అల్లిపురం: ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగలను కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాం డ్కు తరలించారు. వారి వద్ద నుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి సామగ్రి, 4 కెమెరాలు, 3 రిస్ట్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం క్రైం డీసీపీ టి.రవికుమార్ మూర్తి కేసు వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా జే స్టాంబ్ చౌక్ దరి, పూర్ణా బిలాయ్-3కి చెందిన బమ్మిడి సంతోష్ 2009 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై 27 ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో కూడా నిందితుడు.
ఇతను ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో 9 సార్లు సెంట్రల్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ ఏడాది మార్చి 23న విజయనగరం సబ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్న అతనికి పందిమెట్ట, నౌరోజీ రోడ్డు, ముత్యాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న రేకల అప్పలరాజు కంచరపాలెం కపరాడలో షెల్టర్ ఏర్పాటు చేశాడు. పోలీసులు వీరిపై నిఘా ఉంచడంతో తరచూ బస మారుస్తుండేవారు. కాగా.. బమ్మిడి సంతోష్కు జైలులో పరిచయమైన శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం కృష్ణాపురంనకు చెందిన కిల్లి వెంకటేష్ తోడయ్యాడు. శ్రీకాకుళం, ఆమదాలవలసలో వెంకటేష్పై కేసులు నమోదై ఉన్నాయి.
నగరంలో ఆరు దొంగతనాలు
వీరు ముగ్గురు కలసి నగరంలో ఎయిర్పోర్టు, ఆరిలోవ, పీఎం పాలెం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకొక్కటి, దువ్వాడ స్టేషన్ పరిధిలో రెండు చొప్పున మొత్తం ఆరు ఇంటి దొంగతలనాలకు పాల్పడ్డారు. ఈ దొంగతనాలకు సంబంధించి 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి సామగ్రి, 5 కెమెరాలు, 12 రిస్ట్ వాచ్లు, రెండు సెల్ఫోన్లు, రూ.1.59 లక్షల నగదు అపహరించుపోయారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వద్ద గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి సామగ్రి, 4 కెమెరాలు, 3 రిస్ట్ వాచీలు, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ తెలిపారు. కేసులను ఛేదించిన క్రైం సీఐ ఆర్. గోవిందరావు, ఎస్ఐలు జి. రవికుమార్, డి. విశ్వనాథం, కానిస్టేబుళ్లు ఎస్. హరిప్రసాద్, అప్పలరాజు, రమేష్, హోం గార్డు టి. అప్పలరాజులను డీసీపీ అభినందించారు.
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
Published Fri, Aug 28 2015 12:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement