ఉదయగిరి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సగం వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయగిరి మండలం అప్పసముద్రంలో సర్పంచ్ బి.రామక్క అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు అందజేస్తోందన్నారు.
మరుగుదొడ్డి లేని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నవంబర్ లోపు నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామంలోని మురుగునీరంతా ఒకే ప్రాంతానికి చేరే ఏర్పాటు చేసుకుని, ఉపాధి నిధులతో అక్కడ గుంత తవ్వుకోవాలన్నారు. ప్రతి ఇంట్లోని చెత్తను సేకరించి గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డులో వేసేలా పంచాయతీ పాలకులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిల ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు. ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ మాట్లాడుతూ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఓ చోట చేరి చేతుల శుభ్రతపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.
మండల పరిషత్ అధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉదయగిరిని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో భూములున్నా కూడా దేనికీ పనికిరానందున పింఛన్ల మంజూరులో ఐదెకరాలు అనే నిబంధనను తొలగించాలన్నారు. గ్రామాలలో బెల్టుషాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అర్హులందరికీ పింఛన్లు మంజూరుచేయాలన్నారు. గ్రామసభలో తహశీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఫణి పవన్కుమార్, ఎంఈఓ అల్లాభక్షు, వ్యవసాయాధికారి సుబ్రహ్మణ్యం, హౌసింగ్ ఏఈ శివమోహన్రెడ్డి, పీఆర్ ఏఈ రవీంద్రనాథ్, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ రవీంద్రనాథ్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు శ్రీనివాసులు, ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటసుబ్బమ్మ, ఈఓపీఆర్డీ రంగారెడ్డి, ఎస్సై విజయకుమార్, పంచాయతీ కార్యదర్శి సికిందర్, వీఆర్వో మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతతో సగం వ్యాధులు దూరం
Published Wed, Oct 15 2014 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement