► ప్రభుత్వ పనుల పేరుతో అక్రమంగా ఇసుక రవాణా
► ఏర్పేడు ఘటన తర్వాత కొత్త ఎత్తుగడ అవలంబిస్తున్న ఇసుకాసురులు
► నీరు–ప్రగతి పేరుతో అక్రమదందా
ఏర్పేడు ఘటన తర్వాత కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఇసుకాసురులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో తెల్లబంగారం దోపిడీకి తెరతీస్తున్నారు. వీరి అక్రమాలకు అధికారులు.. పాలకులు వంతపాడుతుండడంతో పరిస్థితి మళ్లీ మొదటి కొస్తోందని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్లకు ముఖ్యమంత్రి ఫొటో ఉన్న బ్యానర్ కుట్టుకుని మరీ ఇసుక దందా చేస్తుండడం గమనార్హం.
ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు
పదిరోజుల నుంచి అమ్మపాళెం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి ఇసుకను అడ్డు అదుపులేకుండా తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. గతంలో రెండు పంట లు సాగు చేసేవాళ్లం. మూడేళ్ల నుంచి ఒకే పంటతో సరిపెట్టుకుంటున్నాం. – చంద్రారెడ్డి, రైతు, అమ్మపాళెం
శ్రీకాళహస్తి రూరల్ : ఇసుక అక్రమ రవాణా శ్రీకాళహస్తి మండలంలో మళ్లీ జోరందుకుంది. దీంతో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏర్పేడు ఘటన తర్వాత కొంత వెనుకంజ వేసిన ఇసుకాసురులు పది రోజుల నుంచి మళ్లీ చెలరేగుతున్నారు. నెలరోజుల వ్యవధిలో శ్రీకాళహస్తి మండలంలో కోట్లాది రూపాయలు ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయి. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పనులు చేస్తున్నట్లు వారి వద్ద పర్మిట్ పొందుతున్నారు.
అనంతరం ట్రాక్టర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోతో కూడిన బ్యానర్ కట్టుకుని ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక అధికారులు దాడులు నిర్వహించి ఉన్నత అధికారులకు అప్పజెప్పడంతో వారు నామమాత్రపు అపరాధ రుసుం కట్టించుకుని వదిలివేస్తున్నారు. ఫలితంగా çస్వర్ణముఖి నదిలోని ఇసుకను విచ్చలవిడిగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే ఇసుక వ్యాపారం చేపడుతుండడంతో వారిని అడ్డుకోవడానికి స్థానిక అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.
రాత్రింబవళ్లు తేడా లేకుండా స్వర్ణముఖినది నుంచి ట్రాక్టర్లతో ఇసుకను రాజమార్గంలో తరలిస్తున్నారు. ఇసుక రవాణాను అడ్డుకుంటున్న వారిపై అక్రమార్కులు దాడులకు దిగుతున్నారని అమ్మపాళెం, పుల్లారెడ్డి కండ్రిగ, సుబ్బానాయుడు కండ్రిగ, తొండమనాడు గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పనుల సాకుతో..
శ్రీకాళహస్తి మండలంలో ప్రతి పంచాయతీలో ఇరిగేషన్ శాఖకు చెందిన చెక్డ్యామ్ పనులు మంజూరయ్యాయి. అయితే సంబంధిత కాంట్రాక్టర్లు స్వర్ణముఖినది నుంచి ఇసుక తీసుకెళ్లి పనులు చేయాలంటే రవాణా చార్జీలు ఎక్కువ అవుతాయన్న కారణంతో స్థానికంగా ఉండే చెరువుల మొరవ కాలువలు, వంకలు, వాగుల్లో ఉన్న ఇసుకను తరలించి పనులు చేస్తున్నారు. చెక్ డ్యామ్ల నిర్మాణం పేరుతో తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి అధికారుల వద్ద పర్మిట్లు పొందుతున్నారు.
ఈ వంకతో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను తిరుపతి, సత్యవేడు తదితర ప్రాంతాలకు తరలించి అక్కడ నుంచి బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాళెం, పుల్లారెడ్డికండ్రిగ, ఓటిగుంట, సుబ్బానాయుడు కండ్రిగ, తొండమనాడు తదితర ప్రాంతా ల నుంచి ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. దీంతో స్వర్ణముఖి నదిలో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి.
వాహనాలను సీజ్ చేస్తున్నాం
ఎలాంటి పర్మిట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లును పట్టుకుని సీజ్ చేస్తున్నాం. స్వర్ణముఖి నది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సంబం ధిత రైతులు తమకు సమాచారం అందిస్తే(9440900722) వెంటనే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సుదర్శన్ప్రసాద్, సీఐ, శ్రీకాళహస్తి రూరల్
మళ్లీ మొదలైంది..
Published Sun, Jun 18 2017 8:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement