► జిల్లాలో 1251 మంది పింఛను నిలిపివేత
► సాకుగా ఆధార్ నంబర్లు లబోదిబోమంటున్న లబ్ధిదారులు
సామాజిక భద్రత పింఛన్ల కోత మళ్లీ మొదలైంది. రకరకాల సాకులతో ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కోత విధిస్తూ వస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అర్హత ఉన్నప్పటికీ పింఛను పొందేందుకు అనర్హతకు గురవుతున్నారు. భారం తగ్గించుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు రద్దు చేస్తూ వస్తోంది. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 13,434 మందికి పింఛన్లు నిలిపివేసింది. కేవలం పింఛను సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది పేదలు పిడుగులాంటి వార్తతో అల్లాడిపోతున్నారు.
నరసరావుపేటరూరల్ : జిల్లాలో 3లక్షలా 14వేల 292 మందికి ప్రతి నెలా పింఛను అందిస్తున్నారు. ఇందులో 1251మందికి ఈ నెలలో పింఛను నిలిపివేశారు. ఎటువంటి సమాచారం లేకుండా పింఛను నిలిపివేయడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నకిలీ ఆధార్ కార్డులు అందజేయడం వల్లే పింఛన్లు నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు అందజేసిన ఆధార్ కార్డు నంబర్లను సర్వర్లు తీసుకోవడం లేదని అంటున్నారు. కొంత మంది సర్వీస్ ప్రొవైడర్లు నకిలీ ఆధార్కార్డులను పంపిణీ చేసారని తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకే పింఛన్లు నిలిపివేసినట్టు తెలిపారు. పూట గడవక అల్లాడే పేదలు ప్రభుత్వం అందించే పింఛను కోసం ఎదురు చూస్తుండగా పిడుగులాంటి వార్తను ప్రభుత్వం వారినెత్తిన పడేసింది.
ఆధార్లను సరిచేసుకోండి..
పింఛన్లు నిలిచిపోయిన లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్లను సరిచేసుకోవాలని ప్రసాద్ కోరారు. నకిలీ ఆధార్ నంబర్ల నిలిపివేతలో భాగంగా లబ్ధిదారులు తమ ఆధార్ ఎన్రోల్ మెంట్ ఐడీలను సంబంధిత కేంద్రాలకు తీసుకొచ్చి సరైన ఆధార్ సంఖ్యను పొందాలన్నారు.
ప్రసాద్, ఏపీవో, జిల్లా పింఛన్ల పంపిణీ విభాగం
పింఛనుదారులపై పిడుగు
Published Sat, Apr 2 2016 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement