- ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడాలేదు
- ఏది కనిపించినా.. కన్నుపడితే చాలు ఆక్రమణలే
- వేములపాడు మహమ్మదాపురం పంచాయతీల్లో కబ్జాలపర్వం
- యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ..
- జామాయిల్ తోటల సాగు
హనుమంతునిపాడు : ప్రభుత్వ భూములు, కుంటలు, పురాతన బంగళాలు, పోలీసు ఠాణా స్థలాలు, అటవీ భూములు, కొండ వాలు భూములు, పశువుల బీడు.. ఒక్కటేమిటి ఆక్రమణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వందల ఎకరాలు ఆక్రమించుని ఏకంగా తోటలు సాగు చేస్తున్నారు. హనుమంతునిపాడు మండలం వేములపాడు, కొండారెడ్డిపల్లి, మహమ్మదాపురం పంచాయతీలు కబ్జాదారుల అడ్డగా మారాయి. ప్రధానంగా వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని జామాయిల్, క్లోన్స్ మొక్కలు సాగు చేశారు. ముప్పళ్లపాడు పంచాయతీలోనూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి బడా బాబులు నిమ్మతోటలు నాటారు. కొంత మంది పక్క మండలాల రైతులకు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
కొండారెడ్డిపల్లి పంచాయతీలో..
కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 222లో గాడిరాళ్లకొండ వద్ద 274 ఎకరాలు, సర్వేనంబర్ 208లో ఆరెకరాల పోరంబోకు భూమి, సర్వేనంబర్ 207లోని 42 ఎకరాల పశువుల బీడును ఆక్రమించుకున్నారు. జామాయిలు తోటలు విస్తారంగా సాగు చేశారు. ఇటీవల జామాయిల్ కర్రను రాత్రులు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వదిలేశారు.
హైవే పొడవునా..
వేములపాడు సమీప నంద్యాల-ఒంగోలు హైవే పక్కన 419, 422, 420,421,405 సర్వే నంబర్లలో భూమిని దర్జాగా కబ్జా చేశారు. కుంటలు, ఫారెస్టు భూమి, ప్రభుత్వ భూములు, రోడ్డు సైడు భూములు, పశువుల బీడు భూమి, చెక్ డ్యాం సైతం కబ్జాలకు గురయ్యాయి. పశువుల కుంటలు చదును చేసి సాగు చేయడంతో పశువులకు తాగునీరు కరువైంది. అడవికి మేతకెళ్లిన జీవాలు, పశువులు అల్లాడుతున్నాయి. మహమ్మదాపురం రెవెన్యూలో సర్వేనంబర్ 422లో అసైన్డు భూమిలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయలకు, హాస్టల్ వార్డెన్లకు 18 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారు. వాటికి కూడా పాస్ పుస్తకాలు సృష్టించి అమ్ముకున్నట్లు సమాచారం.
కఠిన చర్యలు తప్పవు
డిప్యూటీ తహసీల్దార్ షేక్ రఫీని భూ కబ్జాలపై వివరణ కోరగా ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలతోపాటు కేసుల నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో దండోరా కూడా వేయించినట్లు తెలిపారు. హెచ్చరిక బోర్డులనుకూడా ఏర్పాటు చేశామన్నారు. కబ్జా భూములను పరిశీలించి హెచ్చరించినట్లు తెలిపారు.
కనిపిస్తే కబ్జా
Published Wed, Aug 12 2015 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement