కలెక్టరేట్, న్యూస్లైన్: పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను నెలరోజుల్లో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. మంగళవారం తన చాంబర్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులపై రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విచారణతోపాటు, చార్జీషీటు దాఖలు, బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారాన్ని సైతం అప్పటిక ప్పుడే అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ,ఎస్టీ కేసుల విచారణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ యేడాది 77కేసులు పెండింగ్కు పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. వీటిలో 71 కేసులకు సంబంధించి ఎస్పీ కార్యాలయం నుంచి నివేదికలు రావాల్సి ఉందన్నారు. వీటిపై ఆర్డీఓలు, డిఎస్పీలు శ్రద్ధ తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నారాయణపేట్, నాగర్కర్నూల్ డివిజన్లలో ఎక్కవ కేసులు పెండింగ్లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
చార్జీషీట్లో జాప్యం తగదు
నమోదైన కేసులపై విచారణ చేపట్టిన తర్వాత చార్జిషీట్ దాఖలు జాప్యం జరుగుతుందని, ఈ కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం చేయలేకపోతున్నామని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది గతంలో కన్నా ఎక్కువ కేసులు నమోదైనా, పరిష్కారంలో మాత్రం ఏలాంటి పురోగతి లేదన్నారు. మహబూబ్నగర్ డిఎస్పీ మల్లికార్జున్ మాట్లాడుతూ, విచారణ పూర్తి చేసిన కేసులకు సంబంధించి వెంటనే చార్జీషీటు దాఖలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఒక కాపీని కలెక్టరేట్కు పంపిస్తున్నట్లు తెలిపారు. కొన్ని కేసుల్లో మాత్రమే పై అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు ఆయన కలెక్టర్కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంలో సంక్షేమ శాఖ, కలెక్టరేట్ కార్యాలయానికి మద్య కమ్యూనికేషన్ గ్యాప్ ందని, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని డిడి జయప్రకాష్ను ఆదేశించారు.
రూ.19లక్షలు పంపిణీ
గత ఏడాదికి నమోదైన కేసుల్లో 43 కేసులను పరిష్కరించి, బాధితులకు రూ..19లక్షల పరిహారాన్ని అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు నమోదైన కేసులను త్వరిత గతిన పరిష్కరిస్తే బాధితులకు పరిహారాన్ని అందజేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కేసుల్లో సాక్షులుగా ఉన్న వారికి ప్రభుత్వ పరంగా చెల్లించే డబ్బులు సరిపోవడంలేదనే ఫిర్యాదులు వస్తే పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో జేసి ఎల్.శర్మణ్, ఏఎస్పీ ప్రదీప్ రెడ్డి, ఏజేసి డా.రాజారాం, డిఆర్వో రాంకిషన్, సోషల్ వెల్ఫేర్ డిడి జయప్రకాష్, ఆర్డీఓలు హన్మంతరావు, యాస్మిన్ బాష, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
నెలరోజుల్లో అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి
Published Wed, Oct 9 2013 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నోటుతో ఓటుకు ఎర
ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే స్వర్ణయుగం
No Headline
కందుకూరులో.. ఇక దూకుడే
సీఎం సవాల్ను స్వీకరించే దమ్ముందా చంద్రబాబూ?
బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక
గెలిపించండి.. అండగా ఉంటా
నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement