హైవేలపై పెరిగిన వాహన స్పీడ్
తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
ఓఆర్ఆర్ పరిధిలో తగ్గిన హైస్పీడ్
హైదరాబాద్: హైదరాబాద్లో ఇక నుంచి వాహనాల వేగానికి రెక్కలురానున్నాయి. ఔటర్ వంటి బహుళ వరుసల రహదారులపై రయ్మని ముందుకు వెళ్లే చోదకుల్లో తాజా నిబంధనలు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వాహనాల జోరుకు కళ్లెం వేస్తున్న నిబంధనల్లో తాజాగా స్వల్పంగా మార్పులు చేస్తూ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు త్వరలో నగరంలోనూ అమల్లోకి రానున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. గతంలో కార్లు గంటకు 65 కి.మీ. వేగంతో మాత్రమే దూసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించేవి. తాజాగా నిబంధనల్లో సడలింపు కారణంగా గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లే అవకాశం రానుందని జంట పోలీసు కమిషనరేట్ల ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు భారీ వాహనాలు, ట్రక్కులు, కార్లు, ద్విచక్ర వాహనాలకు గతంలో ఉన్న వేగ పరిమితులు(స్పీడ్లిమిట్స్)లోనూ మార్పులు చేసినట్లు చెప్పారు.
ఔటర్పై తస్మాత్ జాగ్రత్త..!
స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్ (వేగం హుషారెక్కిస్తుంది..కానీ మిమ్మల్ని తిరిగిరానిలోకాలకు పంపిస్తుంది) అన్న విషయాన్ని చోదకులు మరవరాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఔటర్ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న రహదారులపై ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు ధరించడం, మితిమీరిన వేగానికి కళ్లెం వేయడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సినీ ఫక్కీలో ఫీట్లు చేసే కుర్రకారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఓఆర్ఆర్ పరిధిలో పాత ఉత్తర్వులు..
గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు డివైడర్కు ఒక పక్క మొదటి, రెండు లైన్లలో మాత్రమే వెళ్లాలి. వాహనం వేగం 80కి తగ్గినా, 120 కి.మీ. వేగం పెరిగినా స్పీడ్గన్ పసిగట్టడం ద్వారా చలానా విధిస్తారు. ఇక గంటకు 40 నుంచి 80 కి.మీ. వేగంతో వెళ్లే వాహనాలు మూడు, నాలుగు లైన్ల ద్వారా వెళ్లాలి. ఇక్కడ కూడా 40కి తగ్గినా 80 కి.మీ. వేగం పెరిగినా చలానా తప్పదు.
ఓఆర్ఆర్ పరిధిలో తాజా ఉత్తర్వులు..
మొదటి, రెండు లైన్లలో మాత్రమే వేగం లో మార్పులు చేశారు. ఇక్కడ గంటకు 80 - 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. గతంలో 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవారు.
సైబరాబాద్లోకి వచ్చే హైవేలు ఇవే....
నాగ్పూర్ , బెంగళూరు, ముంబాయి, విజయవాడ, వరంగల్, బీజాపూర్, నర్సాపూర్, రాజీవ్ , శ్రీశైలం, నాగార్జునసాగర్
ఇక 100 తొక్కొచ్చు
Published Fri, Apr 24 2015 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
వాల్మీకులు కాంగ్రెస్ వెంటే..
మోసపూరిత హామీలు నమ్మొద్దు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement