మరమ్మతులకు ఎన్ని శిలాఫలకాలు వేస్తారు
ఆగస్టు 8న మరమ్మతు పనులకు కొత్తాస్పత్రిలో మంత్రి శిలాఫలకాలు
మళ్లీ సోమవారం పాత ఆస్పత్రిలో అదేమంటే ఇంజినీర్లు సరిగా పనిచేయాలని హితబోధ
లబ్బీపేట: ఆర్భాటపు ప్రచారం మినహా ..అభివృద్ధి శూన్యమనే దాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తీరే నిదర్శనంగా మారుతోంది. ఆస్పత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టిన మరమ్మతు పనులను ఈ నెల 8న కొత్తాస్పత్రిలో ఆర్భాటంగా శిలాఫలకాలు వేసి ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , మళ్లీ అదే పనులకు సంబంధించి సోమవారం పాత ఆస్పత్రిలో శిలాఫలకాలను మంత్రి కామినేని నిస్సిగ్గుగా ఆవిష్కరించారు. ఆస్పత్రి అభివృద్ధికి తామేమి నిధులు ఇవ్వకపోయినా, ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఏకంగా రెండు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆర్భాటపు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
పరికరాల నిధులు..ప్యాచ్ వర్క్లుకా..?
ప్రభుత్వాస్పత్రిలో 2008 సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించిన సేవలకుగాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద ఉంచారు. వాటితో నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవైపు ఆపరేషన్ థియేటర్లో సరైన పరికరాలు లేక ఇబ్బందులు ఎదురవడంతోపాటు, వ్యాధి నిర్థారణ పరీక్షలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తమ ప్రచారం కోసం... పరికరాలు కోసం ఉంచిన రూ. 4 కోట్లు నిధులను ప్యాచ్ వర్క్ల కోసం కేటాయించి,ఏకంగా రెండు ఆస్పత్రిల్లో రెండు శిలాఫలకాలు వేయించేసుకున్నారు. ఎక్కైడె నా కొత్త భవనాలు ప్రారంభోత్సవానికి, నిర్మాణాలను శిలాఫలకాలు వేస్తారు కానీ, ఈ మంత్రి రిపేర్లకు శిలాఫలకాలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు.
స్థానిక నేతల కోసమేనా
రెండు ప్రాంతాల్లో శిలా ఫలకాలు స్థానిక ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యుల పేర్లు కోసం తాపత్రయ పడి వేసినట్లు సమాచారం. వారు వేసినప్పటికీ నిసిగ్గుగా వైద్య మంత్రి వచ్చి ప్రారంభించడమేమిటని పలువురు మండి పడుతున్నారు. రెండు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసేందుకు రూ.లక్షకు పైగా సొమ్ము దుర్వినియోగం అయినందనే వాదన వినిపిస్తుంది. ఇప్పటికైన ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలనే కానీ, ఆర్భాటపు ప్రచారానికి కాదని హితవు పలుకుతున్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఎస్ఎస్వై ద్వారా మంజూరైన నిధులకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆ నిధులు మళ్లీ వెనక్కివెళ్లే అవకాశం వుందని నిపుణులు సూచిస్తున్నారు.
హవ్వ..ఇదేం తీరు...అమాత్యా?!
Published Tue, Aug 25 2015 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement