సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్ను జిల్లా నుంచి పంపించేందుకు బడా పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్లో ఎత్తులు వేస్తున్నాయి. ఆమె బదిలీ కోసం పారిశ్రామికవేత్తలంతా కలిసి ఏకంగా సెక్రటేరియట్లోనే లాబీయింగ్ మొదలుపెట్టారు. ‘ముఖ్య’నేత బంధువు ద్వారా ఇప్పటికే ‘రాయబేరాలు’ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. రూ.కోట్లకు కోట్లు ఆర్జిస్తూ ‘సామాజిక బాధ్యత’ను మరిచిపోయిన కంపెనీల ముక్కుపిండి సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులు వసూలు చేయాలనుకోవడమే ఆమెపై పారిశ్రామికవేత్తల గుర్రుకు కారణంగా తెలుస్తోంది.
రూ.కోట్లలో ‘సామాజిక బాధ్యత’ బకాయిలు
జిల్లాలోని ప్రతి పరిశ్రమ స్థాపనకు అయ్యే వ్యయంలో 0.02 శాతం సొమ్మును సీఎస్ఆర్ నిధుల కింద చెల్లించాలి. జిల్లాలో దాదాపు 958 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ లెక్కన కార్పొరేటు కంపెనీలు రూ.కోట్లలో బకాయి పడ్డాయి. వీటినుంచి 2012-13 ఆర్థిక సంవత్సరానికే రూ.41.64 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల వసూలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవ ల సంబంధిత అధికారులతో ‘సామాజిక బాధ్యత’ నిధులపై సమీక్ష జరిపారు.
జనవరి మాసాంతం లోపు కనీసం 50 శాతం బకాయిలు వసూలు చేయాలని, నిధులు చెల్లించని పరిశ్రమల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇలా వసూలుచేసిన మొత్తాన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాలని ఆమె నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమించి పరిశ్రమల వివరాలన్నీ తెప్పించారు. బాకీ వసూలుచేసే బాధ్యతను కూడా వారికే అప్పగించారు.
ఈ పరిస్థితుల్లో సీఎస్ఆర్ బకాయి నిధులు చెల్లించడం ఆయా కంపెనీలకు అనివార్యంగా మారింది. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఏకమై సీఎస్ఆర్ నిధులు చెల్లించకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఒకసారి సీఎస్ఆర్ నిధులు చెల్లించడం ప్రారంభిస్తే ప్రతి కలెక్టర్ ఇదే విధానాన్ని కొనసాగిస్తారనే భయంతోనే వారంతా కలెక్టర్ స్మితాసబర్వాల్ను బదిలీ చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
సీఎస్ఆర్ నిధుల బకాయి రూ.41 కోట్లు ఉండడంతో అందులోని 25 శాతం నిధులు ఖర్చు చేస్తే కలెక్టర్నే బదిలీపై పంపొచ్చనే ఆలోచనతో పారిశ్రామికవేత్తలంతా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్లో కూర్చుని సచివాలయంలో పథక రచన చేస్తున్నారని, అవసరమైతే ఢిల్లీ నుంచి ఒత్తిడి తెచ్చి ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
పంపేందుకు పైరవీ
Published Sat, Feb 1 2014 12:33 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement