మూడు కొత్త కోర్సులకు ప్రతిపాదనలు | Sakshi
Sakshi News home page

మూడు కొత్త కోర్సులకు ప్రతిపాదనలు

Published Wed, Jan 28 2015 5:24 PM

initiatives send to state governament for start three new courses in ng ranga university

కర్నూలు : పీజీలో మూడు కొత్తకోర్సుల ఏర్పాటుకు ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ కళాశాల వైస్‌ఛాన్సలర్ ఎ.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తిరుపతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజి, బాపట్లలోని విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సీడ్ టెక్నాలజి, వాటర్ టెక్నాలజి కోర్సులను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నారు.

ఈ విషయమై మహానందిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మీటింగ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేసే లెక్చరర్లు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement