జగన్నాధపురం (వాజేడు), న్యూస్లైన్: తెలంగాణ నుంచి భద్రాద్రిని విడదీస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలంగాణవాదులు హెచ్చరించారు. భద్రాద్రిని తెలంగాణ నుంచి విడదీయాలన్న ప్రయత్నాలను నిరసిస్తూ జగన్నాధపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై తెలంగాణవాదులు శనివారం నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణవాదులు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలిపే ప్రయత్నాల వెనుక.. దానిపై (భద్రాచలంపై) ప్రేమనో, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనో ఉందనుకుంటే పొరబడినట్టేనని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసేందుకే భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలిపేందుకు అక్కడి నాయకులు, పాలకులు యత్నిస్తున్నట్టు చెప్పారు. భద్రాద్రిని సీమాంధ్రలో కలిపిన వెంటనే 1/70 చట్టాన్ని సవరిస్తారని, ఇక్కడి ఖనిజ సంపదను దోచుకుంటారని, అప్పుడు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం రాముడు తెలంగాణకే స్వంతమని అన్నారు. భద్రాచలం డివిజన్లోని కొందరు నాయకులు తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి భద్రాచలాన్ని విడదీసేందుకు సాగుతు న్న యత్నాలకు వ్యతిరేకంగా డివిజన్లోని ప్రజలు, నాయకులు రాజకీయాల కు అతీతంగా ఉద్యమించాలని కోరారు. రాస్తారోకోలో టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జికె.శ్రీనివాస్, నాయకులు డెనార్జున రావు, దావూద్, వేణు, ఖాజావలి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
చర్లలో రాస్తారోకో
చర్ల: భద్రాచలం డివిజన్ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలన్న డిమాండుతో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో జరిగింది. ‘భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడు’, ‘భద్రాచలం డివిజన్ను తెలంగాణలోనే కొనసాగించాలి’ అని ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుడు, కాం గ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు నల్ల పు దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్ తెలంగాణలో అంతర్భాగమేనని అన్నారు. దీనిని లాక్కునేందుకు ఆంధ్ర ప్రాంత నాయకులు కుటిల యత్నాలు సాగిస్తున్నారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముం దుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కారంపూడి సాల్మన్రాజు, కెఎస్కె.నాయుడు, ఎస్డి.అజీజ్, కుంజా శ్రీనివాసరావు, అడ్డగర్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రిని విడదీస్తే ఉద్యమమే
Published Sun, Oct 27 2013 7:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement