తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Published Tue, Oct 14 2014 8:58 AM

తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

తిరుపతి : తిరుపతి తుమ్మలకుంటలోని ఓ ప్రయివేట్ కళాశాల క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన రేఖ ... ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.  సోమవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది.  అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే రేఖ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం గత రాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేసి రేఖకు సీరియస్గా ఉందని చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు.

తాము కాలేజ్ వద్దకు వచ్చేసరికి ఇక్కడ యాజమాన్యంకి సంబంధించిన వారు ఎవరూ లేరని అన్నారు. తన కుమార్తె  ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని,  ఆమె శరీరంపై ఉరి వేసుకుని చనిపోయిన ఆనవాళ్లు  లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రేఖ తలను బలంగా గోడకేసి కొట్టి ఉండటం వల్లే  చనిపోయి ఉంటుందన్నారు. ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు  చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement