► పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం
► పదో తరగతి స్పాట్ కేంద్రంగా రాజకీయాలు
► బిజీబిజీగా ఉపాధ్యాయ సంఘాల నేతలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి స్పాట్ కేంద్రంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజకీయానికి తెరతీశారు. 2017 మార్చిలో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో పేపర్లు దిద్దే ఉపాధ్యాయులను సమస్యల పేరుతో పలకరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే కత్తినరసింహారెడ్డి(ఎస్టీయూ), రామస్వామి(ఆర్జేయూపీ), ఎమ్మెల్సీ గేయానంద్(యూటీఎఫ్), మాజీ ఎమ్మెల్సీ(ఎస్టీయూ) పోచంరెడ్డి సుబ్బారెడ్డి స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఏడాదంతే ప్రచారమే..
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంటుంది. మూడు జిల్లాలు కావడంతో అభ్యర్థులు ఏడాది ముందు నుంచే ప్రచారం మొదలు పెడతారు. ఒక్కో జిల్లాలో సుమారు 15 వేల ఓట్లుంటాయి. ప్రతి ఒక్కరినీ కలుసుకునేందుకు ఆ మేరకు సమయం కావాల్సి ఉండడంతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు.
ప్రకటించిన అభ్యర్థులు..
పీఆర్టీయూ: పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బచ్చల పుల్లయ్య
ఎస్టీయూ: సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి
ఆర్జేయూపీ: 2011లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన రామస్వామి
యూటీఎఫ్: ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్
వైఎస్సార్టీఎఫ్: సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్టీయూ(రెబల్): గత ఎన్నికల్లో ఓడిపోయిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి
Breadcrumb
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీపై కన్ను
Published Fri, Apr 22 2016 3:58 AM
Related news
-
‘టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యూయేషన్’ సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విజయవాడ: పదవ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను స్పాట్ మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఎండల తీవత్రను దృష్టిలో పెట్టుకుని మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా సీఎం జగన్ ఆదేశాలతో మూల్యాంకన కేంద్రాల్లోని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను స్పాట్ మూల్యాంకనం చేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా తీశారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు ఏప్రిల్ 26 వరకు కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలను సందర్శించాలని తనతో పాటు ఇతర సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా స్పాట్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాల పని తీరును ఆయన పరిశీలించారు. ముందుగా గుంటూరు జిల్లా నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్, పల్నాడు జిల్లాలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ను సందర్శించి, మూల్యాంకనం లో పాల్గొన్న ఉపాధ్యాయులందరితో సంభాషించారు. ప్రభుత్వం వారికి అందించిన అన్ని సౌకర్యాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. బల్లలు, కుర్చీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి వసతి, టాయిలెట్ల నిర్వహణ తదితరాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు అదే సమయంలో ఇతర జిల్లాల్లోని కేంద్రాలను కూడా సందర్శించాలని ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ అధికారులను కోరారు. కొన్ని మూల్యాంకన కేంద్రాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని,ప్రస్తుత అవసరాలకు వాటిని మరింత మెరుగు పరిచాల్సి ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కోసం కొత్త పాలసీని రూపొందించేందుకు విశాఖపట్నం, విజయనగరం కేంద్రాలను సందర్శించి తగు ఇన్పుట్స్ తీసుకుంటామని, వీలైనంత త్వరగా కొత్త విధానాలు రూపొందిస్తామని మంత్రి తెలిపినట్లు ప్రవీణ్ ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు. -
‘సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులే’
సాక్షి, ప్రకాశం : సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ.. మన ప్రభుత్వం వస్తే ఏం మేలు జరుగుతుందో ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ గెలుపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో పార్టీ మరింత మద్దతును కూడగట్టాలని సూచించారు. -
పదోన్నతులు త్వరగా కేటాయించాలి
డీఈఓకు వైఎస్సార్టీఎఫ్ వినతి ఒంగోలు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని వైఎస్సార్టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. పదోన్నతులు కల్పించే సమయంలో అక్టోబరు 2016 మాసాంతానికి ఖాళీ అయ్యే స్థానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డీఈవో పూల్లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. గత ఏడాది విలీనం జరిగిన పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్టీచర్లు ఇన్ఫర్మేషన్ డేటాలలో జాయినింగ్ తేదీని రకరకాలుగా నమోదుచేశారన్నారు. జిల్లా మొత్తం ఒకే తేదీ ఉండేలా చర్యలు చేపట్టకపోతే రాబోవు బదిలీల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని విజ్ఞప్తిచేశారు. డీఈవోను కలిసిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షులు డీసీహెచ్.మాలకొండయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, బొజ్జా సురేష్లు ఉన్నారు. -
ఉపాధ్యాయుల నూతన సంవత్సర వేడుకలు
ఒంగోలు వన్టౌన్ : జిల్లాలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి నాయకత్వంలో సంఘ నాయకులు, ఉపాధ్యాయులు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వైవీతో కేక్ కట్ చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.వెంకటేశ్వరరెడ్డి, జి.చంద్రశేఖర్, పి.శేషిరెడ్డి, సీహెచ్ భాస్కరరెడ్డి, పులి అంజిరెడ్డి, శిగా మోహన్రావు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, జె.శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, నాయబ్స్రూల్ పాల్గొన్నారు. బీఈడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. బీఈడీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ నాయకులు జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఇతర అధికారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు జీఎస్ఆర్ సాయి, ఎన్.శరత్బాబు, జిల్లా నాయకులు పి.రమణకుమార్, కె.రవికాంత్, దశరథరామిరెడ్డి, ఎల్.నారాయణరెడ్డి, ప్రసాద్, బి.కోటేశ్వరరావు, కాలేషావలి పాల్గొన్నారు. ఆపస్ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) గోడపత్రికను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. ఆపస్ టేబుల్ క్యాలెండర్ను బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సీతారామయ్య, కె.మల్లికార్జునరావు, రాష్ట్ర కోశాధికారి సీహెచ్ శ్రావణ్, కార్యదర్శి ఎ.బలరామకృష్ణ, జిల్లా బాధ్యులు ఎస్.హనుమంతురావు, కె.శేషారావు, జి.ప్రతాప్, దిలీప్చక్రవర్తి, చంద్రశేఖర్, వీఎన్ఆర్ మూర్తి పాల్గొన్నారు. పండిత పరిషత్ ఆధ్వర్యంలో.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పండిత పరిషత్ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో పండిత పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పి.మహబూబ్ఖాన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్బాబు,వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖయూంబాషా, కోశాధికారి రఘుబాబు, వీరేంద్ర, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నూతన సంవత్సరం 2015 డైరీ, క్యాలెండర్లను కలెక్టర్ విజయకుమార్ ఆవిష్కరించారు. 2014 సంవత్సరంలో విడుదలైన జీవోల పుస్తకాన్ని జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాసులు, కె.ఎర్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వెంగళరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్వీ ప్రసాద్, అజయ్కుమార్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగన్మోహన్, సతీష్, సురేష్, బాలగురవయ్య, తిరుపతిస్వామి, సుబ్బారావు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో.. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆ సంఘ ఉపాధ్యాయులు కలెక్టర్ జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఖజానా శాఖ ఉపసంచాలకులు కె.లక్ష్మీకుమారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ సుబ్బారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.శ్రీనివాసులు, కె.శ్యాంసుందరరావు, ఎం.రాఘవరావు, పీపీ రంగారెడ్డి, ఎ.అమ్మయ్య, ఏవీ సుబ్బారావు, పి.ఆంజనేయులు, ఐ.హనుమంతురావు, పి.వెంకటేశ్వర్లు, ఎన్.వీరయ్య పాల్గొన్నారు. ఏపీజీటీఏ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2015 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.మాల్యాద్రిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి.సంజీవి, జిల్లా అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ప్రధానకార్యదర్శి జీవీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు జేవీ సుబ్బయ్య, ఓంకారయ్య పాల్గొన్నారు. -
అసమర్థ పాలన
కర్నూలు విద్య: రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగానే విద్యా శాఖ సమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబులపతి అన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఓబులపతి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యంతో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆదాయమే తప్ప.. విద్యాశాఖ అభివృద్ధిపై ఏమాత్రం పట్టదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి విద్యాశాఖతోనే ముడిపడి ఉంటుందనే విషయం బాబు గుర్తుంచుకోవాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన ఆయన.. విపక్షాలపై చిందులేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై జాక్టో, ఫ్యాక్టో, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం కరువైందన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఏ హాస్పిటల్కు వెళ్లినా తమకెలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగులు చికిత్సల కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయలేకపోతోందన్నారు. పాఠశాలల పనివేళలను కోఠారి కమిషన్, విద్యావేత్తలు, మేధావులు నిర్ణయించినవి కాదని.. ప్రభుత్వం ఎలాంటి క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టకనే మార్పు చేసి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను మానసికంగా వేధిస్తోందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పని వేళలు మార్చామంటున్న ప్రభుత్వం.. ఆ చట్టం ప్రకారం స్కూళ్లలో ఎందుకు వసతులు కల్పించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేవని, అందుకే పాఠశాల విద్యా చరిత్రలో ఎప్పుడు లేనంతగా అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. 60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తక్షణమే ప్రకటించి జులై 1, 2013 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.398 వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులను అడ్హాక్ ప్రమోషన్స్తో భర్తీ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం స్కూళ్లకు రవాణా సౌకర్యం సక్రమంగా లేదని, ఈ కారణంగా విద్యార్థులు 3 నుంచి 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందన్నారు. దీంతో సరైన సమయానికి పాఠశాలకు చేరుకోలేక రోజూ రెండు మూడు పీరియడ్లు కోల్పోతున్నారన్నారు. హైస్కూళ్లలో భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ఏపీ వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్రెడ్డి, రమేష్లు డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా సోషల్ స్కూల్ అసిస్టెంట్ రెండోపోస్టును మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, కౌన్సెలింగ్ విధానానికి విఘాతం కలిగించేలా ఉన్న అక్రమ బదిలీలను నిలిపివేయాలన్నారు. ఐటీడీ ఆశ్రమ పాఠశాలల్లోని ఖాళీలను హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లను జీఓ ఎంఎస్నం.3 ప్రకారం ప్రమోషన్లు కల్పించి, 2014 డీఎస్సీలో సీఆర్పీలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలన్నారు. రేషనలైజేషన్, బదిలీలు విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లో చేపట్టాలన్నారు. ధర్నాలో ఏపీవైఎస్సార్టీఎఫ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు తులసిరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి సుబ్రమణ్యంరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుదర్శన్రెడ్డి, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
Related News by category
-
స్వతంత్ర అభ్యర్థులు ‘గ్లాస్’ గుర్తును ఎంచుకోవచ్చు: ఈసీ వర్గాలు
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో గుర్తులకు సంబంధించి ఈసీ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో జనసేన పోటీలో లేనిచోట గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా ఈసీ వర్గాలు.. జనసేన లేని చోట స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే గ్లాస్ గుర్తును ఎంపిక చేసుకోవచ్చు. గ్లాస్ గుర్తు కామన్ సింబల్ అంటూ ఓ వర్గం మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని ధృవీకరించాయి. -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్రెడ్డి, వైఎస్ మధుకర్రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్మోహన్రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు. డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం. -
డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ
పాతికేళ్ల క్రితం... » రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్లు వచ్చాయి. » బ్యాంకుల్లో విత్డ్రాయల్కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు. » ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. » వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు. మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది. జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement