదే విధంగా కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాం చైర్మన్ పదవికీ ఎసరు పెట్టారు. డీసీసీబీలో 21 మంది డెరైక్టర్లు ఉండగా.. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధికంగా ఎన్నికయ్యారు.
దీంతో డీసీసీబీ అధ్యక్షురాలిగా పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో అక్రమ మార్గంలో డీసీసీబీ అధ్యక్షురాలు శ్రీదేవిని తప్పించి, తమ వారిని పీఠంపై కూర్చోబెట్టేందుకు తెలుగుదేశం నాయకులు రంగం సిద్ధం చేశారు.
ఇందుకు అనుగుణంగా 16 మంది డెరైక్టర్లు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని.. డెరైక్టర్లు చల్లా రఘునాథరెడ్డి, ప్రతాప్రెడ్డి ఈనెల 5న డీసీఓకు అందజేశారు. దీంతో ఈ నెల 26న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే విధంగా డీసీఓ సుబ్బారావు ఆదేశాలు ఇచ్చారు. విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నేతలు..అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వెల్దుర్తి మండలం ఎల్బండ తాండకు చెందిన స్వామినాయక్ ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
స్వామినాయక్ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ నిర్వహించే ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. దీంతో తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. చైర్మన్ పదవి కోసం కొందరు డెరైక్టర్లకు లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు సమాచారం. కోర్టు స్టే ఇవ్వటంతో డెరైక్టర్లకు ఇచ్చిన సొమ్ము తిరిగి ఎలా రాబట్టుకోవాలని జుట్టు పీక్కుంటున్నట్లు తెలుస్తోంది.
తమ్ముళ్లకు చుక్కెదురు..!
Published Tue, Aug 26 2014 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement