డిక్లరేషన్ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

డిక్లరేషన్ తప్పనిసరి

Published Tue, May 20 2014 5:02 PM

డిక్లరేషన్ తప్పనిసరి

తిరుమల: అన్ని మతస్థులు తిరుమలలో శ్రీవెంకటేశ్వస్వామివారిని దర్శనం చేసుకోవాలంటే హిందూమతంపై డిక్లరేషన్‌ తప్పనిసరిగా ఇవ్వాలని టీటీడీ ఈఓ ఎంజీ గోపాల్‌ చెప్పారు. తిరుమల శ్రీవారి గర్భాలయంలో భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా క్యూలైన్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.  క్యాలండర్‌ల విక్రయాల గోల్‌మాల్‌లో విచారణ చేపట్టినట్లు ఈఓ చెప్పారు.


ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే క్యాలండర్ల విక్రయాలలో అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. 2011-12 సంవత్సరానికి  ప్రచురించిన క్యాలెండర్ల విక్రయాలలో ముఖ్యమైన వ్యక్తులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై కొందరు ఉద్యోగులను కూడా విధుల నుండి బహిష్కరించారు.

Advertisement
Advertisement