మరోసారి చేపలు పట్టిన గ్రామస్తులు
తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి !
ఏలూరు రూరల్ : కొల్లేరులో అక్రమంగా తవ్విన చేపల చెరువు విషయమై మరోసారి రగడ చోటుచేసుకుంది. ఓ ప్రజా ప్రతినిధి అండతో రెండేళ్లకు పైగా సాగుతున్న ఈ గొడవ లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం గ్రామస్తులు వివాదాస్పద చెరువులో చేపలు పట్టేందుకుప్రయత్నించడంతో గొడవ మరోసారి రాజుకుంది. ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉదయం 9 గంటలకు గ్రామస్తులు 16 ఎకరాల విస్తీ ర్ణంలోని చెరువులో చేపలు పట్టేందుకు ఉపక్రమిం చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ఘంటసాల మహలక్ష్మిరాజు వర్గీయులు చెరువు తమదంటూ అడ్డుపడ్డారు. దీన్ని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. చేపలు పట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని గ్రామస్తులు ఆర్డర్ కాపీ చూపించారు. దీనిపై స్పందించిన మాజీ సర్పంచ్ వర్గీయులు హైకోర్టులో తప్పుడు కౌంటర్లు వేయించి ఆర్డర్ తెచ్చుకున్నారంటూ దుయ్యబట్టారు. చివరకు పోలీసుల సహకారంతో గ్రామస్తులు సుమారు 12 టన్నుల చేపలు పట్టి తరలించారు. దీనిపై మాజీ సర్పంచ్ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు చెందిన చెరువులో చేపలను పట్టుకుపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మహలక్ష్మిరాజు పలువురిపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నాయకులే సూత్రధారులు
సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ రగడకు నాయకుల కనుసన్నల్లో అధికారులే సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామంలోని వివాదాస్పద చేపల చెరువులు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కొల్లేరులో సాగిన అక్రమ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. తర్వాత ఈ చెరువులకు రెవెన్యూ అధికారులు 254/1, 255/1 లాంటి తప్పుడు సర్వే నంబర్లతో పట్టాలు మంజూరు చేశారు. వీటిని ఆధారం చేసుకుని మత్స్య శాఖ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. ఈ తతంగాన్ని చేతులు మారిన డబ్బు సంచులు నడిపించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. దీనివెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారు. నేడు ఈ చెరువుల్లో కోట్లాది రూపాయల విలువైన చేపలు ఉన్నాయి. దీంతో ప్రలోభాలకు గురైన అధికారులు చెరువు అభయారణ్య పరిధిలో ఉందని చెప్పడం లేదు. ఓ ప్రజాప్రతినిధి వెనకుండి కథ నడిపించడం మరో కారణం. ఇదే అదునుగా చేపలు పట్టేందుకు గ్రామస్తులు కోర్టులో పిటీషన్ వేశారు. కోర్టు అధికారులను వివరణ అడిగింది. అధికారులు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో చేపలు పట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని మహలక్ష్మిరాజు చెబుతున్నారు. దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడంతో ఈ రగడ ఎక్కడకు దారి తీస్తుందోనని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొల్లేరులో ఆగని రగడ
Published Mon, Mar 16 2015 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
నరసాపురం సిద్ధం.. సీఎం జగన్ కోసం జన ప్రభంజనం (ఫొటోలు)
నరసాపురం జనసంద్రం
రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్
చంద్రబాబుపై ఫైర్
పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్
పచ్చ చిలుకలుగా ఆ మేధావులు.. కళ్లకు గంతలు కట్టిన చంద్రబాబు
Tech Talk: స్మార్ట్గా పనిచేసే ఈ సరికొత్త ఫీచర్స్ మీకోసమే..!
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
మొబైల్ ఫోన్ టార్చ్లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
తప్పక చదవండి
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement