జేఎన్టీయూహెచ్కు హైకోర్టు ఆదేశం
మిగిలిన లోపాలను నెలరోజుల్లో సవరించుకుంటామని హామీ ఇవ్వాలి
ఆ తరువాత సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలి
హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల విషయంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) వాదనలవైపు హైకోర్టు మొగ్గు చూపింది. నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించుకున్న కాలేజీలను మాత్రమే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామంటూ జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చేసిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వాదనల ప్రకారమే, ని బంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధనా సిబ్బం దిని కలిగి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలంటూ హైకోర్టు సోమవారం జేఎన్టీయూహెచ్ని ఆదేశించింది. జేఎన్టీయూ చూపిన ఇతర లోపాలనూ ప్రవేశ ప్రక్రియ ముగిసే రోజు నుంచి నెల రోజు ల్లోపు సవరించుకుంటామని పిటిషనర్ కాలేజీలన్నీ కూడా హామీ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకుంటామంటూ దరఖాస్తు చేసుకున్న కాలేజీలు విఫలమైతే ఆ తరువాత నిర్ణయం తీసుకోవచ్చని జేఎన్టీయూకు స్పష్టం చేసింది.
జేఎన్టీయూ తీరును తప్పుబట్టిన హైకోర్టు
కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించే వ్యవహారంలో జేఎన్టీయూ వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. జేఎన్టీయూ స్వయంగా తాను రూపొందించిన నిబంధనలను తానే అమలు చేయలేదని ఆక్షేపించింది. తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించడంతో పాటు అఫిలియేషన్లను కూడా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కాలేజీల లోపాలను గుర్తించినప్పుడు వాటిని సవరించుకునేందుకు వీలుగా 174 కాలేజీలకు ముందుగానే తెలియచేయాల్సి ఉండేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. నిబంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధన సిబ్బంది ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలని ఆయన జేఎన్టీయూ హైదరాబాద్ను ఆదేశించారు. అంతేగాక పలు కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గింపు విషయంలో జేఎన్టీయూ ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
బోధన సిబ్బంది ఉన్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
Published Tue, Aug 26 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
ప్రచార పాట్లు
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement