శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్లైన్: జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణకు, క్రీడాకారుల శిక్షణ కార్యక్రమాలకు ఒకే ఒక్క ఆధారమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల ఇక్కడ ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల ముగింపు సభలో కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ స్టేడియం మరమ్మతులకు త్వరలో రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారే తప్ప ఆధునికీకరణ పనుల ఊసెత్తకపోవటంతో క్రీడాభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు స్పం దిస్తూ కేఆర్ స్టేడియం ఆధునికీకరణ గురించి పట్టించుకోకుండా నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపడతామని చెప్పటం సబబు కాదని కూడా అన్నారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు.
ఇదీ పరిస్థితి
1983లో నిర్మించిన కేఆర్ స్టేడియంలో 17 వేల మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత ఇండోర్ స్టేడియం నిర్మించారు. తర్వాత పట్టించుకోవటం మానేయటంతో గ్యాలరీలోని సిమెంట్ కట్టడాలు శిథిలమై కూలిపోతున్నాయి. స్టేడియాన్ని ఆధునికీకరించాలని డిమాండ్లు ఎక్కువవటంతో నాలుగేళ్ల క్రితం అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచన మేరకు ఆధునికీకరణ పనులకు సుమారు రూ.17 కోట్లు అవసరమని అంచనా వేశారు. తర్వాత దీనిని రూ.12 కోట్లకు కుదించారు. తాజాగా రూ.10 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం వుడా అనుమతి తీసుకున్నారు. తర్వాత మైదానం లోని మటి ్టశాంపిళ్లను సైతం సేకరించటంతో పనులు జరగటం ఖాయమని క్రీడాసంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు ఎంతో సంతోషించారు. తర్వాత ఈ ప్రతిపాదన తెరవెనక్కి వెళ్లిపోయింది. నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం తెరపైకి వచ్చింది.
మరమ్మతులతో సరి
9 నెలల క్రితం జెడ్పీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించటంతో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఉన్న భవనానికి మరమ్మతులు చేపట్టారు. వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులకు ఫ్లడ్లైట్లు అమర్చారు. ఇండోర్ స్టేడియంపైకప్పు వేయించారు. తాజాగా మరో రూ.20 లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పటంతో ఇప్పట్లో ఆధునికీకరణ లేనట్టేనని అందరూ భావిస్తున్నారు.
ప్లాన్లో లోపాల వల్లే జాప్యం
ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్లాన్లో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నందువల్లే జాప్యం జరుగుతోందని డీఎస్డీవో ఎల్.దేవానందం చెప్పారు. కలెక్టర్ సూచన మేరకు కొత్త ప్లాన్ను ఉన్నతాధికారులకు పంపామని వెల్లడించారు. స్టేడియం ఆధునికీకరణను రూ.10 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారని, ఇందులో రూ.5 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ, రూ.5 కోట్లు వుడా అందజేయనున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నామన్నారు.
కే. ఆర్. స్టేడియం ఆధునికీకరణపై నీలినీడలు!
Published Thu, Dec 19 2013 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement