పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి | Sakshi
Sakshi News home page

పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి

Published Thu, May 14 2015 4:42 AM

Improved treatment should be provided to the poor

 ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

 కడప కార్పొరేషన్ :  పేదలకు నాణ్యమైన వైద్యం అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అదనపు జేసీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి అన్నారు. గోసుల కల్యాణ్ రామ్‌రెడ్డి 43వ జయంతి సందర్భంగా గోసుల క్రిష్ణారెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం  పాతకడప జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.  కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.

అనంతరం వైద్యులు వివిధ వ్యాధులకు చికిత్స చేసి సలహాలు, సూచనలు అందజేశారు.  బోన్ డెన్సిటోమెట్రి ఉచితంగా నిర్వహించారు.  ఆరు లక్షల విలువగల మందులు, పదవ తరగతి విద్యార్థులకు 20 బెంచీలు ఉచితంగా అందజేశారు.  రక్తదానం శిబిరం ఏర్పాటు  చేశారు. అన్నదానం చేశారు. డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, టీడీపీ నాయకులు దుర్గాప్రసాద్‌రావు, కార్పొరేటర్లు చైతన్య, చల్లా రాజశేఖర్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్, వైద్యులు శివానంద, రంగనాథ, మాజీద్, ఎస్‌ఏహెచ్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement