Sakshi News home page

కెసిఆర్కు రాజకీయ గురువును నేనే : చంద్రబాబు

Published Tue, Mar 4 2014 8:56 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు రాజకీయ గురువును తానేనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీర్ ట్రస్ట్ భవన్లో  ఈరోజు  కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కెసిఆర్ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఎకరాకు కోటి రూపాయల అదాయం వస్తుందట అన్నారు.

జాబు కావాలంటే బాబు కావాలన్నారు. రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానని చెప్పారు. హైదరాబాద్కు ఐటి కంపెనీలను తెప్పించానని చెప్పారు.  కెసిఆర్ కుటుంబం కోసం, జైపాల్ రెడ్డి కుటుంబం కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేయలేదని, సామాన్య జనం కోసం అభివృద్ధి చేశానన్నారు. ఖాళీ అవడానికి టిడిపి బ్రాందీ సీసాకాదని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement