రాపూరు, న్యూస్లైన్ : మతిస్థిమితం కోల్పో యి.. ఉన్మాదిగా మారిన వ్యక్తి మండలంలోని శానాయిపాళెంలో వీరంగం చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గొడ్డలి పట్టుకుని చెలరేగిపోయి పలువురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం పాలూరు గ్రామానికి చెందిన సూదలగుంట శేషయ్య కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదంతో వ్యవహరిస్తున్నాడు.
ఏడేళ్ల క్రితం శేషయ్య పెట్టే బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శేషయ్య మద్యానికి బానిసై ఉన్మాదిగా మారాడు. గ్రామంలో తరచూ ఒంటిపై ఉన్న దుస్తులు విప్పేసి అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడేవాడు. దీంతో శేషయ్యను నాలుగేళ్ల క్రితం శానాయిపాళెంలో ఉన్న తన అక్క, బావ రాణెమ్మ, నారాయణ తీసుకెళ్లి తమ దగ్గర ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి శేషయ్య గ్రామంలో కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. మధ్యాహ్న సమయంలో శానాయిపాళెం రోడ్డు వద్ద కట్టెలు కొట్టుకునేందుకు గొడ్డలి తీసుకెళుతున్న రత్నమ్మను అటకాయించాడు. ఆమె వద్ద ఉన్న గొడ్డలి తీసుకున్నాడు. అనంతరం ఆమెపై దాడి చేసి గాయపరిచాడు.
అక్కడే ఉన్న చెల్లటూరుకు చెందిన ఆదెయ్యపై దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకుని పరారయ్యాడు. అక్కడి నుంచి శేషయ్య గ్రామంలోనిదేవాలయం వద్దకు వెళ్లి అక్కడ అరుగుపై పడుకుని ఉన్న వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేశాడు. అక్కడే ఉన్న శివయ్య, రాగ మ్మపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో వీరికి తీవ్రగాయాలు అయ్యాయి. పొదలకూరు 108 సిబ్బంది నె ల్లూరుకు తరలించారు. వీరిలో శివయ్య,రాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ఉన్మాది
శానాయిపాళెంలో పలువురిపై దాడిచేసి గాయపరిచిన ఉన్మాది శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలిని గ్రామంలోని రచ్చ బండవద్ద పడేశాడు. కండలేరు వైపు వెళుతుండగా కండలేరు డ్యామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా తనకేమీ తెలియదని శేషయ్య చెబుతున్నట్టు కండలేరు డ్యాం ఎస్ఐ నరసింహారావు తెలిపారు. ఉన్మాదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఉన్మాది వీరంగం
Published Wed, Oct 23 2013 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement