- రాష్ట్ర విభజన తరువాత పెరిగిన గంజాయి రవాణా
- పీడీ చట్టంతో సాగుదారుల గుండెల్లో రైళ్లు
సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జోరందుకుంది. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో ఎక్కడా పండనంత గంజాయి జీకేవీధి మండలం దారకొండ, గుమ్మిరేవులు, గాలికొండ, ఎ.దారకొండ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు పాతుకోట, గుత్తేరు వంటి పంచాయతీలలో సుమారు 200 గ్రామాల్లో, వేలాది ఎకరాల్లో గంజాయి పంట సాగవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గంజాయి రవాణా ఈ ప్రాంతం నుంచే పెద్దఎత్తున సాగుతోందని తెలిసింది.
ప్రస్తుతం తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాలతోపాటు విశాఖ జిల్లాలో దొరుకుతున్న గంజాయి ఈ ప్రాంతం నుంచే కాలిబాటన మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయితో పాటు స్మగ్లర్ల వద్ద తుపాకులు కూడా దొరికిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై మళ్లీ పీడీ యాక్టు తేవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ ప్రాంత గంజాయి స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాలుగేళ్ల క్రితం సీలేరులో భారీ ఎత్తున గంజాయి రవాణా చేసిన 14 మందిని గుర్తించి పోలీసులు విచారణ చేపట్టి వదిలేశారు. మళ్లీ ఇప్పుడు పీడీయాక్టు తెరపైకి పోలీసు శాఖ తీసుకురావడం, గంజాయి స్మగ్లర్ల ఆస్తులు, భూములు ఎక్కడెక్కడున్నాయని దానిపై ఆరా తీస్తున్నారు.
వెంకటేశ్వరరావు గంజాయి ప్రస్తావన సీలేరు నుంచే 2 రోజుల క్రితం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో 5 బస్తాల గంజాయి, 2 పిస్తోళ్లు, 28 బుల్లెట్లతో దొరికి జిల్లా పోలీసు వర్గాల్లో కలకలం రేపిన గంజాయి స్మగ్లర్లలో ఒకరైన వెంకటేశ్వరరావు గంజాయి ప్రస్తానం తొలుత సీలేరు నుంచే ప్రారంభమైంది. పదేళ్ల క్రితం సీలేరులో ఓ కాంట్రాక్టరు దగ్గర రాళ్ల కొట్టుకుంటూ జీవనం సాగించి తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశాక సీలేరు ఫారెస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు. అనంతరం సారా వ్యాపారం చేసి గంజాయిపై మోజుపడి అక్కడ నుంచి తన గంజాయి వ్యాపారాన్ని రూ.కోట్లలో టర్నోవర్ చేసేవాడు. కొంత మంది బడావ్యాపారులతో ఈ గంజాయి రవాణా చేస్తు రూ.లక్షలు ఇక్కడే సంపాదించి అనంతరం కొన్ని కేసుల్లో చిక్కుకోవడంతో సీలేరు వదిలి నర్సీపట్నంలో ఉండేవాడు. అతను గంజాయితో పట్టుబడినట్లు పత్రికల్లో తెలుసుకున్న స్థానికులు అవాక్కయ్యారు.
సరిహద్దులో గంజాయి జోరు
Published Wed, May 6 2015 3:57 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement