గొలుగొండ, హుకుంపేట, నర్సీపట్నం, అనకాపల్లి అర్బన్, రావికమతం, న్యూస్లైన్:
జిల్లావ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీఎత్తున గంజాయి పట్టుబడింది. మొత్తం 1329 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
400 కిలోలకు పైగా గంజాయి పట్టివేత
గడ్డిలోడు ట్రక్కర్లో సుమారు 400 కిలోలకు పైగా తరలిస్తున్న గంజాయిని మంగళవారం సాయంత్రం భీమవరం చెక్పోస్టు వద్ద అటవీ శాఖ బేస్ క్యాంపు సిబ్బంది పట్టుకున్నారు. చింతపల్లి మండలం చౌడుపల్లి నుంచి గంజాయిని కె.డి.పేట మీదుగా కంఠారం తరలిస్తుండగా భీమవరం చెక్పోస్టు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. గడ్డిలోడు కింద తవుడు బస్తాల మాటున గంజాయి మూటలున్నట్టు గుర్తించారు. వెంటనే రేంజర్ మహలక్ష్మినాయుడు, డీఆర్వో అచ్యుతరామారావు, కె.డి.పేట ఎస్ఐ గోపాలరావులకు సమాచారమందించారు. వెంటనే వీరు అక్కడికి చేరుకుని ట్రక్కర్ను స్వాధీనపరచుకున్నారు. నాతవరం మండలం జిల్లేడిపూడికి చెందిన డ్రయివర్ గాడి చిట్టిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
100 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం అర్ధరాత్రి హుకుంపేట వారపు సంతకు సమీపంలో పట్టుకున్నారు. పెదబయలు మండలం మారుమూల ప్రాంతం నుంచి కెఎల్06క్యూ 2925 జిప్సీ వాహనంలో తరలిస్తుండగా హుకుంపేట ఎస్ఐ భరత్కుమార్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు బస్తాల్లో తెస్తున్న 100 కిలోల గంజాయితో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన బిజు చాకో, టి.ఎఫ్.అనీష్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి వస్తోందన్న సమాచారంతో పోలీసులు సంత కూడలి వద్ద మాటువేసి ఉండటాన్ని గమనించిన స్మగ్లర్లు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు.
92 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వద్ద ఆటోలో సుమారు రూ.2 లక్షల విలువైన 92 కిలోల గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన అయిదుగురిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. సీఐ కథనం ప్రకారం పాడేరు మండలం మద్దిగరువు నుంచి 46 సంచుల్లో 92 కిలోల శీలావతి రకం గంజాయిని అయిదుగురు మంగళవారం ఆటో లో అనకాపల్లికి తరలించారు. అనంతరం కారులో వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. కాంప్లెక్స్ వద్ద గస్తీని గమనించిన స్మగ్లర్లు ఆటోను తుప్పల వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. పాడేరు మండలం కింతూరు గ్రామం సాంబే రాధారో (30), పాడేరు మండలం తొట్లగంది గ్రామానికి చెందిన సాంబే వెంకటేశ్వర్లు, పెదబయలు బనుగుబిల్లికి చెందిన దర్శింగ్ వెంకటేశ్వర్లు (21), చింతపల్లి పెండ్లిమామిడికి చెందిన శెట్టి మత్స్యరాజు (25), చీడికాడ మండలం దండి సురవరానికి చెందిన ఆటో డ్రయివర్ గొర్లి రాజేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు.
187 కిలోల గంజాయి స్వాధీనం
రావికమతం మండలం కొత్తకోట సమీపంలోని కన్నంపేట పొలాల్లో తరలిస్తున్న రూ.27 లక్షల విలువైన గంజాయిని కొత్తకోట పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఇండికా కారును, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట సీఐ పి.వి.కె.వర్మ కథనం ప్రకారం కన్నంపేట, వమ్మవరం గ్రామాల మధ్య గంజాయి తరలుతున్నట్టు సమాచారం అందడంతో సోమవారం రాత్రి నుంచి కొత్తకోట ఎస్ఐ శిరీష్కుమార్, సిబ్బందితో గస్తీ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము ప్రాంతంలో ఏపీ35 ఏసీ 4357 నంబరు ఇండికా కారు వేగంగా వస్తుండటంతో ఆపు చేశారు. కారులోని నలుగురు దిగి పారిపోతుండటంతో సిబ్బంది వెంబడించి ఇద్దరిని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. కారులో 187 కిలోల గంజాయి లభించింది. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు తమిళనాడు ప్రాంతానికి చెందిన కొట్యాసా పాండే (21), మరొకరు రోలుగుంట మండలం బి.బి.పట్నం గ్రామానికి చెందిన శవాకుల రాముగా గుర్తించారు. వీరి నుంచి రూ.లక్షా 75 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సీఐ వర్మ తెలిపారు.
550 కిలోల గంజాయి స్వాధీనం
రూ.55 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్నీ మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు లోని ఏజెన్సీ మండలాల నుంచి తమిళనాడు థైయినీ జిల్లాకు 550 కిలోల గంజాయి ప్యాకెట్లను లారీలో తరలిస్తున్నట్టు చెప్పారు. ఈ లారీని గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద తనిఖీలు నిర్వహిస్తూ పట్టుకున్నట్టు చెప్పారు. మంచినీరు ప్యాకెట్ల లోడుతో వస్తున్న లారీ అడుగు భాగంలో ప్యాకెట్లను ఉంచినట్టు వివరించారు. వీటి విలువ సుమారు రూ.55 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా మత్తుకుట్టి, డ్రయివర్ వీరమృగన్, క్లీనర్ కార్తీకన్కరూర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు ఏఎస్పీ చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ తిరుమలరావు, ఎస్ఐ ప్రభాకరరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
భారీగా గంజాయి స్వాధీనం
Published Wed, Jan 29 2014 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement