భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
భర్తే చంపి ఉరివేశాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు
కర్నూలు నగరంలో ఘటన
మృతురాలు తిరుపతి వాసి
కర్నూలు: ప్రేమ కోసం కనిపెంచిన తల్లిదండ్రులను కాదనుకుంది. కులం పట్టింపులు లేవని.. నీవు లేకపోతే నేను లేనని మాయ మాటలు చెప్పిన ప్రియుడిని నమ్మింది. జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. వివాహం అయిన తరువాత ఆమెకు తెలిసింది తన కలలు కల్లలయ్యాయని. అటు తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక భర్త వేధింపులు భరించలేక బలవంతంగా తనువు చాలింది. ఈ ఘటన కర్నూలు నగరం గాంధీనగర్లో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఈశ్వరరెడ్డి, సి.జయశ్రీ అక్కడే విద్యోదయ స్కూల్, కాలేజిలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఇదే సమయంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయారు. గత అక్టోబర్ 20వ తేదీన మహానందిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఈశ్వరరెడ్డికి కర్నూలులో సేల్స్మెన్గా ఉద్యోగం వచ్చింది. వీరిద్దరూ కర్నూలు నగరంలోని గాంధీనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా ఈశ్వర్ రెడ్డి భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు రూ.30లక్షల కట్నం కావాలని, కులం తక్కువ వారని హింసించేవాడు.
ముఖం చూపించవద్దని భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఈ విషయాలను ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్చేసి తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సైతం తన చిన్నాన్న సి.నాగరాజుకు ఫోన్చేసి తిరుపతికి వస్తున్నానని చెప్పింది. అయితే అదేరోజు రాత్రి 9.45 గంటలకు నాగరాజుకు భర్త ఈశ్వరరెడ్డి ఫోన్చేస్ఙ్ఙి మీ అమ్మాయి తలుపులకు గడియ పెట్టుకుని బయటకు రావడం లేదని, వెంటనే రావాలి** అని చెప్పాడు. తిరుపతి నుంచి జయశ్రీ కుటుంబసభ్యులు సోమవారం ఉద యం గాంధీనగర్కు చేరుకున్నారు. త లుపులు తెరిచి చూసేలోగా అప్పటికే ఆమె గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని చని పోయి ఉంది. వెంటనే వారు కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ముల్కన్న ఆధ్వర్యంలో పోలీస్ బృందం సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించింది. భర్తే తమ కుమార్తెను చంపి ఉరివేసి ఉంటాడని జయశ్రీ తల్లిదండ్రులు మునికృష్ణయ్య, సత్యవేణి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కల చెదిరి..తనువు చాలించి..!
Published Tue, Jan 6 2015 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement