విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్:ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై నమోదైన కేసులను విచారించిన జాయింట్ కలెక్టర్ రామారావు రూ.2.25 లక్షలు జరిమానా విధిస్తూ తన కోర్టులో మంగళవారం తీర్పు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, కిరాణా దుకాణాలపై ఆహార భద్రతాధికారి ఎస్వీ వీరభద్రరావు నమోదు చేసిన కేసులను రెండు రోజుల పాటు జేసీ కోర్టులో విచారించారు. అనంతరం పై విధంగా జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఇటీవల జిల్లాలోని పలు దుకాణాలు, హోటళ్లపై ఆహార భద్రతాధికారి వీరభద్రరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నమోదైన కేసుల నివేదికలను జేసీ పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించని నాలుగు హోటళ్లు, ఒక కిరాణా దుకాణదారునికి అపరాధ రుసుం విధించారు. ఎస్.కోటలోని హోటల్ ముంతాజ్లో పెరుగు తదితర పదార్ధాలు నాణ్యత లేకపోవడంతో కేసు నమోదు చేయగా రూ.50 వేలు జరిమానాను విధించారు. నెల్లిమర్లలోని మండాల బంగార్రాజు కిరాణా దుకాణంలో శనగపప్పు కల్తీ చేసి విక్రయిస్తుండగా కేసు నమోదు చేయగా రూ.50 వేలు జరిమానా విధించారు. విజయనగరంలోని హోటల్ మురళీకృష్ణలో నాసిరకమైన కందిపప్పు వినియోగిస్తున్నందుకు రూ.50 వేలు జరిమానా విధించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న హోటల్ శ్రీమహాలక్ష్మిలో నాసిరకమైన పదార్ధాలను వినియోగదారులకు పెట్టినందుకు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేయగా ఆ హోటల్ యజమానికి రూ.50 వేలు జరిమానా విధించారు. విజయనగరంలోని హోటల్ న్యూలేఖనలో పెరుగు తదితర భోజన పదార్ధాలను నాసిరకమైనవి పెట్టడంతో రూ.25 వేలు జరిమానా విధించారు.
కల్తీ చేస్తే రూ.10 లక్షల వరకు జరిమానా...
ఆహార పదార్ధాల కల్తీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బి.రామారావు హెచ్చరించారు. నాసిరకం వస్తువులు విక్రయించడం ఉపేక్షించరాదని ఇటువంటి కేసులపై రూ.2 లక్షల నుంచి పది లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఇకపై ఇటువంటి కేసులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మరోసారి ఇటువంటి తప్పులు చేసి పట్టుబడితే అధిక మొత్తంలో జరిమానా విధిస్తామన్నారు. వినియోగదారులు నాసిరకం వస్తువుల సరఫరా, కల్తీ సరుకుల విక్రయూల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వీటిని గుర్తిస్తే ఆహార భద్రతాధికారికిగానీ.. లేదా 9959994092 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయూలని సూచించారు. ఇకపై ఇటువంటి హొటళ్లు, కిరాణా షాపులు, నిత్యావసర దుకాణాలు, మార్కెట్లు, పాల విక్రయ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని జేసీ స్పష్టం చేశారు.
హోటళ్లకు రూ.2.25 లక్షల జరిమానా
Published Wed, Jun 4 2014 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement