మా పేర్లెక్కడ | Sakshi
Sakshi News home page

మా పేర్లెక్కడ

Published Thu, Dec 11 2014 1:57 AM

In the absence of their names on the list

చిన్నమండెం: రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో బుధవారం సాయంత్రం చిన్నమండెం ఎస్‌బీఐని రైతులు  ముట్టడించారు.  రుణమాఫీ  జాబితాను రెండు రోజులుగా రైతులు పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో  పలువురు రైతులు  స్థానిక ఎస్‌బీఐ  మేనేజర్ శ్రీనివాసులు శర్మ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.  అన్ని పత్రాలు సమర్పించినా జాబితాలో తమ  పేర్లు  ఎందుకు లేవని  ప్రశ్నించారు.
 
   చిన్నమండెం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో 4728మందికి  గాను కేవలం  759 మంది రైతులకు మాత్రమే మాఫీ కావడమేమిటని  మేనేజర్‌తో వాదనకు దిగారు.  టీడీపీ నాయకుడు నరసింహారెడ్డి, భాసిత్‌ఖాన్ ఆధ్వర్యంలో రైతులు బ్యాంకును ముట్టడించారు.  అనంతరం  తమకు న్యాయం చేయాలని కోరుతూ తాహశీల్దార్ భవానికి వినతిపత్రం అందించారు. 

Advertisement
Advertisement