ఉద్యోగ జేఏసీ రూ. 125 కోట్ల విరాళం | Sakshi
Sakshi News home page

ఉద్యోగ జేఏసీ రూ. 125 కోట్ల విరాళం

Published Sat, Oct 18 2014 12:54 AM

JAC per employment. 125 million donation

 హైదరాబాద్: హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్‌దారులు కలిపి మొత్తం సుమారు రూ. 125 కోట్ల విరాళాన్ని ఇస్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఉద్యోగుల రెండ్రోజుల మూలవేతనాన్ని సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అందిస్తున్నట్లు  ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పి.అశోక్‌బాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
 
 

Advertisement
Advertisement