► బయటపడిన కళా, అచ్చెన్న వర్గాల మధ్య ఆదిపత్యపోరు
► ఎవరికి వారే అవతలి వర్గాన్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
► చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చిన పరిటాల
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరిటాల సునీత సాక్షిగా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కళావెంకటరావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలతో పాటు ఎవరికి వారే అవతలి వర్గాన్ని సస్పెండ్ చేయాలంటూ సునీతకు ఫిర్యాదు చేయడం విశేషం. జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం మధ్యాహ్నం పార్టీ అంతర్గత సమావేశం సునీత నిర్వహించారు. ఈ సమీక్షకు విలేకరులను పిలవలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సమావేశం 3 గంటల వరకూ జరిగింది. సమీక్ష మధ్యలో పాలకొండ, కొత్తూరు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన తగాదాలు చర్చకు వచ్చాయి.
పార్టీలో విశేషాలు ఏంటని మంత్రి అడుగగా పాలకొండ వర్గీయులు..పార్టీనేత కర్నేని అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిమ్మక జయకృష్ణ సహా నేతలంతా కుండ బద్దలుగొట్టారు. అదే సమయంలో ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాలంటూ కళావెంకటరావు వర్గం భగ్గుమంది. పార్టీని పదేళ్లపాటు జెండా మోసి కష్టకాలంలో ఆదుకుని అధికారంలోకి తెస్తే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మరో టీడీపీ నాయకురాలు ఖండాపు జ్యోతి ఆరోపణలు గుప్పించారు. తనకు ఓ ఉన్నత పదవి ఇప్పిస్తామని మోసం చేశారంటూ వాపోయారు. వెనువెంటనే పాలకొండ పార్టీ ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణను పదవి నుంచి తప్పించాలని మరో వర్గం డిమాండ్ చేసింది.
దీనికి మిగతావారు కొంతమంది వంతపాడారు. వీటన్నింటికీ మూల కారణం జిల్లా మంత్రి అచ్చెన్న, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళావెంకటరావు మధ్య ఎప్పటినుంచో చోటుచేసుకుంటున్న విభేదాలేనని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చివరాఖరులో ఎవరినీ సస్పెండ్ చేయక్కరలేదు. మీరు చెప్పింది అధిష్టానం దృష్టికి తీసుకువెళతానంటూ పరిటాల సునీత నవ్వుకుంటునే విభేదాలను ముక్తాయించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శివాజీ, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గుండ లక్ష్మీదేవి, సహా విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్టీ నేత చౌదరి బాబ్జి, పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జిలు నిమ్మక జయకృష్ణ, శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి, బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
సునీత సాక్షిగా..భగ్గుమన్న వర్గ విభేదాలు
Published Fri, Aug 28 2015 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement