'నాలుగున్నర కోట్లతో హైదరాబాద్ నిండుగా ఉంది' | Sakshi
Sakshi News home page

'నాలుగున్నర కోట్లతో హైదరాబాద్ నిండుగా ఉంది'

Published Thu, Feb 27 2014 12:03 PM

'నాలుగున్నర కోట్లతో హైదరాబాద్ నిండుగా ఉంది' - Sakshi

వరంగల్ : సీమాంధ్రులు లేకపోతే హైదరాబాద్ రోడ్లు ఎడారిగా మారతాయని కిరణ్ కుమార్ రెడ్డి అనటం ఆయన అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలతో హైదరాబాద్ నిండుగా ఉందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement