హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు రాజకీయ గురువును తానేనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీర్ ట్రస్ట్ భవన్లో ఈరోజు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కెసిఆర్ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఎకరాకు కోటి రూపాయల అదాయం వస్తుందట అన్నారు.
జాబు కావాలంటే బాబు కావాలన్నారు. రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానని చెప్పారు. హైదరాబాద్కు ఐటి కంపెనీలను తెప్పించానని చెప్పారు. కెసిఆర్ కుటుంబం కోసం, జైపాల్ రెడ్డి కుటుంబం కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేయలేదని, సామాన్య జనం కోసం అభివృద్ధి చేశానన్నారు. ఖాళీ అవడానికి టిడిపి బ్రాందీ సీసాకాదని చెప్పారు.
Breadcrumb
కెసిఆర్కు రాజకీయ గురువును నేనే : చంద్రబాబు
Published Tue, Mar 4 2014 8:56 PM
Related news
-
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన చంద్రబాబు 2009లోనైనా గెలవాలని లెక్కకు మిక్కిలి హామీలనిచ్చారు. అయినా ఓడారు. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ల పొత్తుతోపాటు, ఎడాపెడా హామీలనిచ్చి గెలిచారు కానీ వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడారు. అందుకే ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! ఈసారి మళ్లీ ఎలాగైనా గెలవాలని బడ్జెట్తో నిమిత్తం లేకుండా హామీలను గుప్పిస్తు న్నారు. అలా కాదంటే, దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంతవుతుందో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి.చరిత్ర మొదటిసారి విషాదంగా, రెండవసారి ప్రహసనంగా పునరావృతమవుతుందంటాడు కార్ల్ మార్క్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల హామీలను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన ఆయన 2009లోనైనా గెలవాలని లెక్కకు అందనన్ని హామీలనిచ్చారు. అయినా ఓడారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 2019లో ఓడిన ఆయన 2024లోనైనా గెలిచి తీరాలనుకుంటూ తిరిగి ఉచితాల హామీలను కుప్పలుతెప్పలుగా ఇస్తున్నారు. ఆయనలోని ఈ లక్షణాన్ని గమనించినందుకే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు ‘ఆల్ ఫ్రీ బాబు’ అని పేరు పెట్టారు.2009 ఎన్నికల ప్రచారం నాటి ఒక జ్ఞాపకం ప్రస్తుత సందర్భంలో మళ్ళీమళ్ళీ గుర్తుకు వస్తున్నది. అప్పుడు చంద్రబాబు ప్రతి సభలో తన ఉచిత హామీలను ఒక దానిని మించి మరొకటి ప్రకటిస్తుండే వారు. దానిపై రాజశేఖరరెడ్డి కూడా ప్రతి సభలో, ‘‘చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అయిపోయారు. అన్నీ ఫ్రీగా ఇస్తారట. నమ్ముతారా?’’ అని ప్రజలను నేరుగా అడిగేవారు. అందుకు జవాబుగా ప్రజల నుంచి ‘‘నమ్మం, నమ్మం’’ అనే కేకలు పెద్ద ఎత్తున వినిపించేవి. చివరకు చంద్రబాబు అన్నన్ని హామీలిచ్చి కూడా రెండవసారి ఓడిపోయారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషం మరొకటి ఉంది. తనవైపు నుంచి తాను కూడా 2004లో కొన్ని హామీలిచ్చిన రాజశేఖరరెడ్డి, 2009లో కొత్తగా దాదాపు ఏమీ ఇవ్వలేదు. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, మరికొన్ని హామీలను బడ్జెట్ భరించలేదని చెప్పటం అందుకు కారణ మని అప్పుడు విన్నాము. దానితో రాజశేఖర రెడ్డికి చంద్రబాబు హామీలు అలవికానివనీ, కేవలం ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాల వర్షం కురిపిస్తున్నారనీ అర్థమైంది. అప్పుడు, తన ప్రచారానికి కొత్త హామీలను కాకుండా 2004–2009 మధ్య కాలపు తన సమర్థవంతమైన పాలనను, దానిపట్ల ప్రజలకు కలిగిన విశ్వాసాన్ని ఆధారం చేసుకోదలిచారు. ఈ ఆలోచన, అందుకు అనుగుణమైన ప్రచారం పనిచేశాయి. ఫలితం తెలిసిందే.రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిందేమిటో చూడండి. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ల పొత్తుతో గెలిచిన చంద్రబాబు, అటువంటి పొత్తు ఉండి కూడా, ఏ పొత్తూ లేని జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఎడాపెడా హామీలు ఇవ్వవలసి వచ్చింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమై, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడి పోయారు. తన పాలన ప్రజలను మెప్పించి ఉంటే, ఈ రెండవసారి పొత్తులు ఉన్నా లేకున్నా గెలవాల్సింది. కానీ అది జరగకపోగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. మరొక విధంగా చెప్పాలంటే, అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! తెలుగునాట ఎన్నికల చరిత్రలో ఇటువంటి అప్రతిష్ఠ సంపాదించిన నాయకుడు మరెవ్వరూ లేరు. తన 2004 నాటి ఎన్నికల ఓటమిని గమనిస్తే ఈ మాట మరింత బాగా అర్థమ వుతుంది. ఎన్నికలకు కొద్దిముందు తిరుపతి వద్ద ఆయనపైన నక్స లైట్ దాడి జరిగింది. ఆ స్థాయి గల ఒక నాయకునిపై అంత తీవ్రమైన దాడి జరగటం అదే మొదలు, అదే ఆఖరు. అటువంటపుడు తన పట్ల చాలా సానుభూతి రావలసింది! అయినప్పటికీ అందువల్లగానీ, తన పాలనా ప్రతిష్ఠవల్ల గానీ గెలవగలననే నమ్మకం ఏర్పడని చంద్రబాబు, ముఖ్యంగా రైతుల కోసం, గ్రామీణుల కోసం డజన్ల కొద్దీ వరాలు ప్రకటించారు. అయినా గెలవలేదు.ఎన్టీఆర్ ఉదంతాన్ని అట్లుంచినా, చంద్రబాబుకు సామాన్య ప్రజల సంక్షేమం కోరే నాయకునిగా ఎన్నడూ పేరు లేదు. అధికారానికి వచ్చిన కొత్తనుంచే అప్పటి ఆర్థిక సంస్కరణలను ఎంతో ఉత్సాహంగా భుజాన వేసుకున్న ఆయన తనను తాను సీఈఓగా చెప్పుకొన్నారు. సంస్కరణలకు దేశంలో అందరికీ మించిన పతాకధారి అయ్యారు. ఆ విషయంలో మన్మోహన్ సింగ్ను సైతం మించిపోయి దేశ విదేశాల లోనూ పేరు సంపాదించి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్లకు ప్రీతి పాత్రు డయ్యారు. కానీ ఆ క్రమంలో వ్యాపార వర్గాలకు ఎంత దగ్గరయ్యారో సామాన్య ప్రజలకు అంత దూరమయ్యారు. లోగడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత ఎన్టీఆర్ అమలుపరచిన సంక్షేమ పథకాలను తగ్గించి వేశారు లేదా రద్దుపరచారు. అందుకే ప్రజల విశ్వాసం కోల్పోయి 2004లో పరాజయం పాలవగా, ఆ పరిణామం ప్రజలను సంతోషపెట్టింది. కనీసం ఆర్థిక సంస్కరణలకీ, ఇండియా వంటి వెనుకబడిన సమాజంలో ప్రజా సంక్షేమానికీ మధ్య సమతులనాన్ని పాటించాలనే విజ్ఞత అయినా తనకు లేకపోయింది. అందువల్లనే ఈ 21వ శతాబ్దంలో జరిగిన నాలుగు ఎన్నికలలో (2004, 2009, 2014, 2019) మూడింట ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అయిదవ ఎన్నికను ఎదుర్కొంటున్నారు. తన ఆర్థిక సంస్కరణలు, పరిపాలన గొప్పగా ఉండి ఉంటే ప్రతిసారీ గెలవవలసింది! అది కూడా పొత్తుల కోసం చూడకుండా.ప్రతిసారీ తన ప్రత్యర్థులను మించి ఎడాపెడా హామీలు ఇస్తున్నారంటేనే చంద్రబాబు బలహీనత అర్థమవుతున్నది. మరొక వైపు 2014లో వలె గెలిచినపుడు అయినా సదరు హామీలను ఎంత మాత్రం అమలుపరచక విఫలం కావటాన్ని బట్టి అవి బడ్జెట్తో, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేనివని తెలిసిపోతున్నది. అవి అలవిమాలినవని ముందుగా గ్రహించలేనివాడు కాదాయన. అయినప్పటికీ ఆ పని చేశా రంటే, 2014లో, 2019లో చేసి, ఇపుడు 2024 కోసం తిరిగి చేస్తున్నా రంటే, ఆయన ఉద్దేశమే ప్రజలను మోసగించటమనుకోవాలి. ఏమి చేసైనా సరే అధికారం సంపాదించాలన్నమాట!అదే పని చేసి తలమీదకు తెచ్చుకున్న రెండు ప్రభుత్వాల ఉదాహరణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్నాయి. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ మితి మీరిన హామీలనిచ్చింది. అవి బడ్జెట్ శక్తికి మించిపోగలవని ఆర్థిక వేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా పెడచెవిని పెట్టిన కాంగ్రెస్ ప్రజలను మభ్యపుచ్చి అధికారాన్నయితే సంపాదించింది గానీ, హామీలను అమలుపరచలేక ఏడాది తిరగకముందే తలకిందులవు తున్నది. ప్రజలలో నిరసనలు రెండు రాష్ట్రాలలోనూ మొదలయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఈసారి ఇచ్చిన హామీలకు ఏటా సుమారు లక్షన్నర కోట్లు అవసరం కాగలవన్నది ఒక అంచనా. అది నిజం కాదని తెలుగుదేశం అధ్యక్షుడు చెప్పదలచుకుంటే, తన హామీలలో దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంత అవుతుందో, రాష్ట్ర బడ్జెట్తో పోల్చినపుడు పరిస్థితి ఏమిటో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి. అది నిజాయితీగల పద్ధతి అవుతుంది. ప్రజలు విజ్ఞులని స్వయంగా చంద్ర బాబు తరచూ గంభీరంగా ప్రకటిస్తుంటారు. ఒక నాయకుని గత పాలనలో ప్రజలకు కలిగే అనుభవం కూడా విజ్ఞతలోకి వస్తుంది.అందువల్ల, చంద్రబాబు గురించి ప్రజల గత కాలపు నిరాశలను, అప నమ్మకాలను మరచిపోయేటట్లు చేయాలంటే, ఆయన ఈ వివరాలు వెంటనే ప్రకటించాలి. లేనట్లయితే, ఆయనకు 2009లో రాజశేఖర రెడ్డి పెట్టిన ‘ఆల్ ఫ్రీ బాబు’ పేరును ప్రజలు తిరిగి గుర్తు చేసుకోగలరు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..! -
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. -
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు -
టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!
టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!
Related News by category
-
కూటముల కురుక్షేత్రం
కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్స్వీప్ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై... రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్ఎల్డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్ నిషాన్ సింగ్ ఎన్నికల వేళ పార్టీకి గుడ్బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్ దిగ్గజం నవీన్ జిందాల్ కురుక్షేత్రలో ఆప్ నేత సుశీల్ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్ సీట్గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.బీజేపీకి కొత్త కష్టాలు...2014 లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడంతో హంగ్ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్ దుష్యంత్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.ప్రాంతీయ పార్టీల్లో చీలికలు... ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.అజయ్ సింగ్ కుమారులైన దుష్యంత్ చౌతాలా, దిగ్విజయ్ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్ సారథ్యంలోని ఐఎన్ఎల్డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.2014లో హరియాణా జనహిత్ కాంగ్రెస్ (హెచ్జేసీ–బీఎల్) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్లాల్ 2007లో కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్లో విలీనం చేశారు.పోలింగ్ తేదీ: మే 25 సర్వేలు ఏమంటున్నాయి?!బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది. -
ఫేక్ వీడియోల వెనుక రాహుల్ హస్తం
ఫేక్ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ హస్తం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ఉన్న కొద్దిపాటి ఓటుబ్యాంక్ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోంది. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాగువాహటి: కాంగ్రెస్లో నిరాశ, అసంతృప్తి తీవ్రస్థాయికి చేరాయని, అందుకే ఆ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సిద్ధాంతాలు, విలువలు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోటీ పడాలి తప్ప ఫేక్ వీడియోలను నమ్ముకోవడం ఏమిటని కాంగ్రెస్ను నిలదీశారు. మంగళవారం అస్సాం రాజధాని గౌహతిలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ గాం«దీకి, ప్రియాంక గాం«దీకి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోందని చెప్పారు. ఈసారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని అన్నారు. దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. అన్ని మతాల పౌరులకు ఒకే పౌరచట్టం ఉండాలన్నారు. లౌకిక దేశంలో మతానికో చట్టం ఉండడం సరైంది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్దమేనని అన్నారు. అధికారంలోకి వస్తే సివిల్ కాంట్రాక్టులు మైనార్టీలకు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆక్షేపించారు. తక్కువ బిడ్ దాఖలు చేసిన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తారు తప్ప ఇలా మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇస్తామనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా మతపరమైన రిజర్వేషన్ ఉందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. ఓటర్లను మైనారీ్టగా, మెజార్టీగా చూసే అలవాటు తమకు లేదని కాంగ్రెస్కు చురక అంటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి ఎంతమాత్రం లేదని పునరుద్ఘాటించారు. -
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
షోలాపూర్: విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, సమస్యలు.. కవల పిల్లలు అని విమర్శించారు. దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ మన దేశానికి ఇచ్చింది పేదరికాన్ని తప్ప ఇంకేమీ లేదని ధ్వజమెత్తారు. మంగళవారం మహారాష్ట్రలోని లాతూర్, ధారాశివ్, షోలాపూర్ జిల్లాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బీజేపీకి వ్యతిరేకంగా కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి తీసుకొస్తోందని ఆరోపించారు. తన రూపాన్ని, గొంతును అనుకరిస్తూ.. తాను అనని మాటలు అన్నట్లుగా, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారని, సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను కాంగ్రెస్ ప్రేమ దుకాణంలో అమ్మకానికి పెట్టారని అన్నారు. ఎన్నికల పోరాటంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక విపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడం లేదని, అందుకే తప్పుడు దారులు ఎంచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం మూతపడక తప్పదని తేచ్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. పాకిస్తాన్కు విజ్ఞాపన పత్రాలు బంద్ ‘‘కాంగ్రెస్ పాలనలో మన దేశంలో ఉగ్రవాద దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్కు విజ్ఞాపనలు పంపించే పరిస్థితి ఉండేది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్కు విజ్ఞప్తులు చేసేవారు. అది చూసి మీడియాలో కొందరు మిత్రులు కాంగ్రెస్ను పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉండేవారు. అప్పట్లో ఇలాంటి వినతిపత్రాలపై పత్రికల్లో నిత్యం పతాక శీర్షికలతో వార్తలు వస్తుండేవి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ముష్కరుల దాడులు ఆగిపోయాయి.విజ్ఞాపన పత్రాలను మనం నమ్ముకోవడం లేదు. శత్రువుల భూభాగంలోకి అడుగుపెట్టి మరీ గట్టిగా బుద్ధిచెబుతున్నాం. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించాం. నవభారత్ ప్రగతికి ఇదొక సూచిక. ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉండే బలహీన ప్రభుత్వం బలమైన దేశాన్ని నిర్మించలేదు. ఈ ఎన్నికల్లో మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ప్రపంచ అభివృద్ధికి నేడు భారత్ వేగాన్ని అందిస్తోంది. గత పదేళ్లలో మనం ఎన్నో ఘనతలు సాధించాం. బలమైన ప్రభుత్వంతోనే అనుకున్నది సాధించగలం. ఓటు వృథా చేసుకోవద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసింది. నేను ఏక్ భారత్, శ్రేష్ట భారత్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ యువరాజుకు జ్వరం వచ్చేస్తోంది. దేశాన్ని దోచుకున్న నేతలు ఇప్పుడు జైల్లో ఉన్నారు. జనం సొమ్ము మింగేసినవారు తిరిగి కక్కాల్సిందే. అవినీతిపరుల నుంచి డబ్బు తిరిగి వసూలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్కు ఒక్క కుటుంబమే ముఖ్యం. మాకు దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యమే. 2014, 2019లో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మేలు చేయడానికే ఉపయోగించాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోంది.ఇప్పుడు సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ వచ్చినా రిజర్వేషన్లను రద్దు చేయలేరు. విద్య, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. వాటిని రద్దు చేయడం ఎవరివల్లా కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత వేసి, ఓటు బ్యాంక్కు కట్టబెట్టాలన్నదే కాంగ్రెస్ కుట్ర. ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎదగనివ్వలేదు. గత పదేళ్లలో పార్లమెంట్లో, అసెంబ్లీల్లో అడుగుపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం బీజేపీ, ఎన్డీయేకు చెందినవారే.ఈ ఎన్నికల్లో కనీసం 275 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితితో కాంగ్రెస్ ఉంది. అలాంటి పారీ్టకి ఎన్నికల్లో మద్దతు పలికి ఎవరూ ఓటు వృథా చేసుకోవద్దు. మహారాష్ట్రలో సంచరించే ఆత్మ(శరద్ పవార్) ఒకటి ఉంది. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు చేసింది సున్నా. ఎన్నికల సమరంలో ప్రజలు ఆయనను ఓటుతో శిక్షించే సమయం వచ్చింది. ప్రధాని పదవిని ముక్కలు చేస్తారట! దేశ ప్రజలను, రైతులను కాంగ్రెస్ దగా చేసింది. వారి కలలను విచ్చిన్నం చేసింది. కాంగ్రెస్ హయాంలో రైతన్నలకు దక్కాల్సిన నిధులను, ఎరువులను కూడా లూటీ చేశారు. సాగునీటి వసతి కల్పించలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. ప్రతిభావంతులైన మన దేశ యువతకు కాంగ్రెస్ వల్ల అన్యాయం జరిగింది. మన దేశం ముక్కలు కావడాన్ని కళ్లారా చూసినవారు ఇప్పుడు ప్రధానమంత్రి పదవిని ముక్కలు చేయాలని అనుకుంటున్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఇన్స్టాల్మెంట్లలో పంచుకుంటారట! ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు అనేది దేశాన్ని దోచుకొనే పథకమే. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోంది’’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయండిఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ విపక్ష కాంగ్రెస్ దురుద్దేశాలు, ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి మోదీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఓటు బ్యాంక్కు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆ పార్టీ ఎత్తుగడ అని పేర్కొన్నారు. వారసత్వ పన్ను విధించి, ప్రజల ఆస్తులను లాక్కొని ఓటు బ్యాంక్కు అప్పగించాలన్నదే కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, వివక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ ఎజెండాను ఓటర్లకు వివరించి, అప్రమత్తం చేయాలని ఎన్డీయే అభ్యర్థులను మోదీ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీకి ఒక విలువైన కార్యకర్త అని ఆయన రాసిన లేఖలో ప్రధాని ప్రశంసించారు. గతంలో గుజరాత్ మంత్రిగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా అమిత్ షా చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాలుగు లోక్సభ స్థానాల అభ్యర్ధులను ప్రకటించింది.అయితే లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం ఉండడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసిన లోక్సభ స్థానాల అభ్యర్ధుల్లో గుర్గావ్ నియోజకవర్గం నుంచి రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా నియోజకవర్గం నుండి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ,హమీర్పూర్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదాను పోటీకి దించింది. ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్ను ఖరారు చేసింది.హమీర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచారు. అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव 2024 के लिए हरियाणा, हिमाचल प्रदेश और महाराष्ट्र के कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/ys7tVzC61y— Congress (@INCIndia) April 30, 2024 -
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే: కేసీఆర్
సాక్షి, భద్రాద్రికొత్తగూడెంజిల్లా: ప్రాణమున్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలో(ఏప్రిల్30) నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. ఫ్రీ బస్సు పెట్టి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను ఆగం చేసిందని మండిపడ్డారు. మోదీ, రేవంత్ ఒక్కటేనని వారికి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ‘కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమూల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, పాలన అందాలని జిల్లా చేశాం. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్తో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు.రైతు బంధు 15వేలు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అయిన ఇచ్చాడా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 2 లక్షల రుణమాఫీ ఇలాంటి హామీలు అటకెక్కాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు. ఇప్పుడు కరెంట్ లేనే లేదు. పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ, గిరిజన గూడేలకు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చినం.గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటే భాయ్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ నరేంద్ర మోదీ ఉన్నారు. పదేళ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ భేటి పడావ్ భేటి బచావ్ ఏమైంది. నరేంద్రమోదీ దుర్మార్గ పాలన, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గోదావరి నదిని ఇచ్చంపల్లి నుంచి వేరే రాష్ట్రాలకు తరలించే కుట్ర చేస్తున్నారు. విద్యావంతులు, యువకులు ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో జీవన్మరణ సమస్య ఏర్పడింది. తెలంగాణను నాశనం చేసే పని మోదీ చేస్తున్నా రేవంత్ ఎందుకు మాట్లాడట్లేదు. తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టాలి అని చెప్తే నేను ఒప్పుకోలేదు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులను రోడ్డున పడేశారు. గురుకులంలో కరీంనగర్లో బాలిక చనిపోతే రేవంత్ నోరు మెదపడం లేదు. కేంద్రం, రాష్ట్రం మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన, హిందు ముస్లిం గొడవలు లేకుండా శాంతిభద్రతలతో రాష్ట్రాన్ని పరిపాలించాం. కాంగ్రెస్- బీజేపీ రెండు ఒక్కటే అని ముస్లిం సోదరులు గమనించాలి. బీఆర్ఎస్ ఒక్కటే మతసామరస్యం కాపాడుతుంది’ అని కేసీఆర్ అన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
మరోసారి ఉల్లంఘిస్తే జైలు తప్పదు..
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement