జడ్చర్ల టౌన్, న్యూస్లైన్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, విద్య, ఉద్యోగాల సమస్య ఉత్పన్నమవుతుంద ని పది మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తప్పుదోవపట్టిస్తూ సమైక్య ఉద్యమాన్ని చేపట్టారని ఖాదీబోర్డు సౌత్జోన్ చైర్మన్ కాళప్ప ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళుతూ మార్గమధ్యంలో జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారానికి తుంగభద్రపై ఉన్నట్లుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డులను కృష్ణా, గోదావరికి నియమిస్తే ఏ సమయంలో ఎవరికి ఎంత నీళ్లు ఇవ్వాలో తేల్చవచ్చన్నారు. విద్యాపరంగా తెలంగాణ కన్నా అధికంగా సీమాంధ్రలోనే యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. ఐటీ విషయంలోనూ విశాఖ లాంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చేసే అవకాశముందన్నారు. అమెరికాలాంటి దేశాల్లో కార్యాలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
కేవలం పది మంది పెట్టబడిదారులు వారి జిల్లాలను అభివృద్ధి చేయకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భూ వ్యాపారాలకు పాల్పడి కోట్లు గడించారని ఆరోపించారు. అభివృద్ధి అంటే నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమించి భవనాలు నిర్మించటమేనా? అని ప్రశ్నించారు. సీమాంధ్రలో బడుగు, బలహీనవర్గాల నాయకులే లక్ష్యంగా సమైక్య ఉద్యమం సాగుతోందని విమర్శించారు.
ఇంతవరకు బీసీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు కాని ఇతర నాయకులను ఎందుకు లక్ష్యంగా పెట్టుకోలేదో అందరూగ్రహించాలన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి సంజీవ్ముదిరాజ్, వాల్మీకి సేవాసమితి రాష్ట్ర నాయకుడు అయ్యన్న, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు రంగాచారి, కార్యదర్శి వడ్ల శేఖర్, స్వర్ణకారుల సంఘం ఉపాధ్యక్షుడు శేఖరాచారి, న్యాయవాది వినోద్, నాయకులు జగదీశ్, వేణు, తిరుపతయ్య పాల్గొన్నారు.
పెట్టుబడిదారుల వల్లే సీమాంధ్ర ఉద్యమం
Published Mon, Oct 7 2013 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
Advertisement