తాండూరు టౌన్, న్యూస్లైన్:
ప్రముఖ బీమా కంపెనీ పేరుతో ఓ బోగస్ సంస్థ కార్యాలయం తెరిచింది. జనాన్ని నమ్మించి డబ్బులు వసూలు చేసింది. బాండ్లు ఇవ్వమంటే నీళ్లు నములుతుండడంతో పాలసీదారులు నిలదీశారు. దీంతో బోగస్ సంస్థ గుట్టురట్టు అయింది. రెక్కల కష్టం దోచుకుపోయారని బాధితులు లబోదిబోమంటున్నారు. తాండూరు పట్టణ డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మల్లప్పమడిగ వద్ద ఓ భవనంలో ఓ ప్రముఖ కార్పొరెట్ కంపెనీ పేరుతో ఈ ఏడాది మార్చి నెలలో కార్యాలయం తెరిచారు. కంపెనీ ప్రధాన బ్రాంచ్లు కాకినాడ, సామర్లకోటలో ఉన్నట్లు జనాన్ని నమ్మబలికారు.
కార్యాలయంలో సుమారు 10 మంది వరకు పని చేస్తున్నారు. పథకం ప్రకారం ముందుగా తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మధ్య తరగతి, ఆపై స్థాయి వారికి ఫోన్లు చేశారు. 1000 మంది లక్కీ డ్రాలో మీ ఫోన్ నంబర్ ఎంపికైందని, మా కంపెనీ యాజమాన్యం మీకు ఉచితంగా రూ.లక్ష విలువ గల బీమా బాండ్ను ఇస్తుందని నమ్మబలుకుతారు. కార్యాలయానికి సతీసమేతంగా వచ్చి బాండ్ తీసుకువెళ్లాలని వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన జనానికి ఓ గంటపాటు బీమా పాలసీల గురించి వివరించి వారు ఏదో ఓ పాలసీలో చేరేలా చేస్తున్నారు. పాలసీని బట్టి ఒక్కొక్కరి దగ్గర రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నట్లు ఓ రశీదు కూడా ఇచ్చి వారం రోజుల తర్వాత వచ్చి రూ.లక్ష ఉచిత పాలసీ బాండ్తో పాటు, డబ్బులు చెల్లించిన బీమా పాలసీ బాండ్ను తీసుకెళ్లాలని చెప్పసాగారు. ఇలా పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 15 లక్షలు వసూలు చేశారు.
పాలసీదారులకు బాండ్లు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో పలువురు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పటణంలోని దోబీ గల్లీకి చెందిన ఇడ్లీ బండి నడుపుకొనే శ్రీనివాస్ తన పేరుమీద, భార్య పేరు మీద రెండు పాలసీలు చేసి రూ.70 వేలు చెల్లించాడు. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా బాండ్లు ఇవ్వకపోవడంతో శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కార్యాలయం మీద దాడిచేసి కంపెనీకి చెందిన నలుగురు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. పలు ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ చెప్పారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ బోగస్ కంపెనీ మూలాలను వెతికి పట్టుకుని త్వరలోనే సంబంధీకులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. కాగా బాధితులు లబోదిబోమంటున్నారు. పాలసీదారులకు న్యాయం చేయాలని స్థానికులు పోలీసులను కోరారు.
బీమా పేరిట టోకరా..
Published Sun, Oct 13 2013 11:48 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement