విజయనగరం కంటోన్మెంట్: తారక రామ తీర్ధ సాగర్ పనులకు మరో అవరోధం ఎదురయ్యింది. ఎప్పటికప్పుడు వాయిదాలు, గడువులతోనే సా....గుతున్న పనులకు మరో ఆటంకం ఎదురయింది. ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రాకపోయినా అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని రామతీర్థం కొండ లోంచి తవ్వాల్సిన సుమారు కిలోమీటరు పైగా సొరంగం పనులకు సంబంధించి 2008లో రూ.11 కోట్లు మంజూరయ్యాయి. వాటితో అప్పట్లో పనులు చేస్తే సకాలంలో పూర్తయ్యేది. కానీ అటవీ అనుమతులు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంతో పనులు సాగడం లేదు.
ఇప్పుడు ఈ సొరంగం పనులు చేపట్టేందుకు అవసరమైన అధునాతన మెషీన్లు కొనుగోలు చేయడానికి అప్పటి నిధులు చాలవని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇప్పుడు ఈ టన్నెల్ తవ్వాలంటే సుమారు రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అధికారులు, కాంట్రాక్టర్లు అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్లు ఇక్కడే తయారు చేసి పనులు చేయాలి.
ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి అటవీ అనుమతులపేరుతో కాలయాపన చేస్తుండటంవల్ల టన్నెల్ పనులు అలానే నిలిచిపోయాయి. పెరిగిన ధరలిస్తే తప్ప పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ప్రాజక్టుకు మరో ఆటంకం ఎదురయినట్టయింది.
Breadcrumb
Related news
-
హైవేల నిర్వహణ పదేళ్లు కాంట్రాక్టర్లదే
సాక్షి, అమరావతి: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లయబిలిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. ఈమేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ఓ ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంభవించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరిగినవే. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24 శాతం మంది అంటే 41 వేల మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. మృతుల సంఖ్య 9శాతం పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థలు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ చేపడుతున్నాయి. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు చేస్తాయి. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తున్నాయి. కానీ పలు కాంట్రాక్టు సంస్థలు కేవలం ఐదేళ్లే నాణ్యతతో ఉండేలా హైవేలను నిర్మిస్తున్నాయని ఎన్హెచ్ఏఐ ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత ఆ రోడ్లు దెబ్బతింటున్నాయి. వాటి నిర్వహణ భారం ఎన్హెచ్ఏఐపై పడుతోంది. దీనికి పరిష్కారంగానే నిర్వహణ బాధ్యతను పదేళ్లకు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈపీసీ, యాన్యుటీ, బీవోటీ పద్దతుల్లో నిర్మించే జాతీయ రహదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది. తక్షణం అమలులోకి ఎన్హెచ్ఏఐ నూతన విధానాన్ని తక్షణం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆమోదించిన జాతీయ రహదారుల నిర్మాణాలకు కొత్త విధానాన్ని వర్తింపజేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినవాటికి, త్వరలో చేపట్టబోయే వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రూ.7.81 లక్షల కోట్లతో 25,713 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. వాటిలో ఈపీసీ విధానంలో 56 శాతం, 42శాతం యాన్యుటీ విధానంలో, 2 శాతం బీవోటీ విధానంలో నిర్మించనుంది. వీటి నిర్మాణాన్ని చేపట్టే కాంట్రాక్టు సంస్థలు పదేళ్లపాటు వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను చేపట్టాలి. తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని, నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. -
రూ. లక్ష పెంచితేనే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల పనులు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు. అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్గా మారబోతోంది. ఎందుకు పెంచుతున్నారంటే.. ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది. కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది. -
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్లోని ఎయిమ్స్కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్పేపర్లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్లోని ఛార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్ను తెప్పించనున్నట్లు సమాచారం. బగ్వాల్ పండుగ వారితోనూ చేసుకుందాం ‘‘డ్రిల్లింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్ ప్రాంతంలో బగ్వాల్ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. సొరంగంలో కూలింది ఎక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు. -
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు.
Related News by category
-
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.కాగా, ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ.. కోర్టుకు వెల్లడించింది.ఇదే సమయంలో జనసేన పిటిషన్కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ తెలిపింది. -
YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
గుంటూరు, సాక్షి: ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లంటే రాజకీయాలు అవపోసపట్టిన నేతలు, పెద్ద పెద్ద కాన్వాయ్లలో వచ్చి ఊదరగొట్టే రాజకీయ ఉద్దండులు.. ఈ తరహా ప్రచారం కనిపిస్తుంది. కానీ స్టార్ క్యాంపెయినర్లు అంటే తెలిసిన ముఖాలే ఉండాలా ఏంటి?. దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ. తొలిసారి సామాన్యులకు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో 87 శాతం పేదలకు పథకాలు అందాయని, ఇప్పుడు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్లేందుకు జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాల్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం చేపడుతున్నాం. పార్టీ బూత్ లెవల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారో వాటిని వివరిస్తారు. ఇవాళ్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి ఈ కార్యక్రమం నడుస్తుంది.ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ చేరవేస్తాం. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడే విధంగా కాకుండా.. రికార్డెడ్గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని సజ్జల ఈ సందర్భంగా అన్నారు.ఇక.. వైఎస్సార్సీపీ తరఫున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశాం. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశాం. సీఎం జగన్ మీద తమ అభిమానం ప్రదర్శిస్తూనే.. మరోసారి వైఎస్సార్సీపీకి ఎందుకు ఓటేయాలో వీళ్లు రాష్ట్ర ఓటర్లకు వివరిస్తారని సజ్జల తెలిపారు. YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లేచల్లా ఈశ్వరి(మైలవరం, ఎన్టీఆర్ జిల్లా)ఎ. అనంతలక్ష్మి(రాజమండ్రి సిటీ, తూర్పు గోదావరి జిల్లా)పండలనేని శివప్రసాద్(అవనిగడ్డ, కృష్ణా)సయ్యద్ అన్వర్(నెల్లూరు జిల్లా)కటారి జగదీష్(అనకాపల్లి జిల్లా)తనకు టీడీపీకి, చంద్రబాబుకి ఉన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు లేరని, వైఎస్సార్సీపీ పాలనలో లబ్ధి పొందిన సామాన్యులే తన స్టార్క్యాంపెయినర్లు అని, ఈ లెక్కన దేశంలోనే తనకు ఉన్నంత స్టార్ క్యాంపెయినింగ్ మరెవరికి ఉండబోదని, ఇది ఒక చరిత్ర అని సీఎం జగన్ తరచూ చెబుతూ వస్తుండడం చూస్తున్నదే. ఇప్పుడు అదే నిజం చేస్తూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సామాన్యులకు చోటు కల్పించి ట్రెండ్ సెట్ చేశారాయన. -
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
మళ్లీ జగన్ రావాలి
పథకాలతో జగన్ మాకు డబ్బులు పంచలేదు. ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికంపై పోరాటంలో సాయపడ్డారు. మధ్య తరగతి ప్రజలను కష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కించారు. మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు.. స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించారు. విలేజ్ క్లినిక్లతో మా ఆరోగ్యాన్ని కాపాడారు. మహిళలకు ఒక అన్నలా, తమ్ముడిలా ఆర్థికంగా అండగా ఉండి తమ కుటుంబాలను అప్పుల ఊబి నుంచి గట్టున పడేశారు. పెద్ద కొడుకులా మలి వయసులో వృద్ధుల్ని ఆదుకున్నారు. ఇంటివద్దకే సంక్షేమం, సుపరిపాలనతో పాలనాదక్షతను చాటిచెప్పారు. ఏదేమైనా మరోసారి జగన్కు ఓటేస్తే ఈ సంక్షేమం కొనసాగడంతో పాటు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్రంలోని ఓటర్లు ‘సాక్షి రోడ్షో’లో అభిప్రాయపడ్డారు.మరో 10 రోజుల్లో ఎన్నికలు.. రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల కోలాహలం .. ఎవరికి ఓటర్లు పట్టం కడతారు? అని ఒకటే చర్చ.. ‘సాక్షి రోడ్షో’లో భాగంగా ప్రత్యేక బృందం పల్లెలు, పట్టణాల్లో రచ్చబండలు, పంట పొలాలు, రోడ్ల కూడళ్లు, కిళ్లీ షాపులు, ఆటోస్టాండ్లు, మార్కెట్లు ఇలా వీలున్న చోటుకు వెళ్లి ఓటర్లను పలకరించింది. చేనేతకారులు, రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు, రైతులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలతో ముచ్చటించింది. ఎవరికి.. ఎందుకు ఓటేస్తామో ‘సాక్షి’ రోడ్ షోలో ఓటర్లు స్పష్టం చేశారు. అనంతపురంజిల్లా రోడ్ షోమేలు చేసిన వారిని మరిచిపోలేంఉమ్మడి అనంతపురం జిల్లాలో 70 కిలోమీటర్ల పరిధిలోని ఓటర్లను సాక్షి రోడ్ షో బృందం పలకరించింది. మాకు రాజకీయాలతో పనిలేదు.. సాయం చేసిన వారికి అండగా నిలుస్తామని కొందరు చెబితే.. మహిళలు, చేతివృత్తిదారులు, కూలీలు, రైతులు, వృద్ధులు తమకు సాయం చేసిన జగన్కు ఓటేస్తామని నిర్మొహమాటంగా పేర్కొన్నారు. జిల్లాలో అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో 75 కిలోమీటర్లు సాగిన రోడ్షోæలో ఓటర్ల మనోగతం ఇది.. (జి.రామచంద్రారెడ్డి/బి.నగేష్, అనంతపురం)అనంతపురం సప్తగిరి సర్కిల్లో.. ఉదయం 7.20 గంటలకు అనంతపురం కలెక్టరేట్ వద్దకు వెళ్తే ఫరీద్, రాము టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. జగన్ మళ్లీ గెలుస్తాడని ఫరీద్ చెబితే.. తాను పక్కా టీడీపీ అని అయినా ఈసారి అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి గెలుస్తాడని రాము చెప్పాడు. అక్కడ నుంచి కందుకూరు వైపు రాప్తాడు నియోజకవర్గం వెళ్తుండగా మధ్యలో ఇటుకల బట్టీ వద్ద ఆగి కూలి పని చేస్తున్న మాధవితో మాట్లాడితే.. తనకు ఏటా రూ.9,100 చొప్పున డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అందాయని, అర్హత ఉన్న పథకాలన్నీ వచ్చాయని చెప్పింది.కందుకూరు శివారులో.. ఉదయం 8.10: కందుకూరు శివారులోని జగనన్న కాలనీ వద్ద ఆగాం. లబ్ధిదారులు ఈడిగ మహేశ్వరి, సరస్వతి, లక్ష్మీదేవి లు మాట్లాడుతూ.. ‘ఇక్కడ సెంటు రూ. 3 లక్షలకు పైగా ఉంది. మాకు సెంటున్నర స్థలం ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించారు. జగన్ సాయం మరచిపోలేం’ అన్నారు. కందుకూరులో ఓ అరుగుపై తలారి ఓబుళపతి, సాకే నారాయణ, ఆర్.నారప్పరెడ్డి, రాగే యల్లప్ప కూర్చుని ఉండగా పలకరించాం. పరిటాల సునీతను రెండుసార్లు గెలిపించినా తమ ఊరికి రోడ్డు కూడా వేయించలేదని.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయ్యాక రోడ్డుకు మోక్షం వచ్చిందన్నారు. జగన్ పాలనలో ఇంటికే పథకాలు అందుతున్నాయని చెప్పారు. ధర్మవరం మండలం చిగిచెర్లలో.. ఉదయం 9.20: ధర్మవరం మండలం చిగిచెర్లలో టైలర్ మాబు తారసపడ్డారు. ‘జగన్ సొమ్ము తిని ఎలా మరచిపోతాం. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడు. నా ఇద్దరు కూతుళ్లకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందించారు. నా భార్యకు రూ.70 వేలు డ్వాక్రా రుణ మాఫీ డబ్బులు వేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి పట్టించుకోలేదు’ అని మనసులో మాట బయటపెట్టాడు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్లో.. పెద్దన్నను పలకరించగా.. ‘మాకు అమ్మఒడి, ఆసరా పథకాలు అందాయి. నాకు వృద్ధాప్య పింఛన్ రూ. 3 వేలు వస్తోంది. ప్రతి నెలా వలంటీరు తెచ్చేవాడు. వలంటీర్లు వద్దని ఎవరో చెప్పారంట ఏప్రిల్లో ఇంటికి రాలేదు. తెచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డాం’ అని చెప్పాడు.ధర్మవరం శివారు ఇందిరమ్మ కాలనీలో.. ఉదయం 10.10: ధర్మవరం శివారులోని ఇందిరమ్మకాలనీ.. చేనేత కార్మికులైన పల్లా రంగయ్య, నాగరత్నమ్మ ఇంటికి వెళ్లాం. ఇద్దరూ చీర నేస్తుండగా పలకరించాం.. ‘వైఎస్సార్ హయాంలో మాకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించారు. జగన్ వచ్చాక నేతన్ననేస్తంలో ఏటా రూ. 24 వేలు ఇస్తున్నారు. కరోనా సమయంలో చేసిన సాయం మరిచిపోలేం. మా ముగ్గురు కూతుళ్లకు రెండు నెలల వ్యవధిలోనే కాన్పులు చేశాం. ఆ సమయంలో జగనన్న సాయం చేశాడు. జగన్కే ఓటు’ అని చెప్పారు. చెన్నేకొత్తపల్లిలో ఉదయం 11 గంటలకు: చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాం. టీస్టాల్ నిర్వాహకుడు దివాకర్రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరిలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయన్నాడు. నాగసముద్రం పంచాయతీ పల్లెన్నగారిపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయనే భయం ఓటర్లలో ఉందన్నాడు. అనంతరం పెనుకొండ మండలం గుట్టూరులో ఆటోడ్రైవరు ఆంజనేయులుతో మాట్లాడాం. మా కుటుంబానికి రూ.5 లక్షలకు పైగా లబ్ధి జరిగింది. పథకాల కోసం ఏ నాయకుడి వద్దకు, అధికారి వద్దకు వెళ్లలేదు. వలంటీరు వచ్చి రాసుకుని వెళ్లేవాడు.’ అని చెప్పాడు.ప్యాదిండి సమీపంలో..ధర్మవరం నుంచి ప్యాదిండి మీదుగా ఎన్ఎస్ గేట్ వైపు వెళ్లగా.. మధ్యలో చీనీ తోటలో కూర్చున్న రైతులు భాస్కర్రెడ్డి, పార్థసారథిరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడాం. తమకు ఏటా సగటున రూ.లక్ష వరకు పంటల బీమా వచ్చిందన్నారు. ఏటా రూ. 13,500 రైతు భరోసా వస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో మండల కేంద్రానికి వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పాయన్నారు. పెనుకొండ పట్టణంలో.. మధ్యాహ్నం 12 గంటలకు: మునిమడుగులో ఆటో డ్రైవర్ మహిధర్, హోటల్ నిర్వాహకురాలు రాధమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి సంక్షేమ పథకం అందిందని చెప్పారు. మధ్యాహ్నం పెనుకొండ పట్టణంలో రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆంజనేయులును కలవగా.. ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో పేదలకు సాయం జరిగిందని.. సాయం చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. అంతకు ముందు చెన్నేకొత్తపల్లిలో రామాంజనేయులు మాట్లాడుతూ తాను టీడీపీ అభిమానినని, ఈ ప్రభుత్వంలో ఎవరి సిఫార్సు లేకుండానే సంక్షేమ పథకాలు అందాయమన్నారు. అర్హత ఉన్న ప్రతి పథకం అందిందన్నారు. పెనుకొండలో రామకృష్ణ మాట్లాడుతూ పథకాలు నిష్పక్షపాతంగా అందాయని.. ఓటు మాత్రం ఎవరికి వేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. విశాఖ జిల్లా రోడ్ షోపాలన బాగుంది.. మరోసారి అవకాశంపల్లె, పట్టణం, ఊరు, వాడ ఎటు చూసినా ఫ్యాన్ గాలే.. పేద.. ధనిక.. అవ్వా తాత.. అక్కా చెల్లి.. అన్నా.. తమ్ముడు.. ఎవర్ని అడిగినా జగనే అన్నారు. సుపరిపాలనే జగనన్న పాలనకు శ్రీరామరక్ష అని ఆటో డ్రైవర్ అంటే.. ఇంటి దగ్గరకే సంక్షేమాన్ని అందించడం నచ్చిందని కిరాణా కొట్టు మహిళ చెప్పింది. మాకు సాయపడ్డ జగన్కే ఓటేస్తామని కొబ్బరి బొండాలమ్మే వ్యక్తి చెప్పగా.. చంద్రబాబు కంటే.. అన్నదాతని ఆదుకున్న జగన్ వెయ్యి రెట్లు మేలని రైతు బదులిచ్చారు. ఇసుక విధానం మార్చితే బాగుంటుందని ఓ మేస్త్రీ అభిప్రాయపడ్డాడు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సాక్షి రోడ్షోలో అత్యధిక శాతం జగన్ పాలన బాగుందని, మరోసారి అవకాశం ఇస్తామని చెప్పారు. విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గం నుంచి తూర్పు, భీమిలి, పెందుర్తి మీదుగా అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, చోడవరం, అనకాపల్లి వరకూ సాగిన రోడ్షోలో ఓటర్ల మనోగతం ఇది.. –కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నంబాలయ్య శాస్త్రి లేఅవుట్(విశాఖ ఉత్తరం) ఉదయం 8.30 గంటలు: కొబ్బరి బొండాలు కొడుతున్న రాజుని పలకరించగా.. మనకెందుకు బాబాయ్ రాజకీయాల గురించి.. అంటూ తటపటాయించాడు. ఏ పార్టీ ఈసారి గెలిస్తే బాగుంటుందని అడగ్గా.. ‘ఇక్కడైతే కేకే రాజు పక్కా.. కరోనా రోజుల్లో ప్రతి ఇంటికీ భరోసా ఇచ్చారు. పైన మాత్రం జగనే వస్తాడు. మా బంధువుల్లో ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ఇచ్చారు. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి’ అని చెప్పాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే.. రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఇస్త్రీ బండి దగ్గర ఉన్న సన్యాసిరావులు కూడా జగన్ రావచ్చని చెప్పారు. హనుమంతవాక జంక్షన్(విశాఖ తూర్పు) ఉదయం 9 గంటలు: ఆటోడ్రైవర్లు చిన్ని, పాండురంగను పలకరించగా.. ఈ సారి జనసేన వస్తుందని చిన్ని చెప్పగా.. 100 శాతం జగనేనండీ అంటూ పాండు సమాధానమిచ్చాడు. పాండు : 21 సీట్లతో జనసేన ఎలా వస్తుందిరా.? చిన్ని: 21 కాదు.. 25 పాండు : 25 కాదు.. 50 అనుకో.. పవన్ సీఎం అవుతారా.? చూడండి.. ఎవరేమనుకున్నా.. జగనే మళ్లీ సీఎం అవుతారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీవీ సత్యనారాయణ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అయితే రాష్ట్రంలో మాత్రం జగన్ మళ్లీ సీఎం అవుతారు అని పాండు అన్నాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లగా.. ఫ్రూట్జ్యూస్ అమ్ముతున్న శ్రీను మాత్రం ఎవరొస్తారో చెప్పలేమన్నారు. ముందుకెళ్లి టిఫిన్ సెంటర్ చందుని అడిగితే జగన్ పక్కా అంటూ నవ్వుతూ తన పనిలో మునిగిపోయాడు.సింహాచలం కొండ దిగువన.. ఉదయం 10 గంటలకు: భీమిలి పరిధిలోని సింహాచలం కొండ దిగువన ఆగగా.. వృద్ధురాలు కనిపించింది. మళ్లీ ఎవరొస్తారని అడగ్గా.. ‘చంద్రబాబు రాకూడదు. మాఊళ్లో అందరి జీవితాలు అతని వల్లే పోయాయి. పంచగ్రామాల సమస్య పరిష్కారం కాలేదు. కోర్టుకెళ్లడానికి కారణం చంద్రబాబే. పవన్ ఒక్కడొచ్చుంటే మా కులపోడని ఆలోసించేవాళ్లమేమో. ఇప్పుడది కూడా పోయింది’ అంటూ ఆటో ఎక్కేసింది. పక్కనే ఉన్న సెలూన్ షాప్ ఈశ్వర్, పూల దుకాణం మస్తాను ఫ్యాన్ గ్యారెంటీ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం గాంధీనగర్లో.. ఉదయం 11 గంటలకు:నేరుగా పెందుర్తి నియోజకవర్గంలోని గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన యూపీహెచ్సీకి వెళ్లగా.. తాపీ మేస్త్రీ రామారావు కనిపించాడు. ‘జగన్ బాగా సెయ్యలేదని మేం సెప్పట్లేదు. మా పిల్లలకు మంచి సదువు ఇచ్చారు. ఆస్పత్రి పెట్టి మాకు వైద్యం ఇచ్చినాడు. ఏ ఇబ్బంది వచ్చినా.. ఇక్కడికే ముందు వస్తాం. మందులన్నీ మంచిగా ఇస్తారు. ఒక్క ఇసక ఇషయంలో మాత్రం ఇబ్బంది పడ్డాం’ అని చెప్పుకొచ్చాడు. పెందుర్తి, పినగాడి నుంచి.. సబ్బవరం మండలం గుల్లేపల్లి మీదుగా వెళ్తుండగా.. కల్లుగీత కార్మికుడు లావేటి వెంకట్రావు తారసపడ్డాడు. ‘మేము తీసే కల్లు లాగే మా జగన్ ప్యూర్. జగన్ అంటేనే నిలువెత్తు నమ్మకం. చంద్రబాబు కల్పితాలు ఎన్నయినా చెప్పొచ్చు. కానీ చేసి చూపించింది మాత్రం జగన్ ఒక్కడే’ అన్నాడు.మాడుగుల మండలం కె.కోటపాడులో.. మధ్యాహ్నం 12.30 గంటలకు: మాడుగుల మండలం కె.కోటపాడు వెళ్లి నారాయణమ్మ అనే మహిళను పలకరించాం. ‘ మా ఆయనకు కాలు, చేయి పనిచేయదు. జగన్ మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతి నెలా ఇంటికే పెన్షన్ ఇస్తున్నారు. చేయూతలో రూ.18,750తో చిన్న కొట్టు పెట్టుకున్నాను. ఆ షాపుపై రుణం వచ్చింది. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు’ అని ఆనందంగా చెప్పింది. పీఎస్పేట(చోడవరం నియోజకవర్గం, విశాఖ రోడ్షో)మధ్యాహ్నం ఒంటి గంటకు: చోడవరం నియోజకవర్గం పీఎస్ పేటలో చెరకు రైతుల్ని పలకరించాం. రైతు తలారి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ హయాంలో రెండు రాçష్ట్రాల్లో 28 కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలుంటే.. చంద్రబాబు వచ్చాక గోవాడ ఒక్కటే మిగిలింది. ఆ ఫ్యాక్టరీని చంద్రబాబు రూ.120 కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. జగన్ వచ్చాక ఆ అప్పుల్ని తగ్గించారు. ఫ్యాక్టరీ నడిపేందుకు రూ.80 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. మళ్లీ జగన్ వస్తేనే ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు. ఒక్క రూపాయి చెల్లించలేదు. నా దగ్గర బాండు ఉంది చూపిస్తాను’ అన్నాడు. మిగిలిన రైతులు నాయుడు, వెంకట్రావు, సూర్యనారాయణ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనకాపల్లి వైపు వెళ్తుండగా.. రిటైర్డ్ ఉద్యోగి కేవీ గౌరీపతిని పలకరించగా.. ‘అనకాపల్లి జిల్లా కేంద్రం కావాలన్న కలని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ లోకల్ నేత బూడి ముత్యాల నాయుడిని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు’ అని చెప్పారు. -
నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలో 21, ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్సార్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. నిప్పులుగక్కిన ఎండ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా ఎండ నిప్పులుగక్కింది. పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగానెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
తృణమూల్లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement