అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం

Published Wed, Jan 20 2016 6:31 PM

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం - Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సరుబుజ్జిలి మండలం లజ్జలకాగితాపల్లి గ్రామంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో సమీపంలో ఉన్న ఆరు పూరిళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. సుమారు రూ.6 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement