* హంద్రీ-నీవా పనులపై సీఎంవో ఆరా
* తొలి దశ పనుల పూర్తికి ఎంత ఖర్చవుతుంది?
* ఎన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయి?
* కలెక్టర్ను వివరాలడిగిన సీఎం కార్యాలయం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కరువు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం హంద్రీ-నీవా పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాలను ప్రజలు అధికార పార్టీకి కట్టబెట్టిన నేపథ్యంలో, అత్యంత కరువు ప్రాంతమైన ఈ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలపై శ్రద్ధ చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంతర్మథనం మొదలైనట్లు జిల్లాకు చెందిన అధికార పార్టీ వర్గాల సమాచారం.
ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరిపై ప్రజల్లో అపనమ్మకం కలిగించడంలో సఫలీకృతులయ్యారని, కొద్దిమేరకైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే గతం పుసరావృతమై రైతులు టీడీపీకిదూరమయ్యే ప్రమాదముందన్న విశ్లేషణలు అధికార పార్టీ వర్గాల్లో మొదలైనట్లు సమాచారం. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ‘హంద్రీ-నీవా’ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. అక్కడక్కడా ప్యాచ్ వర్క్లు, నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో పలు చెరువులు నింపి.. భూగర్భజల మట్టాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఇందుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్లో మాత్రం కేవలం రూ.100 కోట్లు కేటాయించారు.
ఇంకో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యి.. వచ్చే ఖరీఫ్ నాటికి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాలు సాగులోకి వస్తుంది. అప్పుడు ఆ మైలేజీని రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చినట్లు సమాచారం. విజయవాడలో రాజధాని ఖరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాలకన్నా ఎక్కువ అసౌకర్యానికి గురవుతోంది అనంతపురమే. ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కైతే జిల్లా వాసులు నాలుగైదు గంటల్లోనే చేరుకోవచ్చు. అదే విజయవాడ వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. వర్షపాత, సాగునీటి సౌకర్యాల ప్రాతిపదికన చూస్తే అనంతపురానికి, విజయవాడకు మధ్య ‘నక్కకు నాగలోకానికి’ ఉన్నంత తేడా కన్పిస్తోంది.
వీటన్నింటి నేపథ్యంలో అధికార పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ‘అనంత’ విషయంలో ఎంతో కొంత శ్రద్ధ తీసుకోకపోతే.. ఆ ప్రభావం మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కన్పించే అవకాశముంది. సీమ ప్రజల్లో రాజుకుంటున్న అసంతృప్తి పెరిగి పెద్ద కాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘హంద్రీ-నీవా’ పనుల పురోగతి, పనుల పూర్తికి ఇంకా ఎంత మొత్తం అవసరం? ఎంతకాలం పడుతుంది?.. తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ‘హంద్రీ-నీవా’ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి సీఎంవో కోరిన మేరకు సవివరమైన నివేదిక తయారు చేస్తున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
Breadcrumb
Related news
-
ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులని అన్నారు.ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా ముస్లిం రిజర్వేషన్లు, ఆ తర్వాత దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారని తెలిపారు. ఇందుకోసం బీజేపీ చేస్తున్న కుట్రను చంద్రబాబు, పవన్ ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింలు, దళితుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసమే ఆలోచిస్తారన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరని స్పష్టంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ వాది అని తెలిపారు. సోమవారం సాక్షి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి వరకు విశ్వగురు, జీ–20,చంద్రయాన్, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడు అవన్నీ వదిలేసి హిందూ–ముస్లిం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ముస్లింలను ద్వేషించడం ఒక్కటే ప్రధాని మోదీ గ్యారంటీ అని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ ఆయనలోని లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారన్నారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారు వైఎస్ఆర్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఒవైసీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషమని, 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబి్ధపొందడం బీజేపీకి మింగుడుపడటంలేదని తెలిపారు.విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలు లబ్ధి పొందడం, స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చడంలేదని, దీంతో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా వారికి రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కుట్రలు ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో వీరు అధికారంలోకి వస్తే బీజేపీ కుట్రలు అమలు చేస్తారని, చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి టీడీపీ, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.హామీ ఇచ్చి అమలు చేసిన వైఎస్సార్ముస్లిం రిజర్వేషన్లను మహానేత వైఎస్సార్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేశారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, ముస్లింలలో కుల ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని ఆ కమిటీ తేలి్చందని చెప్పారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.సెక్యులర్ లీడర్ జగన్కు అండగా నిలవండి సెక్యులర్ లీడర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ మద్దతివ్వాలని ఒవైసీ కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడూ దళితులు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. ముస్లింలు, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ లీడర్ జగన్ ఏపీకి అవసరమని, ఆయనకు మద్దతుగా నిలిచి ఓటెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. -
మాజీ సీఎం చంద్రబాబు విచక్షణతో మాట్లాడాలి
వేంపల్లె : మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ అన్నారు. వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఆమె సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారని, ప్రజా జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. ఇలాంటి ఆలోచనలు మంచివి కావన్నారు. విశాఖ, విజయవాడల్లో జరిగిన హత్యాయత్నాల లాంటి ఘటనలను ప్రేరేపించడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్లకు కళ్లు లేవని అనుకుంటున్నానని అన్నారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్ను వారి పెద్ద కొడుకని, నెలనెలా ఇంటికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఐదేళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని, సీఎం జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజలు చెబుతుండటంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్రెడ్డి, ఎంపీపీ లక్ష్మిగాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబుతో తమకు అన్ని అంశాల్లోనూ సెటిల్మెంట్ కుదిరిందని, అన్నీ పరిష్కారమయ్యాయని పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. తమ అజెండాతో చంద్రబాబు ఏకీభవించినట్లు ఆయన స్పష్టంగా చెప్పారు. మరి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ప్రతిపాదించిన బీజేపీతో ఏకీభవించి.. ఆ చట్టాన్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నారంటే ఏంటర్థం? ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తూ ఆ చట్టాన్ని రద్దు చేస్తాననటం ఎవరిని మోసం చేయడానికి? ఇది దుర్మార్గం కాదా?ప్రత్యేక హోదా ముగిసిందని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టి.. లేదు లేదు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న చంద్రబాబు మోసగాడు కాడా? స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించే విషయంలో తమ వైఖరి మారలేదని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తూ.. ప్రయివేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న బాబు మాటలు అసలు ఒక్క శాతమైనా నమ్మేట్టున్నాయా? ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని, ఉమ్మడి శిక్షా స్మృతి తెస్తామని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాటిపై దాటవేత వైఖరి అనుసరిస్తుండటం బాబు దివాలాకోరు తనానికి పరాకాష్ట కాదా? అయినా చంద్రబాబును మోస్తున్న అను‘కుల’ మీడియాకు గానీ, పచ్చ ముఠాకు గానీ సిగ్గుందని అనుకోగలమా? బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి.. పార్టీ పెద్దల అపాయింట్మెంట్లు దొరక్కపోయినా పడిగాపులు కాసి... చచ్చీ చెడీ, శరణు శరణు అంటూ వేడుకుని మరీ పొత్తు పెట్టుకున్న వ్యవహారం యావత్తు ప్రజానీకం చూసిందే. కానీ పొత్తు కుదుర్చుకుని ఢిల్లీ నుంచి వచ్చాక చంద్రబాబు ఏమన్నాడో తెలుసా? ‘‘వాళ్లు అడిగితే మేం పొత్తు పెట్టుకున్నాం’’ అని. అదీ చంద్రబాబు ట్రేడ్ మార్కు. బీజేపీవిశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరిస్తాం. ఇప్పటికీ మా వైఖరి అదేనని న్యాయస్థానాల సాక్షిగా బీజేపీ చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ వేసి మరీ... విశాఖ స్టీల్పై తమ వైఖరి ఏమాత్రం మారలేదని స్పష్టంగా చెప్పింది. టీడీపీబీజేపీతో కలిసి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ జరగనివ్వనని బయట బహిరంగ సభల్లో చెబుతున్నాడు. ఈయనకు తోడు మరో భాగస్వామిగా ఉన్న దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ సైతం ప్రయివేటీకరణ జరగనివ్వననిహూంకరిస్తున్నాడు. మరి ఆ మాట బీజేపీతో చెప్పించవచ్చు కదా? మీ మేనిఫెస్టోలో పెట్టవచ్చు కదా? ఎందుకీ దగుల్బాజీ మాటలు? ఇంకెన్నాళ్లు ఈ మోసపు బతుకులు? బీజేపీముస్లింలు ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారని గ్రహించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. వారిని బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. నాటి నుంచీ అవి కొనసాగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటోంది. తాము గనక అధికారంలోకి వస్తే.. ఈ రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. టీడీపీబీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు తాను ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పటం లేదు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ... పక్క దోవ పట్టిస్తూ... ప్రచారాన్ని లాగించేస్తున్నాడు. బీజేపీతాము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతి (సీసీసీ)ని తీసుకు వస్తామని బీజేపీ చెబుతోంది. టీడీపీదీనిపైనా చంద్రబాబు దాటవేతనే అనుసరిస్తున్నాడు.బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాళ్లతో అధికారం పంచుకుంటానని చెబుతున్న చంద్రబాబు వాళ్ల అజెండాతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పటం లేదెందుకు? ఎన్నాళ్లీ మోసం? రెండు నాల్కలతో ఎందరిని మభ్యపెడతారు? బీజేపీప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, ఇక దాని గురించి ప్రస్తావించే అవకాశం గానీ, అవసరం గానీ లేదని బీజేపీ పదేపదే చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం... ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు. ఈ హోదాకు తగ్గట్లుగా ప్రత్యేక ప్యాకేజీని గతంలోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, కనక దీనిపై ఆయన తమను అడిగే పరిస్థితి లేదని చెప్పారు. టీడీపీసిగ్గూ, మర్యాదా అన్నీ వదిలేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. తాము గెలిస్తే రాష్ట్రానికి బీజేపీ సాయంతో ప్రత్యేక హోదాను సాధిస్తామని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతుంటే... సాక్షాత్తు ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండటం ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టడానికి? పోనీ ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టగలవా చంద్రబాబూ? -
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు. -
Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...
రిపోర్టర్: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్, 5ట్రిలియన్ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నారు.ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి.ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసి ఆంధ్రప్రదేశ్లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్కళ్యాణ్లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్మోహన్రెడ్డి మతతత్వవాది కాదు… జగన్మోహన్రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు.
Related News by category
-
మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు.. బాబు చరిత్రే మోసం: సీఎం జగన్
బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుందో చంద్రబాబును నమ్మితే కూడా అదే అవుతుంది. అక్కడ బిందెడు పన్నీరు గోవిందా.. ఇక్కడ పథకాలూ గోవిందా! గతంలో బాబును నమ్మి ఓటు వేసినందుకు బంగారు రుణాలు గోవిందా...! డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల మాఫీ గోవిందా...! ప్రత్యేక హోదా, ఉమ్మడి రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా.. గోవిందా! తిరుమల వెంకన్న స్వామిని తలచుకుని చెప్పే గోవిందా గోవిందాలు కావు ఇవి. బాబును నమ్మితే అన్నీ గోవిందా..! – చోడవరం సభలో సీఎం జగన్జగన్ను ఎందుకు ఓడించాలని అడగండి. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుకా? ఇంటింటికీ సంక్షేమాన్ని అందిస్తూ మంచి చేస్తున్నందుకా? చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు,జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం కోసం జగన్ను ఓడించాలా? వీరంతా కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా..? దోచుకున్నది పంచుకోవడం కోసమా? మరి జగన్ను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబూ? – అంబాజీపేట సభలో సీఎం జగన్మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను ‘‘బచ్చా..’’ అని అంటూనే భయపడుతున్నారు. చంద్రబాబూ నువ్వు నిజంగా అంత పుడింగే అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా? 14 ఏళ్లలో ఏ ఒక్క మంచీ చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్ ఐదేళ్లలో చేసిన పథకాలనే అమలు చేస్తానని చెబుతున్నావంటే దాని అర్థం ఏమిటి? మరి ఇప్పుడు ఎవరు బచ్చా? ఎవరు లీడర్? చెప్పు చంద్రబాబూ..! – పొన్నూరు సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. 2014 ఎన్నికల హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబుకు అసలు ఓటు ఎందుకు వేయాలని ప్రజలంతా గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జరిగే నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్, గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చరిత్ర చెబుతున్న సత్యం.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. మనం వేసే ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ సజావుగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా అంటూ మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ఇది చంద్రబాబు గురించి చరిత్ర చెబుతున్న సత్యం. బాబును నమ్మడం అంటే విషసర్పాన్ని నమ్మడమేనని గుర్తుంచుకోండి. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేసిందేమిటంటే.. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ 5కి ఇంత.. అంటూ అంతా కలసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే! బాబు డబ్బులిస్తే తీసుకోండి.. మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కితే రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లాయి. చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా దోచుకుని పంచుకున్నారు. చంద్రబాబు దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేలు.. రూ.3 వేలు.. రూ.4 వేలు.. రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. చంద్రబాబు డబ్బులిస్తే వద్దు అనొద్దండీ...! తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకుండా తీసుకోండి. కానీ ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది? ఎవరు అధికారంలో ఉంటే ఆ మంచి కొనసాగుతుంది? అనేది మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మనం ఉంటేనే.... మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్నతోడు, జగనన్న చేదోడు, లా నేస్తం లాంటివి సజావుగా కొనసాగుతాయి. పూర్తిగా ఫీజురీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన, కల్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష... ఇవన్నీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయన్నది గుర్తుంచుకోండి. ఇంటికే రూ.3 వేల పెన్షన్, మళ్లీ పెంచనున్న పెన్షన్, ఇంటి ముంగిటికే రేషన్, పౌర సేవలు, పథకాలన్నీ అందుతాయని గమనించాలని కోరుతున్నా. ఏ నెలలో ఏ పథకం అనేది ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ మీ బిడ్డ లబ్ధి చేకూరుస్తున్నాడు. రెండు బటన్లూ ఫ్యాన్కే... వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా... అవి ఇంటికే రావాలన్నా... లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుండాలన్నా, మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించాలి. సామాజిక న్యాయంలో నువ్వెక్కడ?ఈరోజు కేబినెట్లో 68 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కనిపిస్తున్నారు. 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అందిస్తే ఏకంగా 75 శాతం నేను ‘‘నా’’ అని పిలుచుకునే పేద వర్గాలకే దక్కింది. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏకంగా 80 శాతం పైచిలుకు ఆ సామాజిక వర్గాల పిల్లలకే దక్కాయి. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఆ వర్గాలకు ఏకంగా 50శాతం రిజర్వేషన్లతో చట్టం చేసి మరీ ఆత్మగౌరవం నిలబెట్టింది మీ జగన్ పాలనలోనే. 175 అసెంబ్లీ, 25 ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే వంద సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతకు అర్థం చెప్పింది నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ కాదా? సామాజిక న్యాయంలో నువ్వు చేసింది ఏందయ్యా చంద్రబాబూ? ఓ మోసాల బాబూ.. ఓ మోసాలయ్యా..! నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి 2014లో మీరిచ్చిన పాంప్లెట్ సరిపోదా? కోనసీమను కోరుతున్నా..కోనసీమలో మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత ఎన్నికల్లో కులపరంగా లేదా పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే తరాల భవిష్యత్తు మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంది. రాబోయే ఐదేళ్లలో మీ ఇంటికి పథకాలు, అభివృద్ధి అనేది నిర్ణయించేది మీ ఓటే. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లలకు ఓటు హక్కు లేదని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఎలా ఉండేది?చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? మీ బిడ్డ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులేమిటో మీరంతా చూస్తున్నారు కదా. ఎవరు హీరో? ఎవరు విలన్? ఈ యుద్ధంలో అటువైపు ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. చంద్రబాబుకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరందరూ సరిపోరు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు! పేదవాడికి ఎప్పుడూ ఎలాంటి మంచి చేసిన చరిత్ర లేని వీళ్లంతా కూటమిగా మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటున్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న ఆ దేవుడిని. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ బిడ్డ వచ్చాడు. పేదలకు మరింత మంచి చేస్తూ ఇంటింటి అభివృద్ధి, పౌరసేవలు, ఇంటికే పథకాలు కొనసాగింపుగా వైఎస్సార్ సీపీ 2024 మేనిఫెస్టోను రూపొందించాం. సినిమాకు వెళ్లినప్పుడు హీరో మంచి చేస్తాడు కాబట్టి అందరికీ నచ్చుతాడు. హీరోలో మానవత్వం ఉంది కాబట్టి నచ్చుతాడు. విలన్ ఎందుకు నచ్చడు? విలన్ మోసాలు, అబద్ధాలు, కుట్రలు చేస్తాడు కాబట్టి నచ్చడు. నిజ జీవితంలో కూడా ఆలోచన చేయండి ఎవరు హీరో? ఎవరు విలన్?దీవించండి...అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ, పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణలను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావ్?⇒ నువ్వు అంటున్నట్లుగా నేను బచ్చానే అయితే ఇంటింటికీ సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలో విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో బాగుపడిన ఇంగ్లీషు మీడియం బడులు, డిజిటల్ బోధన, ట్యాబ్లు, గ్రామంలోనే మహిళా పోలీసు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు.. ఇవన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబూ? ⇒ చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీతో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాడు. నేను బచ్చా అయితే.. మరి ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబూ? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు? ⇒ నేను బచ్చాను అయితే ఒక అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహనమిత్ర, ఇంటికే రూ.3 వేల పెన్షన్, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా... ఇలాంటి పథకాలన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండీ ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబూ?2014లో గోవిందా గోవిందా..!⇒ 2014లో చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు నెలకు రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో నిరుద్యోగికి ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి గోవిందా! ⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాల మాఫీ గోవిందా! ⇒ రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ గోవిందా! ⇒ అప్పటి దాకా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవింద. ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేస్తామన్న రూ.25 వేలు గోవిందా! ⇒ ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు గోవిందా! ⇒ ఓటుకు కోట్లు కేసులో చిక్కడంతో మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద! ⇒ బాబును నమ్మి ఓటు వేసినందుకు ప్రత్యేక హోదా గోవిందా! ⇒ ప్రత్యేక ప్యాకేజీ కూడా గోవిందా...గోవిందా! ⇒ విభజన హామీలూ గోవిందా. ⇒ సింగపూర్కు మించిన రాజధాని గోవిందా! ⇒ గ్రాఫిక్స్ రాజధాని గోవిందా.. గోవిందా! ⇒ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ హామీ గోవిందా.. గోవిందా! ⇒ బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా! ⇒ బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా! ⇒ సింగపూర్కు మించిన రాజధాని కడతానంటూ పక్కనే అన్ని హంగులతో కనిపిస్తున్న మన విశాఖను విస్మరించారు. ⇒ బాబు మాటలు నమ్మితే అంతా గోవిందా.. గోవింద!జగన్ను ఓడించాలట.. ఇందుకా!⇒ 77 ఏళ్ల స్వతంత్ర దేశ చర్రితలో ఏప్రభుత్వాలూ చేయనంత మంచిని మీ బిడ్డ ఐదేళ్లలో చేసినందుకు ఓడించాలా? ⇒ 130 సార్లు బటన్లు నొక్కి లంచాలు లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో అందించినందుకా? ⇒ ఈ పథకాలేవీ చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ను ఓడించాలా? ⇒ ఐదేళ్లలో చంద్రబాబు కేవలం 32 వేల గవర్నమెంట్ ఉద్యోగాలిస్తే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకా? ⇒ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు బిడ్డలను బడులకు పంపిస్తే చాలంటూ అమ్మ ఒడి ఇచ్చినందుకా? ⇒ ఏ ప్రభుత్వం చేయని విధంగా 66 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్లు ఇచ్చినందుకా? ⇒ అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్ చిరునవ్వుతో ఇస్తున్నందుకా? ⇒ మానవత్వం లేకుండా ఇంటివద్దే పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబుకు సంతోషం కలిగించేందుకా? ⇒ ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్నందుకా? ⇒ చరిత్ర ఎరుగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మలకు వారి పేరిట రిజి్రస్టేషన్ చేసి మరీ ఇచ్చినందుకా? ⇒ 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినందుకా? ⇒ మరి జగన్ను ఎందుకు ఓడించాలి? బాబుకు ఎందుకు ఓటు వేయాలనేది మీరే చెప్పాలని అందరినీ అడుగుతున్నా.పోయేకాలం వచ్చినప్పుడు..విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో అంతా చూస్తున్నారు. తన హయాంలో ఏం చేశాడో చెప్పుకుని ఓట్లు అడగాల్సింది పోయి మీటింగుల్లో జగన్ను తిడుతున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాద్కు వెనక్కు పోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబూ..! నువ్వు బచ్చా అంటున్న నేను ప్రతి ఇంటికీ మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ప్రజల్ని ఓటు అడుగుతున్నా. మరి నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానంటావ్. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకొస్తుందా? -
ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులని అన్నారు.ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా ముస్లిం రిజర్వేషన్లు, ఆ తర్వాత దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారని తెలిపారు. ఇందుకోసం బీజేపీ చేస్తున్న కుట్రను చంద్రబాబు, పవన్ ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింలు, దళితుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసమే ఆలోచిస్తారన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరని స్పష్టంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ వాది అని తెలిపారు. సోమవారం సాక్షి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి వరకు విశ్వగురు, జీ–20,చంద్రయాన్, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడు అవన్నీ వదిలేసి హిందూ–ముస్లిం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ముస్లింలను ద్వేషించడం ఒక్కటే ప్రధాని మోదీ గ్యారంటీ అని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ ఆయనలోని లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారన్నారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారు వైఎస్ఆర్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఒవైసీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషమని, 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబి్ధపొందడం బీజేపీకి మింగుడుపడటంలేదని తెలిపారు.విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలు లబ్ధి పొందడం, స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చడంలేదని, దీంతో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా వారికి రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కుట్రలు ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో వీరు అధికారంలోకి వస్తే బీజేపీ కుట్రలు అమలు చేస్తారని, చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి టీడీపీ, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.హామీ ఇచ్చి అమలు చేసిన వైఎస్సార్ముస్లిం రిజర్వేషన్లను మహానేత వైఎస్సార్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేశారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, ముస్లింలలో కుల ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని ఆ కమిటీ తేలి్చందని చెప్పారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.సెక్యులర్ లీడర్ జగన్కు అండగా నిలవండి సెక్యులర్ లీడర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ మద్దతివ్వాలని ఒవైసీ కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడూ దళితులు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. ముస్లింలు, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ లీడర్ జగన్ ఏపీకి అవసరమని, ఆయనకు మద్దతుగా నిలిచి ఓటెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. -
మాజీ సీఎం చంద్రబాబు విచక్షణతో మాట్లాడాలి
వేంపల్లె : మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ అన్నారు. వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఆమె సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారని, ప్రజా జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. ఇలాంటి ఆలోచనలు మంచివి కావన్నారు. విశాఖ, విజయవాడల్లో జరిగిన హత్యాయత్నాల లాంటి ఘటనలను ప్రేరేపించడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్లకు కళ్లు లేవని అనుకుంటున్నానని అన్నారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్ను వారి పెద్ద కొడుకని, నెలనెలా ఇంటికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఐదేళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని, సీఎం జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజలు చెబుతుండటంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్రెడ్డి, ఎంపీపీ లక్ష్మిగాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ (సీపీడీ) సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. ‘భారత్లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహా్వనం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్లో పేకేరు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజీలో 2014–19 మధ్య ఐదేళ్లపాటు ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు తిప్రుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాల జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్దత్తా, రాజస్థాన్లోని ఝుంజున్ జిల్లా లంబిఅహీర్ సర్పంచ్ నీరూ యాదవ్కు ఆహా్వనాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్కుమార్తో కలిసి భారత్ ప్యానల్ తరఫున మన రాష్ట్రంలోనూ, దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు. జగన్ పాలనలో అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవాలు ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి అనేక ఆరుదైన గౌరవాలు దక్కాయి. 6 నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే లారీ డ్రైవర్ కూతురు, సెక్యూరిటీ గార్డు కూతురు, కౌలు రైతు కొడుకు తదితర 10 మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. బడిలో స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి సర్కారు బడి స్థాయిని కూడా ప్రైవేట్ అంతర్జాతీయ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగారు. -
సెగలు.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement