హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసినందుకే రాజధాని భూముల్లో రెండో పంట సాగుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని భూముల్లో రెండో పంట సాగుపై ప్రభుత్వం వెనకడుగు 'మా అందరి విజయం' అని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకుని.. రాజధానికి భూములిచ్చిన రైతులకు కూడా రెండో పంట వేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎన్నికలకు ముందిచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ఎక్కడికైనా (విదేశీ పర్యటనలు) తిరగొచ్చునని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబునాయుడు మాత్రం పార్టీ బలోపేతం కోసం తెలంగాణలో పర్యటించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు వాస్తు పిచ్చితో కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్కే విమర్శించారు.