తిండీ తిప్పలు లేవు. ఇంటికి ఫోన్ చేసే అవకాశం లేదు. పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. చివరకు అక్కడకు పంపిన ఏజెంట్తో సంబంధాలు తెగిపోయాయి. యుద్ధవాతావరణంలో బాంబుల మోత నడుమ తిరిగి ఇంటికి చేరతామా, ప్రాణాలతో ఉంటామా, అని భయాందోళనకు లోనవుతున్న తరుణంలో భారత్ ఎంబసీ స్పందించటం..బతుకుజీవుడా అంటూ బయటపడడం నిజంగా కలగానే ఉంది.తెనాలి రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఈదులమూడి శశిదీప్ ఇరాక్ నుంచి క్షేమంగా ఇల్లు చేరిన సందర్భంగా మాట్లాడిన మాటలివి.
ఇరాక్ నుంచి క్షేమంగా బయటపడిన ఈదులమూడి శశిదీప్
తెనాలిఅర్బన్ : పొట్టకూటి కోసం ఏజెంట్ మాటలు నమ్మి మార్చి ఏడున శశిదీప్, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన చెందిన ఎస్కే బాషా, లక్ష్మణ్లతో కలిసి ఇరాక్ వెళ్లాడు. అక్కడ కోఫియా ప్రాంతంలోని ఓ కూల్డ్రింక్ కంపెనీలో పనికి కుదిరాడు. నాలుగో నెల గడుస్తుండగా, ఇరాక్ ప్రభుత్వానికీ, అక్కడున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ ముందే బాంబు పేలుళ్లు, కాల్పులు జరగటంతో కంపెనీ యాజమాన్యం వీరిని పట్టించుకోకుండా పారిపోయింది. దాదాపు నాలుగు రోజులు నరకయాతన అనుభవించిన తరువాత భారత్కు సమాచారం అందింది. మన ఎంబసీ ప్రతినిధులు స్పందించి ఈ ముగ్గురూ బయటపడేందుకు సహకరించారు.
అష్టకష్టాలు పడిన శశిదీప్ మంగళవారం రాత్రి కఠెవరం గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులను కలుసుకుని కంటతడి పెట్టుకున్నాడు. బతుకుతామని, తిరిగి కుటుంబ సభ్యులను కలుస్తామని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. యుద్ధ వాతావారణం నెలకొన్న తరువాత దాదాపు పదిరోజులు తిండి లేక, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే వీల్లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికినట్టు శశిదీప్ చెప్పాడు.
నెలల కాలానికి రెండు నెలల వేతనం మాత్రమే దక్కిందని వాపోయాడు. దాదాపు రూ. లక్షన్నర అప్పుచేసి ఉపాధి కోసం వెళితే, అప్పులే మిగిలాయని, తనలాంటి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. శశిదీప్తోపాటు వెళ్లిన ఎస్.కె. బాషా, లక్ష్మణ్లు కూడా క్షేమంగా ఇల్లు చేరుకున్నారు.
బతికి వస్తాననుకోలేదు
Published Thu, Jul 10 2014 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement