ఏపి భవన్ ఖాళీ చేయను: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ఏపి భవన్ ఖాళీ చేయను: చంద్రబాబు

Published Tue, Oct 8 2013 6:12 PM

ఏపి భవన్ ఖాళీ చేయను: చంద్రబాబు - Sakshi

న్యూఢిల్లీ: తనను ఏపీ భవన్ ఖాళీ చేయమని అంటున్నారని, తాను మాత్రం ఖాళీ చేయనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈరోజు సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రాణంపోయినా తెలుగు ప్రజలకు న్యాయం జరిగేవరకు పోరాడతానని చెప్పారు. సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను దెబ్బతీయడానికే తాను ఢిల్లీలో దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

ఇరు ప్రాంతాల జేఏసీ నేతలను పిలిచి  సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు మాత్రమే అవకాశం ఉంది. ఆ తరువాత పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో అఖిలపక్ష నేతలను ఎందుకు  చర్చలకు పిలవరు అని ఆయన అడిగారు.

ఇప్పటికీ చంద్రబాబు దీక్ష ఎందుకోసం చేస్తున్నారో స్పష్టం చేయలేదు. సమైక్యత కోసం చేస్తున్నారా? లేక త్వరగా విభజన చేయమని చేస్తున్నారా? అనేది అర్ధం కావడంలేదు.

Advertisement
Advertisement