విజయవాడ, న్యూస్లైన్ : రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చిన కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తోందని వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్రెడ్డి మండిపడ్డారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజల రాష్ట్రాన్ని సోనియాగాంధీ కేకు ముక్కలా కోసేసిందని ధ్వజమెత్తారు. కోట్లాదిమంది ప్రజల మనోగతంకన్నా కాంగ్రెస్ పార్టీకి నీచ, స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ.. జనహితమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ప్రజలకు సమన్యాయం చేయాలనే డిమాండ్తో పోరు సాగిస్తున్నామని చెప్పారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా ప్రజాసమస్యలపై పోరాటమే ఊపిరిగా ముందుకెళుతున్నారన్నారు. ఆయన జైల్లో సైతం ఉద్యమజ్వాల రగిలించిన పోరాట యోధుడని కొనియాడారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన కుటుంబం ఏదైనా ఉందంటే, అది వైఎస్సార్ కుటుంబమేనన్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ముందుగా నడుంబిగించింది ఆ కుటుంబమేనని పేర్కొన్నారు.
ఉద్యమం నీరుగార్చేందుకు కుట్ర..
టీడీపీ, కాంగ్రెస్లు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నుతున్నాయని గౌతమ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు సిద్ధమైన పార్టీలు ఇప్పుడు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆత్మగౌరవయాత్రకు రావడం సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని హితవు చెప్పారు.
లగడపాటీ.. నీవెక్కడ?
ఎంపీ లగడపాటి రాజగోపాల్ బఫూన్లా మారి సరికొత్త విన్యాసాలతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని గౌతమ్రెడ్డి ఎద్దేవా చేశారు. నిజంగా ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే సోనియా ఇంటిముందు ధర్నా చేయాలన్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సూచించారు. పదవుల్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించడం తప్ప లగడపాటి ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. చివరికి ఆయన సమైక్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే లగడపాటి ముఖం చాటేసిన సంగతి ప్రజలు మరిచిపోరన్నారు.
జైలు నుంచే జగన్ ప్రజా ఉద్యమం: పి.గౌతమ్రెడ్డి
Published Sun, Sep 1 2013 1:39 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement